అగ్రరాజ్యంపై మళ్లీ కరోనా పంజా..ఒక్క రోజే 88 వేల కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతో ఆ మధ్య వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కన్పించినా.. గత కొన్ని రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది. అమెరికాలో 24 గంటల వ్యవధిలో 88 వేల 376 కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవడం ఇదేసారి.
కరోనా టీకా పంపిణీలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 55శాతానికి మించి కనీసం ఒకడోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అంతే కాదు మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. గతవారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే.. అత్యధికంగా అమెరికాలోనే నమోదైనట్లు WHO ప్రకటించింది.
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
వ్యాక్సినేషన్ రేటు తగ్గుముఖం పట్టడం, డెల్టా వేరియంట్ వ్యాప్తే తాజా ఉద్ధృతికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అమెరికాలోని పలు రాష్ట్రాలు మళ్లీ కొవిడ్ నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి. అంతకుముందు కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మాస్కు అవసరం లేదని ప్రకటించిన రాష్ట్రాలు.. ఇప్పుడు మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ ఆదేశాలిస్తున్నాయి. కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రభావితమైన దేశం అమెరికానే. గతేడాది అగ్రరాజ్యాన్ని చిగురుటాకులా వణికించిన మహమ్మారి.. ఇప్పటివరకు అక్కడ 6 లక్షల 12 వేల మందిని బలితీసుకుంది. దాదాపు 3 కోట్ల 5 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?