Home Minister Anitha: తప్పు చేసిన వారికి శిక్షపడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది..
- తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది..
- వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులే ఎందుకు అరెస్టు అవుతున్నారో తెలుసా..
- టీడీపీ వల్ల ఒక్క అధికారి కూడా అరెస్ట్ కాలేదు: హోంమంత్రి వంగలపూడి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తప్పు చేసిన వారికి శిక్షపడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం వెళ్తోందన్నారు. మా ప్రభుత్వంలో సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఏ కేసులోనూ ముందుకు వెళ్లలేదు.. తప్పు చేసిన వారిని పారదర్శకంగానే శిక్షిస్తున్నాం.. టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఎంత ఆవేశం ఉన్నా, గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారి పట్ల ఓ పద్ధతి ప్రకారం చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులే ఎందుకు అరెస్టు అవుతున్నారో వైసీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. జగన్ వల్ల గతంలో శ్రీలక్ష్మీ లాంటి అధికారులు కూడా జైలుకు వెళ్లారు.. తెలుగుదేశం ప్రభుత్వంలో పని చేసిన అధికారులు ఇబ్బంది పడలేదని తేల్చి చెప్పారు. అక్రమ కేసులతో నాయకులు బలయ్యారు.. కానీ, మా వల్ల అధికారుల అరెస్టు కాలేదని మంత్రి అనిత తెలిపారు.
Read Also: Lady Aghori: పూజల పేరుతో లక్షల్లో మోసం.. లేడీ అఘోరీ అరెస్ట్
Also Read
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
అయితే, టీడీపీ ప్రభుత్వం తప్పు చేయలేదనటానికి ఇదే నిదర్శనమని మంత్రి అనిత పేర్కొన్నారు. జగన్ నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వచ్చి అక్రమ కేసులపై మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెప్తారని ఎద్దేవా చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల విజ్ఞాపన మేరకే కేసును పునర్ విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. గత ముఖ్యమంత్రితో శభాష్ అనిపించుకోవటానికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన అధికారులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అని ఆరోపించింది. ఇలాంటి వారంతా న్యాయస్థానంలో విచారణను ఎదుర్కోవాల్సిందే అని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
-
Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
-
Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
-
Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!