AP Secretariat: ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నాం: హోంమంత్రి
- సచివాలయంలో అగ్ని ప్రమాదం
- అగ్నిప్రమాదం జరిగిన రెండో బ్లాక్ను పరిశీలించిన హోంమంత్రి
- ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో అగ్ని ప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కొద్దిసేపట్లో ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి పరిశీలన చేస్తారన్నారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నామని, ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది అని హోంమంత్రి చెప్పారు. ఈ రోజు ఉదయం ఏపీ సచివాలయం రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీ రూమ్ పూర్తి స్థాయిలో కాలిపోయింది. ఆ బ్లాక్లో ఇంకా పొగ, బ్యాటరీ వాసన ఎక్కువగా ఉంది.
సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన రెండో బ్లాక్ను హోంమంత్రి అనిత పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను హోంమంత్రికి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వివరించారు. ప్రమాదం జరిగిన రూంలో ఫైర్ అలారం సిస్టం లేకపోవడం పట్ల హోం మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సచివాలయంలోని అన్ని బ్లాక్లలో పూర్తిస్థాయిలో తనిఖీ చేసి అగ్ని ప్రమాదాల విషయంలో ఏ మేరకు సురక్షితమో రిపోర్టు ఇవ్వాలని హోంమంత్రి ఆదేశించారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం, హోంమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఉండే కీలక బ్లాకుల్లో ఈ ప్రమాదం జరగడం పట్ల హోంమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Also Read
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
సచివాలయంలో అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తుకు హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. ‘సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణ జరుగుతోంది. ఫోరెనిక్స్ నిపుణులు పరిశీలించి ఆధారాలు సేకరిస్తారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నాం. సచివాలయంలో ఫైర్ సేఫ్టీ అడిట్ నిర్వహిస్తాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తాం’ అని హోంమంత్రి తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఇప్పటికే సచివాలయంకు చేరుకుంది.
తాజావార్తలు
-
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..