Bank Robbery: సూసైడ్ చేసుకుంటానంటూ 40 లక్షలు దోచుకెళ్లిన వ్యక్తి!
- ఉత్తరప్రదేశ్లోని షామ్లీలో వింత ఘటన.
- గుర్తు తెలియని వ్యక్తి ఓ ప్రైవేట్ బ్యాంకు శాఖకు వెళ్లి రూ.40 లక్షలు దోచుకెళ్లాడు.
- ఆత్మహత్య చేసుకుంటానని
- లేదంటే బ్యాంకు మేనేజర్ని చంపేస్తానని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Robbery: ఉత్తరప్రదేశ్లోని షామ్లీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ ప్రైవేట్ బ్యాంకు శాఖకు వెళ్లి రూ.40 లక్షలు దోచుకెళ్లాడు. బ్యాంకు మేనేజర్తో మాట్లాడుతూ.. తనకు రూ.38.5 లక్షల ఇంటి రుణం బాకీ ఉందని, తన ఆస్తిని వేలం వేయబోతున్నారని, దీంతో తన పిల్లలు నిరాశ్రయులవుతారని నిందితుడు చెప్పాడు. కాబట్టి నాకు రూ.40 లక్షలు ఇవ్వండి అంటూ.. నిందితుడు బ్యాంక్ మేనేజర్తో సుమారు 30 నిమిషాల పాటు మాట్లాడి, అకస్మాత్తుగా తన వద్ద తుపాకీ ఉందని చెప్పాడు. ఆ తర్వాత.. తనకు రూ.40 లక్షలు ఇవ్వాలని, లేకుంటే బ్యాంకులో ఆత్మహత్య చేసుకుంటానని, లేదంటే బ్యాంకు మేనేజర్ని చంపేస్తానని బెదిరించాడు.
Mahalaya Amavasya 2024: నేడే మహాలయ అమావాస్య! ఎందుకు జరుపుకుంటారు? నవరాత్రులకు సంబంధం ఏమిటి?
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
దాంతో చేసేదేమి లేక.. అతడి ప్రాణాలను కాపాడేందుకు బ్యాంక్ మేనేజర్ క్యాషియర్ను పిలిచి రూ.40 లక్షలు నిందితుడికి ఇచ్చాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటన జరిగిన సమయంలో బ్యాంకులో సుమారు 25 మంది ఉన్నారు. వారిలో 12 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు. బ్యాంక్ మేనేజర్ వీపుపై తుపాకీ పెట్టడంతో బ్యాంకు మేనేజర్, క్యాషియర్ బయటకు తీశారు.
Gandhi Jayanthi 2024: భారత కరెన్సీపై మహాత్మా గాంధీ ఫోటో పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసా?
ఈ ఘటనపై షామ్లీ ఎస్పీ రామ్సేవక్ గౌతమ్ మాట్లాడుతూ.. షామ్లీలోని ధిమన్ పురాలోని బ్యాంక్ ప్రధాన శాఖలో ఈ ఘటన జరిగిందని., బ్యాంక్ మేనేజర్ నమన్ జైన్ దొంగ దగ్గర తుపాకీ ఉందని గుర్తించలేకపోయాడు. అయితే, నిందితుడి వద్ద తుపాకీ ఉందని బ్యాంకు గార్డు పేర్కొన్నాడు. ఈ కేసుపై ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని.. వారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని, బ్యాంకు ఉద్యోగులను విచారిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?