UP: యూపీలో ఘోరం.. క్షుద్ర పూజలకు విద్యార్థిని బలి ఇచ్చిన యాజమాన్యం
- యూపీ హాథ్రస్లో ఘోరం
- క్షుద్ర పూజలకు విద్యార్థిని బలి ఇచ్చిన యాజమాన్యం
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన హాథ్రస్లో వెలుగుచూసింది. స్కూల్ యాజమాన్యమే ఒక విద్యార్థిని పొట్టనపెట్టుకుంది. తమ స్వార్థం కోసం ఏకంగా ఒక విద్యార్థిని బలి ఇచ్చింది. ఈ ఘటన భారతీయులను కలిచి వేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Minister Ramanaidu: సాగు నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం.. విడుదలైన జీవో..
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ పాఠశాల మూఢ నమ్మకాలను విశ్వసించి ఓ విద్యార్థిని బలి ఇవ్వడం యూపీలో సంచలనంగా మారింది. స్కూల్ ప్రతిష్ఠను పెంచుకునేందుకు రెండో తరగతి విద్యార్థిని బలి ఇచ్చారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హాథ్రస్లోని ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఒక విద్యార్థిని బలి ఇచ్చిందని వెల్లడించారు. స్కూల్ హాస్టల్లో అతడిని చంపేశారని తెలిపారు. ఈ వారంలోనే జరిగినా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల డైరెక్టర్ తండ్రి బ్లాక్ మ్యాజిక్ను విశ్వసిస్తాడని వెల్లడించారు. తొలుత స్కూల్ బయట ట్యూబ్వెల్ సమీపంలో ఆ పిల్లాడిని చంపాలనుకున్నారని, అయితే హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్తున్నప్పుడు అతడు భయంతో కేకలు వేయడంతో గొంతు నులిమి హత్యచేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Viral News: భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు దీవినే కొనేసిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?(వీడియో)
సోమవారం పాఠశాల యాజమాన్యం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందని విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడని సమాచారం ఇచ్చారన్నారు. కారులో డైరెక్టర్ తన బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాడని సిబ్బంది చెప్పారన్నారు. తర్వాత ఆ కారులో తన కుమారుడి మృతదేహం కనిపించిందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోన్న పోలీసులు బ్లాక్ మ్యాజిక్కు సంబంధించిన వస్తువులను గుర్తించారు. ఈ కేసులో పాఠశాల యజమాని జశోధన్ సింగ్, అతని కుమారుడు, స్కూల్ డైరెక్టర్గా ఉన్న దినేష్ బాఘేల్, ముగ్గురు ఉపాధ్యాయులతో సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: AP CM Chandrababu: తిరుమల సన్నిధిలో ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలి..
తాజావార్తలు
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
-
Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
-
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..