Cyberattack: అమెరికా ఖజనాపై చైనా సైబర్ దాడి.. ఖండించిన డ్రాగన్ కంట్రీ
- అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్పై చైనా సైబర్ దాడి..
- హ్యాకర్లు వర్క్స్టేషన్లు, కీలకమైన పత్రాలను యాక్సెస్ చేసినట్లు ఆరోపణలు..
- హ్యాకింగ్ విషయాన్ని సీఐఎస్ఏ, ఎఫ్బీఐ దృష్టికి తీసుకెళ్లిన అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyberattack: తమ ట్రెజరీ డిపార్ట్మెంట్పై చైనా సైబర్ దాడులకు పాల్పడినట్లు గుర్తించామని అమెరికా ఆరోపించింది. వర్క్ స్టేషన్లలో ఉన్న కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు యత్నించినట్లు పేర్కొనింది. కాంగ్రెస్కు రాసిన లేఖలో ఈ విషయాలను వాషింగ్టన్ వెల్లడించింది. అయితే, డిసెంబర్ ప్రారంభంలో ఈ సైబర్ దాడి జరిగినట్లు తేలిపింది. థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్ బియాండ్ ట్రస్ట్ నెట్వర్క్ లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్లు వర్క్స్టేషన్లు, కీలకమైన పత్రాలను యాక్సెస్ చేసినట్లు చెప్పుకొచ్చింది. డిసెంబర్ 8వ తేదీన బియాండ్ ట్రస్ట్ అప్రమత్తమై ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చిందని యూఎస్ ట్రెజరీ విభాగం అధికారి చెప్పుకొచ్చారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఎఫ్బీఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
Read Also: South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడికి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్ట్
Also Read
- Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
- Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
- Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
అయితే, దీనిపై ఎఫ్బీఐ అధికారులు ఇంకా రియాక్ట్ కాలేదు. కాగా, వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. మాపై అమెరికా చేస్తున్న ఆరోపణలను గట్టిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొచ్చింది. మరోవైపు జార్జియాలోని బియాండ్ ట్రస్ట్ సైతం ఈ సైబర్ దాడిపై రియాక్ట్ కాలేదు. వారి వెబ్సైట్లో.. ఇటీవల తమ కస్టమర్ల భద్రత ముప్పు వాటిల్లిందని పేర్కొనింది. దీనిపై విచారణ కొనసాగుతుందని తెలిపింది. బియాండ్ ట్రస్ట్ తెలిపిన భద్రతా సంఘటన ట్రెజరీ నివేదించిన హ్యాకింగ్ ఘటనకు దగ్గరగా ఉందని గుర్తించాం. అయినా ఈ ఘటనపై విచారణ జరగాలని సైబర్ సెక్యూరిటీ కంపెనీ అధికారి చెప్పారు.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?