Cyberattack: అమెరికా ఖజనాపై చైనా సైబర్ దాడి.. ఖండించిన డ్రాగన్ కంట్రీ
- అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్పై చైనా సైబర్ దాడి..
- హ్యాకర్లు వర్క్స్టేషన్లు, కీలకమైన పత్రాలను యాక్సెస్ చేసినట్లు ఆరోపణలు..
- హ్యాకింగ్ విషయాన్ని సీఐఎస్ఏ, ఎఫ్బీఐ దృష్టికి తీసుకెళ్లిన అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyberattack: తమ ట్రెజరీ డిపార్ట్మెంట్పై చైనా సైబర్ దాడులకు పాల్పడినట్లు గుర్తించామని అమెరికా ఆరోపించింది. వర్క్ స్టేషన్లలో ఉన్న కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు యత్నించినట్లు పేర్కొనింది. కాంగ్రెస్కు రాసిన లేఖలో ఈ విషయాలను వాషింగ్టన్ వెల్లడించింది. అయితే, డిసెంబర్ ప్రారంభంలో ఈ సైబర్ దాడి జరిగినట్లు తేలిపింది. థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్ బియాండ్ ట్రస్ట్ నెట్వర్క్ లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్లు వర్క్స్టేషన్లు, కీలకమైన పత్రాలను యాక్సెస్ చేసినట్లు చెప్పుకొచ్చింది. డిసెంబర్ 8వ తేదీన బియాండ్ ట్రస్ట్ అప్రమత్తమై ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చిందని యూఎస్ ట్రెజరీ విభాగం అధికారి చెప్పుకొచ్చారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఎఫ్బీఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
Read Also: South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడికి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్ట్
Also Read
- Trump: ‘జస్ట్ వారికి విరామం ఇచ్చాం’.. ఖమేనీ అంత్యక్రియల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
- BLA: గ్వాదర్ కోస్ట్ గార్డ్ క్యాంప్పై దాడి.. 30 మంది పాకిస్తానీ భద్రతా సిబ్బందిని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటన
- Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
అయితే, దీనిపై ఎఫ్బీఐ అధికారులు ఇంకా రియాక్ట్ కాలేదు. కాగా, వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. మాపై అమెరికా చేస్తున్న ఆరోపణలను గట్టిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొచ్చింది. మరోవైపు జార్జియాలోని బియాండ్ ట్రస్ట్ సైతం ఈ సైబర్ దాడిపై రియాక్ట్ కాలేదు. వారి వెబ్సైట్లో.. ఇటీవల తమ కస్టమర్ల భద్రత ముప్పు వాటిల్లిందని పేర్కొనింది. దీనిపై విచారణ కొనసాగుతుందని తెలిపింది. బియాండ్ ట్రస్ట్ తెలిపిన భద్రతా సంఘటన ట్రెజరీ నివేదించిన హ్యాకింగ్ ఘటనకు దగ్గరగా ఉందని గుర్తించాం. అయినా ఈ ఘటనపై విచారణ జరగాలని సైబర్ సెక్యూరిటీ కంపెనీ అధికారి చెప్పారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: ‘సీమలో సీన్ మారింది’.. ఫ్యాక్షన్ రాజకీయాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Trump: ‘జస్ట్ వారికి విరామం ఇచ్చాం’.. ఖమేనీ అంత్యక్రియల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Rythu Bharosa : రైతులకు గుడ్న్యూస్.. 5-6 ఎకరాలకు రైతు భరోసా జమ
-
Rajamouli Goes Global: రాజమౌళికి అరుదైన గౌరవం
-
Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..