ఒసామా బీన్ లాడెన్ ప్రపంచాన్ని గడగడలాండించన ఉగ్రవాది. 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్ను కూల్చివేతలో ప్రధానపాత్ర పోషించిన వ్యక్తి. పాక్లో తలదాచుకున్న సమయంలో ఆయన్ను అమెరికా సైన్యం హతమార్చింది. లాడెన్ సోదరుడు ఇబ్రహీమ్ కు లాస్ ఎంజెల్స్లో ఓ విలాసవంతమైన భవంతి ఉన్నది. 2001 ఘటనకు ముందు వరకు ఆ ఇంట్లో ఇబ్రహీమ్ లాడెన్ కుటుంబ సభ్యులు ఉండేవారు. ఎప్పుడైతే 2001లో ట్విన్ టవర్స్ కూల్చివేత జరిగిందో ఆ తరువాత ఆ కుటుంబం ఆ ఇంటిని ఖాళీ…
ప్రపంచంలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నది. 130కి పైగా దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపించింది. అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యాక జో బైడెన్ 100 రోజుల కార్యాచరణను తీసుకొచ్చారు. 100 రోజులు ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని, ఆ తరువాత అవసరం లేదని అన్నారు. 100 రోజుల కార్యచరణ తరువాత మాస్క్ను తప్పని సరి నుంచి తొలగించారు. ఆ తరువాత కథ మళ్లీ మొదటికి వచ్చింది. గత పది రోజుల నుంచి ఆ దేశంలో కేసులు…
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొన్ని నెలల క్రితం రెండు దేశాల మధ్య ఏర్పాటు చేసిన హాట్లైన్ను ధ్వంసం చేశారు. మరోసారి కొరియా యుద్ధం తప్పదేమో అన్నంతగా పరిణామాలు మారిపోయాయి. అయితే, నెల రోజుల క్రితం నుంచి క్రమంగా మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు దేశాల సరిహద్దుల్లో ద్వంసం చేసిన కార్యాలయాలను తిరిగి ఏర్పాటు చేశారు. ఇరుదేశాల అధినేతలు హాట్లైన్లో మూడుసార్లు చర్చించుకున్నారు. కొరియా మధ్య సయోధ్య కుదిరితే బాగుంటుందని అందరూ అనుకున్నారు. …
అనంతమైన విశ్వంలో భూమితో పాటుగా ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఆస్ట్రాయిడ్స్ భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోతూ భూమిపై పడుతుంటాయి. జూరాసిక్ కాలంలో ఆస్ట్రాయిడ్స్ భూమీని ఢీకొట్టడం వలనే ఆ భారీ జంతువులు నశించిపోయాయి. అయితే, అప్పుడప్పుడు మనకు ఆకాశంలో రాలిపడుతున్న నక్షత్రాలు, భూమివైపుకు దూసుకొస్తున్న ఉల్కలు కనిపిస్తుంటాయి. ఇలాంటి దృశ్యాలు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మరోసారి కనిపించాయి. Read: హృతిక్, విజయ్, సమంత, కియారా, దుల్కర్ మల్టీ స్టారర్! పెద్దవైన ఫైర్బాల్స్ కాంటివంతంగా…
అమెరికా కరోనా నుంచి కోలుకున్నాక మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునేందుకును సిద్ధం అవుతున్నది. దేశంలో మౌళిక వసతుల రూపకల్పనకు రూ.75 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్కు సెనెట్కు ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది. దేశంలో మౌళిక వసతుల రూపకల్పన జరిగితే, అమెరికాలో దశాబ్దకాలం పాటు ఏటా 20 లక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. సెనెట్లో ప్రస్తుతం పాథమిక ఆమోదం మాత్రమే పొందింది. అయితే, దీనికి ఇంకా తుది ఆమోదం లభించాల్సి ఉన్నది. ప్రస్తుతం సెనెట్లో రిపబ్లకన్లు-డెమోక్రాట్లకు…
అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతో ఆ మధ్య వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కన్పించినా.. గత కొన్ని రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది. అమెరికాలో 24 గంటల వ్యవధిలో 88 వేల 376 కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవడం ఇదేసారి. కరోనా టీకా పంపిణీలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 55శాతానికి మించి కనీసం…
సాధారణంగా వృద్దాప్యంలోకి వచ్చిన తరువాత గతం మర్చిపోతుంటారు. అది సహజం. కానీ, 37 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి తన గతాన్ని మర్చిపోయాడు. అదీ నిద్రనుంచి లేచిన వెంటనే అలా తన గతాన్ని మర్చిపోయి, 16 ఏళ్ల చిన్న పిల్లవాడిగా భావించి స్కూలుకు వెళ్లేందుకు రెడీ అయ్యాడు. భర్త విచిత్రమైన పరిస్థితిని చూసి భార్య షాక్ అయింది. తనకు పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని భార్య చెప్పినా భర్త నమ్మలేదు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు.…
చైనాలోని ఊహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని ఇప్పటికే అనేక కథనాలు వెలువడ్డాయి. అమెరికాతో సహా అనేక దేశాలు కరోనా వైరస్ ల్యాబ్ నుంచే లీకయిందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో గతంలో పర్యటించిన తరువాత ల్యాబ్ నుంచి వచ్చిందా లేదా అన్నదానిపై మరింత విపులంగా పరిశోధించాలని పేర్కొన్నది. ల్యాబ్ నుంచి లీకైందని కొట్టిపారెయ్యలేమని చెప్పింది. మరోసారి చైనాలో పర్యటించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ…
ఎప్పుడో సోకిన వ్యాధులు తిరిగి మళ్లీ విస్తరిస్తున్నాయి. 18 ఏళ్ల క్రితం అంటే 2003వ సంవత్సరంలో అరుదైన మంకీఫాక్స్ కేసులు అనేకం వ్యాపించాయి. ఆ తరువాత ఆ కేసులు మెల్లిగా కనుమరుగయ్యాయి. కాగా, ఇప్పుడు మరోసారి ఈ కేసులు బయటపడుతుండటంతో అమెరికా అప్రమత్తం అయింది. ఇటీవలే టెక్సాస్కు చెందిన ఓ వ్యక్తి నైజీరియా వెళ్లి వచ్చాడు. అలా వచ్చిన వ్యక్తిలో ఈ మంకీఫాక్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆ వ్యక్తిని డాలస్లోని ఆసుపత్రిలో వేరుగా ఉంచి చికిత్స…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో బలగాలు తప్పుకుంటున్నాయి. నాటో, అమెరికా బలగాలు తప్పుకోవడంతో ఆ దేశంలో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లోని అనేక ప్రాంతాలను తాలిబన్ ఉగ్రవాదులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ప్రతిరోజు అక్కడ హింసలు చెలరేగుతున్నాయి. ఉగ్రవాదుల దౌర్జన్యాలకు అమాయకమైన ప్రజలు బలి అవుతున్నారు. అమెరికా, నాటో బలగాలు తప్పుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ విమర్శించారు. అమెరికా, నాటో బలగాలు ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడం మంచి నిర్ణయం కాదని, బలగాల ఉపసంహరణ తరువాత…