COVID-19: 2019లో చైనాలోని వూహాన్ నగరంలో ప్రారంభం అయిన కరోనా మహమ్మారి, ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. తన రూపాలను మార్చుకుంటూ ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని వణికించింది. ఇటీవలే కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా కోవిడ్ ఎమర్జెన్సీని ముగించింది.
US Debt Ceiling Crisis: అమెరికా ఆర్థిక సంక్షోభం అంచున నిలిచింది. అమెరికా రుణపరిమితి పెంచడంపై అధికార డెమోక్రాట్స్, విపక్ష రిపబ్లికన్ల మధ్య ఒప్పదం కుదరలేదు.
Most Miserable Country: ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశంగా ఆఫ్రికా దేశం జింబాబ్వే తొలి స్థానంలో నిలిచింది. ప్రఖ్యాత ఆర్థికవేత్త స్టీవ్ హాంకే వార్షిక మిజరీ ఇండెక్స్ (HAMI) ప్రకారం జింబాబ్వే ఈ తొలిస్థానంలో నిలిచింది.
Viral Video: కొన్నిసార్లు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు కొట్టుకోవడం చూశాం. ఇండియాలో ఇటువంటి సంఘటనలు చాలా వరకు జరిగాయి. అయితే ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఒకరినొకరు తన్నుకోవడం చాలా వరకు అరుదు. అదికూడా అమెరికా లాంది దేశాల్లో. సెక్యూరిటీ పెద్ద ఎత్తున ఉంటుంది.
జీ 7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడకి వెళ్లారు. అయితే, ఆయన జపాన్లో లాండయ్యే సమయానికే ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుంది. యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి మెట్లు దిగుతూ చినుకులు పడుతున్న కారణంగా ఆయన చేతిలో ఉన్న గొడుగుని తెరిచేందుకు ప్రయత్నిస్తాడు.. కానీ అది ససేమిరా అన్నట్లు తెరుచుకోదు. చివరకు దాన్ని అలానే చేతిలో పట్టుకుని కిందకు దిగాడు.
Gold Standard Burger: ‘బర్గర్’ ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఫాస్ట్ ఫుడ్ లో ఒకటి. తక్కువ ధర, తక్కువ సమయం అందుబాటులో ఉండటం, వెంటనే ఆకలి తీర్చడంలో బర్గర్ సహాయపడుతుంది. తక్కువ ధర, టేస్ట్ దీన్ని ప్రజలకు దగ్గర చేసింది. వెస్ట్రన్ దేశాల్లో ఎక్కువగా ఫేమస్ అయిన ఈ బర్గర్.. ఇప్పుడు భారత్ లో కూడా విరివిగా అమ్ముడవుతున్నాయి. పిల్లలు, పెద్దల్లో దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
New York Sinking: అమెరికాలోని అతిపెద్ద నగరం, ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్ నెమ్మనెమ్మదిగా భూమిలోకి కూరుకుపోతుందని పరిశోధకలు సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. న్యూయార్క్ లోని అతిపెద్ద భవంతులు క్రమంగా నేలలోకి జారుకుంటున్నాయని పరిశోధన పేర్కొంది. నగరంలోని భవనాల బరువు కారణంగా సమీపంలోని నీటిలోకి మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ పరిస్థితిని సైన్స్ పరిభాషలో ‘ సబ్సిడెన్స్’ అంటారని పరిశోధకులు వెల్లడించారు.
26/11 Mumbai terror attacks: 26/11 ముంబై ఉగ్రదాడులు సూత్రధారి తహవూర్ రాణాను అమెరికా, భారత దేశానికి అప్పగించనుంది. 2008లో జరిగి ఈ దాడి యావత్ దేశంతో పాటు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేసింది. నిందితులో్లో ఒకడిగా ఉన్న తహవూర్ రాణాను భారత్ కు అప్పగించడానికి అక్కడి కాలిఫోర్నియా కోర్టు అంగీకరించింది. భారత్-అమెరికాల మధ్య ఉన్న నేరస్తుల ఒప్పగింత ఒప్పందానికి అనుగుణంగా ఈ తీర్పు వచ్చింది.