AP Secretariat: ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నాం: హోంమంత్రి
- సచివాలయంలో అగ్ని ప్రమాదం
- అగ్నిప్రమాదం జరిగిన రెండో బ్లాక్ను పరిశీలించిన హోంమంత్రి
- ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో అగ్ని ప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కొద్దిసేపట్లో ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి పరిశీలన చేస్తారన్నారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నామని, ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది అని హోంమంత్రి చెప్పారు. ఈ రోజు ఉదయం ఏపీ సచివాలయం రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీ రూమ్ పూర్తి స్థాయిలో కాలిపోయింది. ఆ బ్లాక్లో ఇంకా పొగ, బ్యాటరీ వాసన ఎక్కువగా ఉంది.
సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన రెండో బ్లాక్ను హోంమంత్రి అనిత పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను హోంమంత్రికి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వివరించారు. ప్రమాదం జరిగిన రూంలో ఫైర్ అలారం సిస్టం లేకపోవడం పట్ల హోం మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సచివాలయంలోని అన్ని బ్లాక్లలో పూర్తిస్థాయిలో తనిఖీ చేసి అగ్ని ప్రమాదాల విషయంలో ఏ మేరకు సురక్షితమో రిపోర్టు ఇవ్వాలని హోంమంత్రి ఆదేశించారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం, హోంమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఉండే కీలక బ్లాకుల్లో ఈ ప్రమాదం జరగడం పట్ల హోంమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
సచివాలయంలో అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తుకు హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. ‘సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణ జరుగుతోంది. ఫోరెనిక్స్ నిపుణులు పరిశీలించి ఆధారాలు సేకరిస్తారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నాం. సచివాలయంలో ఫైర్ సేఫ్టీ అడిట్ నిర్వహిస్తాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తాం’ అని హోంమంత్రి తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఇప్పటికే సచివాలయంకు చేరుకుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?