ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో దళాలు తప్పుకోవడంతో ఆ దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సెప్టెంబర్ 11 వరకు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా, ఆ ప్రక్రియను అమెరికా వేగవంతం చేయడంతో తాలిబన్లు దురాక్రమణకు పాల్పడ్డాయి. వేగంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాయి. ఆదివారంరోజున రాజధాని కాబూల్ నగరంలోకి ప్రవేశించడంతో ఆఫ్ఘన్ తాలిబన్ల వశం అయింది. ఈ పరిస్థితికి అమెరికానే కారణం అని ప్రపంచం మొత్తం విమర్శలు చేస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్…
తాలిబన్లు కాబూల్లోకి చొచ్చుకొస్తుండటంతో అన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నాయి. తమ ఉద్యోగులు, సిబ్బందిని స్వదేశానికి తరలించేందుకు పెద్ద ఎత్తున విమానాలను సిద్దం చేశారు. ఆర్మీ హెలికాప్టర్లు, విమానాలు అన్నింటిని స్వదేశానికి తరలించేందుకు కాబూల్ ఎయిర్పోర్టులో ఉన్నాయి. అయితే, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తొలుత వారి దేశానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బ్రిటన్ తమ వారిని తరలించిన తరువాతే మిగతావారిని తరలిస్తామని చెబుతుండటంతో ఆఫ్ఘన్లు ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో…
2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్పై అల్ఖైదా ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో వరల్డ్ ట్రేడ్ టవర్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు జూనియర్ బుష్ ఆఫ్ఘనిస్తాన్లోని అల్ఖైదా నాయకుడు లాడెన్ ఉన్నాడని, అతడిని తమకు అప్పటించాలని అమెరికా కోరింది. కానీ, అందుకు అప్పటి తాలిబన్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ఆఫ్ఘన్లోని తాలిబన్ సేనలపై అమెరికా సైనికులు దాడులు చేశారు. తాలిబన్లను తరిమికొట్టి ఆ దేశంలో ప్రజాస్యామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పారు. అప్పటి…
తాలిబన్ల పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది. లక్షలాది మంది సైనికులు, ఆధునిక ఆయుధసంపత్తి, 20 ఏళ్లుగా అమెరికా సైన్యం ఇచ్చిన ట్రైనింగ్లో రాటు తేలిన ఆఫ్ఘన్ సైనికులను రెండు వారాల వ్యవధిలోనే ఓడించి దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు. తాము లేకున్నా, ఆఫ్ఘన్ సైనికులు పోరాటం చేయగలరనే ధీమాతో ఆమెరికా అక్కడి నుంచి వైదొలిగింది. సెప్టెంబర్ 11 వరకు ఆఫ్ఘన్ నుంచి పూర్తిగా వెనక్కి వచ్చేయాలని ఆమెరికా నిర్ణయం తీసుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోయారు. చాలా ప్రాంతాల్లో…
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోలేదు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడుతుండటంతో మరింత రక్షణ కోసం మూడో డోస్ వ్యాక్సిన్ను ఇవ్వాలని అమెరికా సీడీసి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సగం జనాభాకు రెండు డోసుల వ్యాక్సిన్లను అందించారు. మూడో డోస్ ఇవ్వడం వలన అదనపు రక్షణ కలుగుటుందని రెండు డోసులు తీసుకున్నవారికి మూడో డోసు ఇవ్వాలని సీడీసి పేర్కొన్నది. అవయవ మార్పిడి చేయించుకున్నవారు, ఇతర కారణాల చేత బలహీనంగా ఉన్న వ్యక్తులు…
అమెరికా-పాక్ దేశాల మధ్య మంచి మైత్రి ఉన్నది. అయితే, ఈ మైత్రి గత కొంతకాలంగా సజావుగా ఉండటంలేదు. పాక్లో ఉగ్రవాదం పెరిగిపోవడంతో పాటుగా, ఆ దేశం చైనాతో బలమైన సంబందాలు కలిగి ఉండటం వలన అమెరికా పాక్ కు దూరమైందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రెండు దశాబ్దాల కాలం క్రితం అమెరికా దళాలు అఫ్ఘనిస్తాన్లో అడుగుపెట్టి తాలిబన్, ఆల్ఖైదా వంటి తీవ్రవాద సంస్థలపై విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో పాక్ సహకారంలో అమెరికా తాలిబన్ల ఆటకట్టించింది. ప్రస్తుతం అమెరికా-పాక్…
భూమిపై జీవరాశి ఏదైన ప్రమాదం సంభవించి నివశించడానికి అనుకూలంగా లేకపోతే… పరిస్థితి ఏంటి? మనుగడ సాగించడం ఎలా..? ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మార్స్ గ్రహంపై నాసా పరిశోధనలు చేస్తున్నది. ఎప్పటికైనా మార్స్ మీదకు మనుషులను పంపి అక్కడ కాలనీలు ఏర్పాటు చేసి నాగరికతను విస్తరింపజేయాలని చూస్తున్నది. ఇందులో భాగంగా భూమిపై మార్స్ గ్రహంలో ఉండే విధమైన కృత్రిమ వాతావరణాన్ని నాసా సృష్టించింది. అక్కడ సంవత్సరంపాటు మనుషులను ఉంచి మార్స్ మీదకు వెళ్లినపుడు మనుషులు ఎలా ఉంటారు…
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 60 వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకల్లో అనేక మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. మొదట ఈ వేడుకలకు 500 మందికి పైగా అతిధులను పిలవాలని అనుకున్నా, కరోనా ఉధృతి కారణంగా ఆ సంఖ్యను తగ్గించారు. ఈ వేడుకలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఎందుకంటే, ఈ వేడుకలకు హాజరైన వారిలో చాలామంది మాస్క్ పెట్టుకోలేదని, ప్రస్తుతం అమెరికాలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయని, సెలబ్రిటీలు మాస్క్ పెట్టుకోకుండా…
ఆఫ్ఘనిస్తాన్లో రోజురోజుకు తాలీబన్ ఉగ్రవాదుల దారుణాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు అక్కడి సామాన్య ప్రజలకు నరకం చూపిస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడంతో ప్రభుత్వ దళాలకు, తాలీబన్లకు మధ్య పోరు జరుగుతున్నది. ఆఫ్ఘన్లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని, అక్కడ ఉండటం ఏమాత్రం సురక్షితం కాదని, ఒకవేళ టికెట్ కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకుంటే రుణాలు అందిస్తామని…
అది 149 ఏళ్లనాటి భవంతి. పురాతన కాలం నాటి ఇల్లు కావడంతో చాలామందికి వాటిపై ఆసక్తి ఉంటుంది. ఎలాగైన చేజిక్కించుకోవాలని అనుకుంటారు. ఇక, పాత ఇల్లు తక్కువ ధరకు వస్తుంది అంతే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పండి. అందరిలాగే ఆ దంపతులు కూడా పాత ఇంటిని కోనుగోలు చేశారు. కొంతకాలం హ్యాపీగానే గడిచినంది. ప్రశాంతంగా ఉన్నామని అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి వేళ ఇంటి గోడల్లో నుంచి పెద్ద పెద్ద శబ్దలు వినిపించాయి. దాంతో ఆ దంపతులు భయపడిపోయారు.…