చైనాలోని ఊహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని ఇప్పటికే అనేక కథనాలు వెలువడ్డాయి. అమెరికాతో సహా అనేక దేశాలు కరోనా వైరస్ ల్యాబ్ నుంచే లీకయిందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో గతంలో పర్యటించిన తరువాత ల్యాబ్ నుంచి వచ్చిందా లేదా అన్నదానిపై మరింత విపులంగా పరిశోధించాలని పేర్కొన్నది. ల్యాబ్ నుంచి లీకైందని కొట్టిపారెయ్యలేమని చెప్పింది. మరోసారి చైనాలో పర్యటించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ…
ఎప్పుడో సోకిన వ్యాధులు తిరిగి మళ్లీ విస్తరిస్తున్నాయి. 18 ఏళ్ల క్రితం అంటే 2003వ సంవత్సరంలో అరుదైన మంకీఫాక్స్ కేసులు అనేకం వ్యాపించాయి. ఆ తరువాత ఆ కేసులు మెల్లిగా కనుమరుగయ్యాయి. కాగా, ఇప్పుడు మరోసారి ఈ కేసులు బయటపడుతుండటంతో అమెరికా అప్రమత్తం అయింది. ఇటీవలే టెక్సాస్కు చెందిన ఓ వ్యక్తి నైజీరియా వెళ్లి వచ్చాడు. అలా వచ్చిన వ్యక్తిలో ఈ మంకీఫాక్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆ వ్యక్తిని డాలస్లోని ఆసుపత్రిలో వేరుగా ఉంచి చికిత్స…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో బలగాలు తప్పుకుంటున్నాయి. నాటో, అమెరికా బలగాలు తప్పుకోవడంతో ఆ దేశంలో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లోని అనేక ప్రాంతాలను తాలిబన్ ఉగ్రవాదులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ప్రతిరోజు అక్కడ హింసలు చెలరేగుతున్నాయి. ఉగ్రవాదుల దౌర్జన్యాలకు అమాయకమైన ప్రజలు బలి అవుతున్నారు. అమెరికా, నాటో బలగాలు తప్పుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ విమర్శించారు. అమెరికా, నాటో బలగాలు ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడం మంచి నిర్ణయం కాదని, బలగాల ఉపసంహరణ తరువాత…
కరోనాకు చెక్ పెట్టేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. యూఎస్లో ఇప్పటికే మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఆ దేశంలో వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అమెరికా గట్టిగా చెబుతున్నది. ఒకవైపు వ్యాక్సిన్లు వేస్తూనే పెద్దమొత్తంలో మిగులు వ్యాక్సిన్లను నిల్వ చేసింది అమెరికా. దాదాపుగా 80 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను వివిధ దేశాలకు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైన అమెరికా ఇప్పటికే 40 మిలియన్ వ్యాక్సిన్ డోసులను నేపాల్, భూటాన్,…
ముల్లును ముల్లుతోనే తీయాలి అనే సామెత ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సామెతను తీసుకొని మానవ శరీరంలో యాంటీబాడీలను ఏమార్చి ఇన్ఫెక్షన్లను కలుగజేస్తున్న కరోనా వైరస్ను బోల్తాకొట్టించే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికోసం కొన్ని లోపాలున్న వైరస్ను సృష్టించారు. ఈ లోపాలున్న వైరస్ కరోనా వైరస్ తో ఫైట్ చేసి దాన్ని చంపేస్తుంది. అంతేకాదు, ఆ ప్రక్రియ తరువాత లోపాలున్న కృత్రిమ కరోనా వైరస్ కూడా అంతం అవుతుంది. మానవ శరీర…
దశాబ్దాల పోరాటం తరువాత ఫెడరల్ క్యాస్ట్రో నేతృత్వంలో క్యూబాలో కమ్యునిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది. దశాబ్ధాలుగా ఆ పార్టీనే క్యూబాలో పరిపాలన సాగిస్తోంది. అయితే, గత కొంతకాలంగా క్యూబాలో అల్లర్లు చెలరేగుతున్నాయి. కరోనా, ఆర్ధిక కుంగుబాటు, నిరుద్యోగం తదితర అంశాలు దేశాన్ని పట్టిపీడుస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున ప్రజలు హవానాకు చేరుకొని ఉద్యమం చేస్తున్నారు. క్యూబా ప్రస్తుత అధ్యక్షుడు మిగ్యుయెల్ దిజాయ్ కనెల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు స్వేచ్చకావాలి వెంటనే అధ్యక్షుడు రాజీనామా చేయాలని ప్రజలు…
కరోనాకు చెక్ పెట్టేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశం నుంచి మూడు రకాల వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మోడెర్నా, ఫైజర్ టీకాలు రెండు డోసుల వ్యాక్సిన్లు కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్. దీనిపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఈ వ్యాక్సిన్కు అనుమతులు కూడా రావడంతో అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్ అందిస్తున్నారు.…
ఆసియాలో అన్ని దేశాలపై ఆదిపత్యం సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ సముద్రంలోని పరాసెల్ దీవులు పరిధిలో ఉన్న సముద్ర జలాలు తమవే అంటే తమవే అని చైనా, వియాత్నం, తైవాన్లు వాదిస్తున్నాయి. ఇందులో బలం, బలగం అధికంగా ఉన్న చైనా ఈ జలాలపై ఆదిపత్యం చెలాయిస్తున్నది. 2016, జులై 12 వ తేదీన అంతర్జాతీయ న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చింది. ఈ…
అమెరికాలో మరో ఉద్యమానికి ఊపిరి పోసుకున్నది. పక్షులను చంపొద్దని అంటూ వేలాదిమంది రోడ్లమీదకు వచ్చి నినాదాలు చేస్తున్నారు. బర్డ్ ఆర్ నాట్ రియల్ అనే పేరుతో ఉద్యమం జరుగుతున్నది. అమెరికా వీధుల్లో ఎరుగుతున్న పక్షులు నిజం కావని, నిజమైన పక్షులను అధికారులు చంపేస్తున్నారని, ఇప్పటికే లక్షలాది పక్షులను చంపేసి వాటి స్థానంలో రోబొటిక్ పక్షులను ప్రవేశపెట్టారని, ఆ పక్షులు అమెరికన్ల జీవనాన్ని గమనిస్తున్నాయని ఆందోళనలు చేస్తున్నారు. బర్డ్ ఆర్ నాట్ రియల్ అనే సిద్ధాంతం ఇప్పుడు మొదలైంది…
విమానంలో ప్రయాణం చేస్తున్న ఓ మహిళను సిబ్బంది సీటుకు కట్టేసి ఉంచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెక్సాస్ నుంచి నార్త్ కరోలీనాకు విమానం బయలుదేరగా, అందులోని ఓ మహిళా ప్రయాణికురాలు గందరగోళం సృష్టించింది. తనను కిందకు దించాలని గొడవచేసింది. అప్పటికే విమానం బయలుదేరాల్సిన సమయం కంటే గంట ఆలస్యం కావడంతో గమ్యస్థానం చేరిన తరువాతే దించుటామని సిబ్బంది తెలిపారు. Read: షాహిద్ సరికొత్త అవతారం… ఓటీటీ స్మార్ట్ స్క్రీన్ మీదకి బాలీవుడ్ స్మార్ట్…