Recession: ఆర్థికమాంద్యం తప్పదు.. యూఎస్ ట్రెజరీ వార్నింగ్.. భారత ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Recession: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్థికవేత్తలు ఈ ఏడాది ఆర్థికమాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఆర్థికమాంద్యాన్ని ఏదుర్కొవాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ద్రవ్యోల్భణం, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వడ్డీరేట్లను పెంచుతోంది. ఇక బ్రిటన్ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ మాంద్యం గురించి హెచ్చరించింది.
ఆర్థికమాంద్యం తప్పకపోవచ్చని యూఎస్ ట్రెజరీ హెచ్చరించింది. దీంతో పాటు అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోత ఉంటుందని తెలిపింది. అమెరికాలో మొత్తంగా 5,85,000 కంటే ఎక్కువ టెక్ కంపెనీ ఉన్నాయి. ఓ నివేదిక ప్రకారం యూఎస్ లో 4.4 మిలియన్లకు పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపుగా 30-40 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఇప్పుడు వీరందరూ గడ్డుకాలం ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. సగటు భారతీయుడి డాలర్ డ్రీమ్స్ దెబ్బతిననున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్ ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల కోత గురించి హెచ్చరించారు.
Also Read
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
- Nepal Floods: నేపాల్కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
- Nepal Floods: నేపాల్లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
- Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
Read Also: Vemula Prashanth Reddy : బీజేపీ వైఖరి వల్ల దేశ సమగ్రతకే పెనుముప్పు
కొన్ని వారాల క్రితం అమెరికా పాలసీమేకర్స్, బ్యాంకర్లు, వైట్ హౌజ్ అధికారులు అమెరికా డిఫాల్ట్ కౌగిలి ఉందని చెప్పారు. ఆర్థికమాంద్యంతో అమెరికాను దెబ్బకొట్టే అవకాశం ఉందని, ఇది ప్రపంచానికి అంటువ్యాధిగా విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ వ్యయంపై ప్రస్తుత పరిమితులను పెంచాడానికి చట్టసభ సభ్యులు బైడెన్ ఒప్పందాన్ని అంగీకరించలేకపోతే జూన్ 15 నాటికి అమెరికాలో అప్పుల ఎగవేత పెరిగే అవకాశం ఉందని కాంగ్రెసెన్షియల్ బడ్జెట్ ఆఫీస్ శుక్రవారం అంచనా వేసింది.
రుణ పరిమితిని పెంచడంపై డిప్యూటీ ట్రెజరీ సెక్రటరీ వాలీ అడియోమో మాట్లాడుతూ.. డిఫాల్ట్ సమయానికి రుణపరిమితిని పెంచకుంటే డిఫాల్ట్ అవుతారని, మాంద్యంలోకి వెళ్తామని చెప్పారు. అధ్యక్షుడు జో బైడెన్ రుణపరిమితిని పెంపును పెంచాలని అనుకుంటున్నారు. మార్చిలో బైడెన్ బడ్జెట్ అభ్యర్థనను ప్రస్తావిస్తూ.. 10 ఏళ్లలో 3 ట్రిలియన్ డాలర్ల రుణ ఉపశమనాన్ని కలిగి ఉన్న ప్లాన్ రూపొందించారని అడెమో చెప్పారు. రుణపరిమితిని అధిగమించేందుకు, దేశం డిఫాల్ట్ లోకి వెళ్లకుండా నిరోధించడానికి చట్ట సభ్యులు మార్గాలను అణ్వేషించాలని ఆయన అన్నారు. ఒక వేళ ఈ రుణఎగవేతలు దేశంలో లక్షలాది ఉద్యోగాలు పోయేందుకు కారణమయ్యే పరిస్థితి ఉందని అన్నారు. భారీ మాంద్యం ప్రభావం అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!