Recession: ఆర్థికమాంద్యం తప్పదు.. యూఎస్ ట్రెజరీ వార్నింగ్.. భారత ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Recession: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్థికవేత్తలు ఈ ఏడాది ఆర్థికమాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఆర్థికమాంద్యాన్ని ఏదుర్కొవాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ద్రవ్యోల్భణం, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వడ్డీరేట్లను పెంచుతోంది. ఇక బ్రిటన్ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ మాంద్యం గురించి హెచ్చరించింది.
ఆర్థికమాంద్యం తప్పకపోవచ్చని యూఎస్ ట్రెజరీ హెచ్చరించింది. దీంతో పాటు అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోత ఉంటుందని తెలిపింది. అమెరికాలో మొత్తంగా 5,85,000 కంటే ఎక్కువ టెక్ కంపెనీ ఉన్నాయి. ఓ నివేదిక ప్రకారం యూఎస్ లో 4.4 మిలియన్లకు పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపుగా 30-40 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఇప్పుడు వీరందరూ గడ్డుకాలం ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. సగటు భారతీయుడి డాలర్ డ్రీమ్స్ దెబ్బతిననున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్ ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల కోత గురించి హెచ్చరించారు.
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
Read Also: Vemula Prashanth Reddy : బీజేపీ వైఖరి వల్ల దేశ సమగ్రతకే పెనుముప్పు
కొన్ని వారాల క్రితం అమెరికా పాలసీమేకర్స్, బ్యాంకర్లు, వైట్ హౌజ్ అధికారులు అమెరికా డిఫాల్ట్ కౌగిలి ఉందని చెప్పారు. ఆర్థికమాంద్యంతో అమెరికాను దెబ్బకొట్టే అవకాశం ఉందని, ఇది ప్రపంచానికి అంటువ్యాధిగా విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ వ్యయంపై ప్రస్తుత పరిమితులను పెంచాడానికి చట్టసభ సభ్యులు బైడెన్ ఒప్పందాన్ని అంగీకరించలేకపోతే జూన్ 15 నాటికి అమెరికాలో అప్పుల ఎగవేత పెరిగే అవకాశం ఉందని కాంగ్రెసెన్షియల్ బడ్జెట్ ఆఫీస్ శుక్రవారం అంచనా వేసింది.
రుణ పరిమితిని పెంచడంపై డిప్యూటీ ట్రెజరీ సెక్రటరీ వాలీ అడియోమో మాట్లాడుతూ.. డిఫాల్ట్ సమయానికి రుణపరిమితిని పెంచకుంటే డిఫాల్ట్ అవుతారని, మాంద్యంలోకి వెళ్తామని చెప్పారు. అధ్యక్షుడు జో బైడెన్ రుణపరిమితిని పెంపును పెంచాలని అనుకుంటున్నారు. మార్చిలో బైడెన్ బడ్జెట్ అభ్యర్థనను ప్రస్తావిస్తూ.. 10 ఏళ్లలో 3 ట్రిలియన్ డాలర్ల రుణ ఉపశమనాన్ని కలిగి ఉన్న ప్లాన్ రూపొందించారని అడెమో చెప్పారు. రుణపరిమితిని అధిగమించేందుకు, దేశం డిఫాల్ట్ లోకి వెళ్లకుండా నిరోధించడానికి చట్ట సభ్యులు మార్గాలను అణ్వేషించాలని ఆయన అన్నారు. ఒక వేళ ఈ రుణఎగవేతలు దేశంలో లక్షలాది ఉద్యోగాలు పోయేందుకు కారణమయ్యే పరిస్థితి ఉందని అన్నారు. భారీ మాంద్యం ప్రభావం అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!