కూతురు ఎవరికైనా కూతురే. కన్నబిడ్డకోసం తల్లిదండ్రులు ఎంత కష్టం పడటానికైనా సరే సాహసిస్తారు. తన చిన్నారిని ఎలాగైనా కాపాడుకోవాలనే తలంపుతో ఆర్మీజవాన్ ఒట్టి కాళ్లతో నడక ప్రయాణం మొదలుపెట్టాడు. సీడిఎల్ఎస్ అనే అరుదైన వ్యాధితో చిన్నారి బాధపడుతున్నది. జన్యలోపం వలన ఇలాంటి సీడిఎల్ఎస్ వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధికి ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స లేకపోవడంతో ఎలాగైనా సరే కాపాడుకోవడానికి ఆ చిన్నారి తండ్రి బ్రాన్నింగ్ కంకణం కట్టుకున్నాడు. హోప్ ఫర్ హస్తి పేరుతో ఛారిటీని స్థాపించి…
కరోనా కారణంగా ప్రపంచంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ లక్షలాదిమంది ప్రజలు కరోనాబారిన పడుతున్నారు. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా మృతి చెందారు. ఆరోగ్య పరగంగానే కాకుండా ఆర్థికంగా కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రజల ఆయుర్థాయం భారీగా తగ్గిపోతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రజల ఆయుర్ధాయం భారీగా తగ్గిందని, కోవిడ్ తరువాత రెండోసారి భారీగా ప్రజల ఆయుర్థాయం తగ్గిపోయినట్టు పరిశోధకుల సర్వేలో తేలింది. మొత్తం 29…
అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రధాని మోడీ. శుక్రవారం…ఆదేశ అధ్యక్షులు జోబైడెన్తో సమావేశమయ్యారు. కీలక విషయాలపై చర్చించారు. జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి ఈ సమావేశం జరిగింది. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని ఈ సందర్భంగా అన్నారు బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు లాభదాయకమన్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం…
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ… బిజీ బిజీగా గడుపుతున్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్తో సమావేశమయ్యారు. కరోనా పరిణామాలు సహా కీలక అంశాలపై ఆమెతో చర్చించారు. అనంతరం కమలా హ్యారీస్తో కలిసి జాయింట్ ప్రెస్మీట్ నిర్వహించారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు. భారత్లో కరోనా సెకండ్ వేవ్ మారణహోమం సృష్టించిన సమయంలో…. అండగా నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పారు మోడీ. అమెరికా, భారత్ మధ్య సహకారం, సమన్వయం మరింత బలపడ్డాయన్నారు పీఎం.…
ఇండో పసిఫిక్ తీరంలో చైనా ప్రాభల్యాన్ని తగ్గించేందుకు తక్షణమే ఓ బలమైన కూటమి అవసరం ఉందని భావించిన అగ్రరాజ్యం అమెరికా అటు బ్రిటన్, ఆస్ట్రేలియాతో కలిసి అకూస్ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటిమి ఏర్పడటం వలన గతంలో ఫ్రాన్స్తో ఆస్ట్రేలియా 12 జలాంతర్గాముల కోసం చేసుకున్న ఒప్పందం వీగిపోయింది. దీనికి బదులుగా అమెరికా అస్ట్రేలియాకు అధునాతనమైన అణుజలాంత్గాములను సరఫరా చేస్తుంది. దీనిపై ఆస్ట్రేలియా, అమెరికాపై ఫ్రాన్స్ మండిపడింది. ఇక ఇదిలా ఉంటే ఆసియాలో చైనా ప్రాభల్యం…
ప్రధాని మోడీ ఈరోజు అమెరికా బయలుదేరి వెళ్లారు. ఈనెల 23 న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తోనూ, ఆ తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తోనూ ప్రధాని సమావేశం కానున్నారు. ఇతర దేశాలకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా వాక్సిన్ తీసుకొని ఉండాలి. అందులోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందిన ఏడు రకాల వ్యాక్సిన్లలో ఏదో ఒకటి తీసుకొని ఉండాలి. ఇండియాలో సొంతంగా అభివృద్ధి చేసిన కోవాక్సీన్ ను ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటి వరకు గుర్తించలేదు. ఇండియాలో తయారైన ఈ వ్యాక్సిన్ ను ప్రధానితో పాటుగా అనేక…
ప్రపంచం నుంచి కరోనా ఇంకా దూరం కాలేదు. అమెరికా వంటి దేశాల్లో కరోనా ఉధృతంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రెండు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తుంటే కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ ను వ్యతిరేకిస్తున్నారు. కరోనా నుంచి బయట పడలేదు కాబట్టి తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని ప్రభుత్వం ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది. …
ప్రధాని మోడీ ఈరోజు అమెరికా పర్యటనకు బయలుదేరబోతున్నారు. ప్రధాని మోడీతో పాటుగా అయన బృందంలో విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్.జయశంకర్, విదేశీ వ్యవహరాల కార్యదర్శి హెచ్.వి. శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 23 వ తేదీన అస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాన మంత్రి యోషిహిదె సుగ లతో విడివిడిగా ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. యాపిల్ సీఈవో టీమ్ కుక్ తో పాటుగా అనేక అమెరికా…
అమెరికా వెళ్లేవారికి అక్కడి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికీ అమెరికాలోకి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్లు తీసుకున్న వారికీ మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం ఏడు వ్యాక్సిన్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఇందులో మోడెర్నా, ఫైజర్ ఎన్ బయోటెక్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనకా, కొవిషీల్డ్ టీకాలు తీసుకున్నవారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు అమెరికా సీడీసీ తెలియజేసింది. నవంబర్ నుంచి నిబంధనలకు లోబడి టీకాలు…
ఒకప్పుడు అమెరికా రష్యా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండు దేశాల మధ్య పచ్ఛన్నయుద్ధం జరిగింది. అయితే, 1991 దశకంలో యూఎస్ఎస్ఆర్ విచ్చిత్తి కావడంతో రష్యా ఆర్థికంగా కుదేలయింది. దీంతో అమెరికా తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే, గత రెండు దశాబ్దాల కాలంగా ఆసియాలో చైనా ఆర్థికంగా క్రమంగా ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో అమెరికా తరువాత రెండో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇప్పుడు అమెరికాను సవాల్ చేసే స్థాయికి ఎదగడంతో అమెరికా, చైనా…