Home Minister Anitha: తప్పు చేసిన వారికి శిక్షపడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది..
- తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది..
- వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులే ఎందుకు అరెస్టు అవుతున్నారో తెలుసా..
- టీడీపీ వల్ల ఒక్క అధికారి కూడా అరెస్ట్ కాలేదు: హోంమంత్రి వంగలపూడి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తప్పు చేసిన వారికి శిక్షపడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం వెళ్తోందన్నారు. మా ప్రభుత్వంలో సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఏ కేసులోనూ ముందుకు వెళ్లలేదు.. తప్పు చేసిన వారిని పారదర్శకంగానే శిక్షిస్తున్నాం.. టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఎంత ఆవేశం ఉన్నా, గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారి పట్ల ఓ పద్ధతి ప్రకారం చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులే ఎందుకు అరెస్టు అవుతున్నారో వైసీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. జగన్ వల్ల గతంలో శ్రీలక్ష్మీ లాంటి అధికారులు కూడా జైలుకు వెళ్లారు.. తెలుగుదేశం ప్రభుత్వంలో పని చేసిన అధికారులు ఇబ్బంది పడలేదని తేల్చి చెప్పారు. అక్రమ కేసులతో నాయకులు బలయ్యారు.. కానీ, మా వల్ల అధికారుల అరెస్టు కాలేదని మంత్రి అనిత తెలిపారు.
Read Also: Lady Aghori: పూజల పేరుతో లక్షల్లో మోసం.. లేడీ అఘోరీ అరెస్ట్
Also Read
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
అయితే, టీడీపీ ప్రభుత్వం తప్పు చేయలేదనటానికి ఇదే నిదర్శనమని మంత్రి అనిత పేర్కొన్నారు. జగన్ నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వచ్చి అక్రమ కేసులపై మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెప్తారని ఎద్దేవా చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల విజ్ఞాపన మేరకే కేసును పునర్ విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. గత ముఖ్యమంత్రితో శభాష్ అనిపించుకోవటానికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన అధికారులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అని ఆరోపించింది. ఇలాంటి వారంతా న్యాయస్థానంలో విచారణను ఎదుర్కోవాల్సిందే అని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!