USA: విమానంలో ప్రియురాలిలో గొడవ, ఇతర ప్రయాణికులకు ప్రమాదంగా మారింది. అమెరికాలోని బోలోని లోగాన్ విమానాశ్రయంలో విమానం టాక్సీ వేలో ప్రయత్నిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశాడు. మంగళవారం ఈ ఘటన జరిగింది. బెట్బ్లూ విమానంలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని ప్యూర్టోరికన్ ప్రయాణికుడిగా గుర్తించారు. తన ప్రియురాలిలో వాగ్వాదం తర్వాత విమానం నుంచి దూకేందుకు అతను ప్రయత్నించాడు.
డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హమాస్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలో ఉన్న బందీలను రిలీజ్ చేయాలి.. అలా జరగకపోతే మిలిటెంట్ గ్రూప్ హమాస్కు నరకం చూపిస్తానని అతడు హెచ్చరించారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ తన చివరి సమయంలో తీసుకుంటున్న అధికారిక నిర్ణయాలతో పరిపాలనను, అధికార బదిలీని కష్టతరం చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
Bird Flu: అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం తీవ్ర కలకలం రేపుతుంది. లూసియానాలో ఓ వ్యక్తికి బర్డ్ఫ్లూ సోకి చనిపోయినట్లు అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
తాజాగా 119వ కాంగ్రెస్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన విధేయత ప్రతిజ్ఞలో ఆమె తడబడ్డారు. హారిస్ విధేయత ప్రతిజ్ఞను సలాడ్ చేసేశారని ఒకరు వ్యాఖ్యనించగా.. సెనెట్ ఫ్లోర్లో విధేయత ప్రతిజ్ఞను తప్పుగా పలికి హారిస్ మన దేశాన్ని అవమానించారు అంటూ మరొకరు నెట్టింట రాసుకొచ్చారు.
Plane Crash : అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. సమాచారం ప్రకారం, ఈ విమానం గిడ్డంగిపై పడిపోయింది.
Adani bribery case: సోలార్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో కీలక పరిణామం ఎదురైంది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఇతరులపై కొనసాగుతున్న మూడు కేసులను కలుపుతూ న్యూయార్క్ కోర్టు ఆదేశించింది. ఈ కేసులను ఉమ్మడి విచారణలో కలిపి విచారించాలని కోర్టు తీర్పు చెప్పింది.
China: చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టే లోపే వాణిజ్య యుద్ధానికి చైనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ సంస్థలపై ఆంక్షలను తీవ్రతరం చేయడం ద్వారా చైనా యూఎస్కి సవాల్ విసిరింది. ఒక వారం వ్యవధిలోనే చైనా ఈరోజు 10 యూఎస్ కంపెనీలపై సెకండ్ రౌండ్ ఆంక్షలను ప్రకటించింది. తైవాన్కి ఆయుధాలు అమ్మడం వల్లే చైనా, యూఎస్ కంపెనీలపై జరిమానాలు, ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
USA: అమెరికాలో న్యూ ఓర్లీన్స్లో ఉగ్ర ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ రోజున జనంపైకి ఓ వ్యక్తి కారును పోనిచ్చాడు. పికప్ ట్రక్ జనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. నిందితుడైన వ్యక్తి జనాలపైకి కాల్పులు జరిపినట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
Cyberattack: తమ ట్రెజరీ డిపార్ట్మెంట్పై చైనా సైబర్ దాడులకు పాల్పడినట్లు గుర్తించామని అమెరికా ఆరోపించింది. వర్క్ స్టేషన్లలో ఉన్న కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు యత్నించినట్లు పేర్కొనింది.