Raebareli: యూపీలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్ర.. రాయ్బరేలీలో ట్రాక్పై ఇసుక కుప్ప
- యూపీలో రైలు పట్టాలపై ఇసుక కుప్ప..
- అప్రమత్తమైన లోకో పైలట్ ట్రైన్ ను నిలిపివేసిన వైనం..
- ఘటనపై విచారణ చేస్తున్న ఖీరూన్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raebareli: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పట్టాలు తప్పించేందుకు కుట్రలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన రాయ్బరేలీ జిల్లాలో జరిగింది. ఖీరూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను చూసిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వెంటనే నిలిపివేశాడు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఖీరోన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దేవేంద్ర భడోరియా మాట్లాడుతూ.. డంపర్ నుంచి రైల్వే ట్రాక్పై ఇసుక పోశారని, దానిని తొలగించిన తర్వాత రైలు వెళ్లిందన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది. స్థానికంగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. దీంట్లో భాగంగా మట్టిని రవాణా చేసే పని రాత్రిపూట జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ డ్రైవర్ డంపర్ నుంచి ఇసుకను రైల్వే ట్రాక్పై పోసి అక్కడి నుంచి పారిపోయాడన్నారు. ఇది జరిగిన కొసేపటికే రాయ్ బరేలీ- రఘురాజ్ సింగ్ స్టేషన్ మధ్య నడుస్తున్న షటిల్ రైలు ఈ రూట్లో వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
Read Also: Suryakumar Yadav: అది పెద్ద తలనొప్పి అయ్యింది: సూర్యకుమార్
Also Read
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
- Pak ISI: తప్పిన పెను ప్రమాదం.. పాకిస్తాన్ ISI ఉగ్రవాద ముఠాను పట్టుకున్న పోలీసులు..
- India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
ఇక, ఆ రైలు లోకో పైలట్ రైల్వే ట్రాక్పై మట్టిని గమనించి.. రైలును ఆపాడని ఖోరోన్ పోలీస్ ఇన్ స్పెక్టర్ దేవేంద్ర భడోరియా చెప్పుకొచ్చారు. లోకో పైలట్ అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.. రైల్వే ట్రాక్పై మట్టిని తొలగించిన తర్వాత రైలు నెమ్మదిగా ముందుకు వెళ్లిందన్నారు. ఈ టైంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి వచ్చారు. గేట్మెన్ మాట్లాడుతూ రైలు వేగం తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది.. ఒకవేళ వేగం ఎక్కువగా ఉంటే రైలు పట్టాలు తప్పేది అన్నారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారని చెప్పుకొచ్చారు.
#रायबरेली के खीरों क्षेत्र में रेलवे ट्रैक पर मिट्टी का ढेर मिलने से ट्रेन के ड्राइवर ने सतर्कता दिखाते हुए समय रहते ट्रेन को रोक दिया, जिससे एक बड़ा हादसा टल गया। जानकारी के अनुसार, डंपर से ट्रैक पर मिट्टी गिर जाने का दावा किया जा रहा है। पुलिस और रेलवे प्रशासन ने मौके पर… pic.twitter.com/Mn05EmrZV9
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) October 7, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్పైనే అందరి కళ్లు..!
-
Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
-
Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
-
Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
-
Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?