ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తప్పుకున్నాయి. పూర్తిగా సేనలు తప్పుకోవడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్పై ఉగ్రవాదుల దాడి తరువాత ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం ప్రకటించింది అమెరికా. సేనలు ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించి ఉగ్రవాదులను తరిమికొట్టాయి. 2001లో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశాయి. 20 ఏళ్లపాటు ఆమెరికా రక్షణలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం నడిచింది. అమెరికా సేనలు ఉపసంహరించుకునే సమయానికి తిరిగి 2001 ముందునాటి పరిస్థితులు ఏర్పడ్డాయి. 20 ఏళ్ల కాలంలో…
ఆగస్టు 31 వ తేదీ కంటే ముందే అమెరికా దళాలు ఆఫ్ఘన్ను వదిలి వెళ్లిపోయాయి. కాబూల్ ఎయిర్పోర్ట్లో చివరి సైనికుడితో సహా అందర్ని అమెరికా వెనక్కి తీసుకెళ్లింది. ఆఫ్ఘన్ రక్షణ కోసం అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఖర్చుచేసి అధునాతన ఆయుధాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. వెళ్లే సమయంలో వీలైన్ని ఆయుధాలను వెనక్కి తీసుకెళ్లిన అమెరికా, చాలా ఆయుధాలను ఆఫ్ఘన్లోనే వదిలేసింది. అయితే, వాటిని చాలా వరకు నిర్వీర్యం చేసింది. తిరిగి వినియోగించాలంటే దానికి తగిన టెక్నాలజీ,…
ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారం ఇంకా ముగియకముందే ఇప్పుడు అమెరికాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఉత్తర కొరియా ఇప్పుడు మళ్లీ అణు సమస్యలు తెచ్చిపెట్టేందుకు సిద్ధం అయింది. అణు రియాక్టర్ను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చినట్టు ఐక్యరాజ్యసమితి అటామిక్ ఏజెన్సీ పేర్కొన్నది. ఇది అంతర్జాతీయ అణుచట్టాలకు విరుద్ధమని ఐరాస పేర్కొన్నది. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తో సమావేశానికి ముందు యాంగ్బ్యోన్లోని అణు రియాక్టర్ను…
తాలిబన్లు విధించిన డెడ్లైన్ మరో 48 గంటల్లో ముగియనున్నది. ఆగస్టు 31 వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తరువాత అమెరికా బలగాలు కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి పూర్తిగా తప్పుకోవాల్సి ఉన్నది. ఆగస్టు 31 వ తేదీ అర్ధరాత్రి తరువాత తాలిబన్లు కాబూల్ ఎయిర్పోర్టును స్వాధీనం చేసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆగస్టు 31 తరువాత కూడా తరలింపుకు అవకాశం ఇవ్వాలని అమెరికాతో సహా ఇతర దేశాలు తాలిబన్లను విజ్ఞప్తి చేసిప్పటికీ వారు…
మూడు రోజుల క్రితం కాబూల్ ఎయిర్ పోర్ట్ బయట జరిగిన బాంబు దాడుల్లో 160 మందికి పైగా పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, ఈసారి రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక దేశాలు హెచ్చరించాయి. తమ దేశానికి చెందిన పౌరులు ఎవరూ కూడా ఎయిర్పోర్ట్ వైపు రావొద్దని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ముందస్తుగా హెచ్చరించాయి.…
ఆఫ్ఘనిస్తాన్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆగస్టు 15 ముందు వరకు ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నది. ఆగస్టు 19 వ తేదీ ఆఫ్ఘన్కు స్వాతంత్య్రం వచ్చిన రోజు. ఆ రోజుకు ముందే తాలిబన్లు ఆఫ్ఘన్ను ఆక్రమించుకున్నారు. ఆగస్టు 31 లోగా అమెరికా బలగాలు ఉపసంహరించుకోవాలని ఇప్పటికే తాలిబన్లు హుకుం జారీ చేశారు. ఇదే సమయంలో ఐసిస్ ఉగ్రవాదులు కాబూల్లోని ఎయిర్పోర్ట్పై దాడులు చేయడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆఫ్ఘన్ను తాలిబన్లకు అప్పగిస్తే అక్కడ తిరిగి స్థానిక…
అమెరికాతో పాటుగా అనేక అగ్రరాజ్యాలు కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. అలా హెచ్చరించిన గంటల వ్యవధిలోనే దాడులు జరిగాయి. అంటే అక్కడ సెక్యూరిటి ఏ విధంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. తాలిబన్ల ఆక్రమణల తరువాత ఆ దేశం వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం తాలిబన్ ఫైటర్లు మాత్రమే భద్రతా సంబంధమైన విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు, సైనికులు ఇంకా విధుల్లోకి రాలేదు. దీంతో భద్రతా పరమైన లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. అగ్రదేశాల నిఘాచారాన్ని…
అంతా అనుకున్నట్టుగానే జరిగింది. ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా అగ్రరాజ్యాల నిఘావ్యవస్థలు హెచ్చరించిన కొద్దిసేపటికే కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 72 మంది మృతి చెందగా, 140 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తామే కారణమని ఇప్పటికే ఐసిస్ ప్రకటించింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డవారి ఫొటోలను కూడా ఐసిస్ రిలీజ్ చేసింది. కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద దాడులు జరిగిన కాసేపటి తరువాత సెంట్రల్ కాబూల్లో మరోపేలుడు సంభవించినట్టు సమాచారం.…
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వీలైతే ఎలాగైనా ఎయిర్పోర్టుకు చేరుకొని ఏదోక విమానం ఎక్కి అక్కడి నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఇక, ఆగస్టు 31 వరకు తాలిబన్లు ఎయిర్పోర్టులోని అమెరికా, నాటో దళాలకు డెడ్లైన్ విధించారు. ఆగస్టు 31 లోగా దేశం విడిచి వారంతా వెళ్లిపోవాలని షరతు విధించారు. అందుకు తగ్గట్టుగానే అమెరికా, నాటో దళాలు ప్రజలను తరలిస్తున్నాయి. అయితే, వేల సంఖ్యలో కాబూల్ ఎయిర్పోర్టుకు కొత్త వ్యక్తులు…
అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకుంటుంన్నట్టు ప్రకటించిన తరువాత పూర్తిగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి. అంత త్వరగా తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకుంటారని అనుకోలేదు. దీంతో దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు 31 వరకు ఆఫ్ఘన్లోని అమెరికా పౌరులను, అమెరికా అధికారులను తరలించాలని సైన్యం టార్గెట్ పెట్టుకుంది. ఆగస్టు31 వరకు ఆ దేశాన్ని పూర్తిగా ఖాళీచేసి వచ్చేయాలని అమెరికా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆగస్టు 31 వరకు…