Agra Shocker: కూతురు సెక్స్ స్కాండల్లో ఉందని బ్లాక్మెయిల్.. ఆగిన తల్లి గుండె..
- కూతురు సెక్స్ రాకెట్లో చిక్కుకుందని సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్..
- రూ. 1 లక్ష ఇవ్వాలని తల్లికి బెదిరింపులు..
- గుండెపోటుతో మరణించిన తల్లి..
- ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agra Shocker: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో దారుణం జరిగింది. సైబర్ నేరగాళ్ల నకిలీ బెదిరింపులకు, బ్లాక్మెయిల్కి భయపడిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందించింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధిత మహిళకు, ఆమె కూతురు ‘‘సెక్స్ రాకెట్’’ ఇరుక్కుందని నేరగాళ్లు కాల్ చేసి బెదిరించారు. వెంటనే రూ. 1 లక్ష ట్రాన్స్ఫర్ చేయాలని లేకపోతే మీ కూతురు వీడియోలను విడుదల చేస్తామని చెప్పడంతో మహిళ తీవ్రంగా భయపడిపోయింది.
మహిళ తీవ్రంగా భయపడి గుండెపోటుకి గురయ్యారు. ఆమెని ఆస్పత్రికి తరలించే లోపే మరణించారు. ఆగ్రాలో డిజిటల్ అరెస్ట్ కారణంగా మరణించిన తొలి కేసు ఇది. జగదీష్పురా పోలీస్ స్టేషన్లోని సుభాష్ నగర్ అల్బాటియా నివాసి మల్తీ వర్మ అనే మహిళ అచ్నేరాలోని ప్రభుత్వ జూనియర్ హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె సెప్టెంబర్ 30న పాఠశాలలో విధులు నిర్వర్తిస్తుండగా, ఆమె మొబైల్కి వాట్సాప్ కాల్ వచ్చింది. నిందితుడి డీపీగా పోలీస్ యూనిఫాం ధరించిన వ్యక్తి ఫోటో ఉంది. నిందితుడు మీ కూతురు సెక్స్ రాకెట్లో చిక్కుకుందని, ఇంకా కేసు ఫైల్ కాలేదని, మీ పరువు పోకూడదని, మీ కూతురి ఫోటోలు వైరల్ కాకూడదనే ఉద్దేశంతోనే ఫోన్ చేశానని, లక్ష రూపాయలు పంపిస్తే రిలీజ్ చేస్తామని చెప్పాడు.
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
Read Also: Joe Biden: ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చు
నిందితుడు ఒక నెంబర్ పంపించి, దానికి 15 రోజుల్లో రూ. లక్ష పంపాలని చెప్పాడు. లేదంటే మీ కూతురిపై చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. దీంతో భయపడిన మాల్తీవర్మ తన కొడుకు దీపాంశుకు ఫోన్ చేసింది. ఈ సమయంలో కాల్ చేసిన వ్యక్తి సుమారు అరగంట పాటు ఆమెని డిజిటల్ అరెస్ట్లో ఉంచాడు. కొడుకుకి నిందితుడి నెంబర్ పంపించి, తాను పంపిన నెంబర్కి రూ. లక్ష పంపాలని చెప్పింది.
అయితే, కొడుకు దీపాంశుకి ఈ నెంబర్ చూసి అనుమానం వచ్చింది. ఈ నెంబర్ మన దేశానికి చెందిన నెంబర్ కాదని అనిపించి, నెంబర్ తప్పుగా ఉందని తల్లి మాల్తీ వర్మకు చెప్పాడు. దీంతో తనకు వచ్చిన ఫోన్ గురించి కుమారుడితో మొత్తం చెప్పింది. అయినా కూడా తన కూతురు సెక్స్ రాకెట్లో చిక్కుకుందని భయపడుతూనే ఉంది. కొడుకు దీపాంశు తన ఇద్దరు సోదరీమణులు ఎక్కడ ఉన్నారని ఆరా తీయగా, ఒకరు పాఠశాలలో మరొకరు బజారులో ఉన్నట్లు తేలింది. వారిద్దరు తల్లితో మాట్లాడేలా చేశారు. అయినా కూడా మాల్తీ వర్మ షాక్ నుంచి బయపడక, భయపడుతూనే ఉంది. ఇంటికి చేరుకున్న వెంటనే గుండెపోటుకి గురై మరణించింది.
డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి..?
నకిలీ కాలర్లు, సైబర్ నేరగాళ్లు పోలీసులు, సీబీఐ, ఈడీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల అధికారుల వలే నటిస్తూ కాల్ చేస్తుంటారు. సదరు వ్యక్తి లేదా అతని కూతురు, కొడుకు ఇలా ఎవరో ఒకరు ఏదో రాకెట్లో పట్టుబడినట్లు బెదిరిస్తారు. వారిని విడిపించేందుకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారు. ఈ విషయాలను ఎవరి చెప్పొద్దని, వీడియో కాల్ చేస్తే కాల్ కట్ చేయొద్దని బెదిరించి, వారిని భయపెట్టి నగదు ట్రాన్ఫర్ అయ్యేలా చేస్తుంటారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!