Kim Jong Un: ఉత్తర కొరయా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన కూతురుతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్ నార్త్ కొరియా అధినేతగా కిమ్ కూతరు ఉండబోతుందనే వార్తల నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో కిమ్ తన కూతురు ‘జూఏ’తో కలిసి క్షిపణి పరీక్షలు,
Recession: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్థికవేత్తలు ఈ ఏడాది ఆర్థికమాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఆర్థికమాంద్యాన్ని ఏదుర్కొవాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ద్రవ్యోల్భణం, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వడ్డీరేట్లను పెంచుతోంది. ఇక బ్రిటన్ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ మాంద్యం గురించి హెచ్చరించింది.
Youtuber : ఈ మధ్య జనాలకు పిచ్చి పట్టుకుంది. రీల్స్ చేసుకుంటూ వ్యూస్ లైక్స్ కోసం పాకులాడుతున్నారు. వాటి కోసం ఎంత పని చేయడానికైనా వెనకాడడం లేదు. ఎలాంటి సాహసాలైన చేస్తున్నారు.
BREAKING NEWS: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు తెలిసింది. జూన్ 22న ప్రధాని అమెరికా పర్యటకు వెళ్తారని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చే విందులో పాల్గొంటారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ పర్యటన అమెరికా, భారతదేశం మధ్య స్నేహబంధం మరింత పెరుగుతుందని, భారతీయులు, అమెరికన్ల స్నేహాన్ని ధృవీకరిస్తుందని వైట్ హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Texas Shooting: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. టెక్సాస్ లోని ఓ షాపింగ్ మాల్ లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. టెక్సాస్ లోని డల్లాస్ శివారు అలెన్ లోని అవుట్లెట్ మాల్లో శనివారం ఒక సాయుధుడు అక్కడ ఉన్న ప్రజలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్యలను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఈ కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు హతమార్చారు.
Brain Surgery On Baby In Womb: అమెరికన్ వైద్యులు అత్యంత అరుదైన బ్రెయిన్ సర్జరీ చేశారు. గర్భంలో ఉన్న శిశవుకు విజయవంతంగా బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. ఇలా గర్భంలో ఉన్న శిశువుకు శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. మెదడులో అరుదైన రక్తనాళాల అసాధారణ పరిస్థితిని సరిచేసేందుకు వైద్యులు ఈ సర్జరీని నిర్వహించారు. ‘‘వీనస్ ఆఫ్ గాలెన్ మాల్ ఫార్మెషన్’’(VOGM) అనే అరుదైన వైకల్యంతో బాధపడుతున్న శిశువుకు బ్రిఘం అండ్ ఉమెన్స్ హాస్పిటల్, బోస్టన్ చిల్డ్రన్స్…
Dead Body : కూటి కోసం కోటి విద్యలు అంటారు. కానీ ప్రస్తుతం కూటి కోసం కాకుండా కోట్ల కోసం జనం పరిగెత్తున్నారు. తానూ మనిషినే అన్న సంగతే మర్చిపోతున్నాడు. మానవత్వాన్ని వదిలి మనీ మాయలో పడిపోతున్నాడు.
USCIRF report: భారతదేశం అంటే పక్షపాతంగా వ్యవహరించే అమెరికాలోని కొన్ని సంస్థలు మరోసారి అలాంటి ప్రయత్నాన్నే చేశాయి. భారతదేశంలో మత స్వేచ్ఛ లేదని, మైనారిటీలు హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్సీఐఆర్ఎఫ్) తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు భారత్ లోకి కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులపై ఆంక్షలు విధించాలని బైడెన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భారతదేశంలో 2022లోనూ భారత్ లో మతస్వేచ్ఛ పతనమవడం 2022లోనూ కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…
Brain Moments Before Death: సైన్స్ అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నా ఇప్పటికి మనిషి మెదడు, శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతూనే ఉంది. మానవ మెదడుకు సంబంధించి అనేక ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే ఇప్పటీకి ఎంత తెలుసుకున్నా.. చాలా సమాచారం అసంపూర్తిగా మిగులుతూ ఉంటోంది. అయితే చనిపోతున్న సమయంలో మానవ మెదడు ఏవిధంగా ప్రవర్తిస్తుందనే విషయంపై తాజాగా అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.
అమెరికాలో గన్ కల్చర్ పై విమర్శలే ఉన్నాయి. ఈ క్రమంలోనే తుపాకి హింసను కట్టడి చేసేందుకు న్యూయార్క్ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న గన్ లను ఇస్తే.. గిఫ్ట్ కార్డులు ఇస్తామని ప్రకటించింది.