Crime: రూ.300 కోట్లకు పైగా మోసం చేసి.. సాధువుగా మారిన నిందితుడు.. చివరికీ..
- మహారాష్ట్రలో వేలాది మందిని మోసం చేసిన నిందితుడు
- రూ.300 కోట్లకు పైగా దండుకున్న వైనం
- సాధువుగా మారిన నిందితుడు
- ఛేదించి పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో వేలాది మందిని మోసం చేసి రూ.300 కోట్లకు పైగా దండుకున్న వ్యక్తిని మధుర నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సన్యాసి వేషంలో మధురలో తలదాచుకున్నాడు. దీనిపై సమాచారం ఇస్తూ.. తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు నిందితుడు సన్యాసి వేషంలో ఇక్కడ తలదాచుకున్నాడని పోలీసులు తెలిపారు. జాతీయా మీడియా కథనం ప్రకారం.. బృందావన్, బీడ్ జిల్లా పోలీసుల సంయుక్త ఆపరేషన్లో కృష్ణ బలరామ్ టెంపుల్ సమీపంలో బాబాన్ విశ్వనాథ్ షిండే పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. షిండే
READ MORE: Amit Shah: ఎంఎస్పి పూర్తి పేరు తెలుసా..? రాహుల్ గాంధీ టార్గెట్గా విమర్శలు
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
దాదాపు రూ.300 కోట్ల విలువైన మోసానికి సంబంధించిన పలు కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు. వందలాది మందిని మోసం చేసిన షిండే.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సాధువు రూపంలో ఢిల్లీ, అసోం, నేపాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తలదాచుకుని జీవించాడని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ కుమార్ సింగ్ తెలిపారు. చివరికి బృందావనంలో దాక్కున్నట్లు దొరికిపోయాడని చెప్పారు. మంగళవారం అర్ధరాత్రి నిందితుడిని అరెస్టు చేసి, మరుసటి రోజు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు కోర్టులో హాజరుపరిచారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన క్రైమ్ బ్రాంచ్ బృందం మధుర కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తరువాత అతన్ని అరెస్టు చేసింది.
READ MORE:Crime: స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష
బీడ్ జిల్లా ఎస్ఎస్పీ అవినాష్ బర్గల ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం షిండేను ఛేదించింది. ఈ బృందంలోని సభ్యుడు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ ముర్కుటే తెలిపిన వివరాల ప్రకారం.. షిండే తమ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తానని ప్రజలను మోసగించి, రాష్ట్ర సహకార బ్యాంకులోని నాలుగు శాఖల్లో తమ డబ్బును పెట్టుబడి పెట్టేలా చేశాడు. ఇలా చాలా మందిని మోసం చేసి రూ. 300లకు పైగా మోసానికి పాల్పడ్డాడు. నిందితులు చేసిన మొత్తం మోసంలో దొంగిలించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులు కూడా ఉన్నాయి. మోసం కేసులో నిందితులు 2,000 మందికి పైగా జీవితాలను నాశనం చేశాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!