China: ముదిరిన యూఎస్, చైనా వాణిజ్య వివాదం.. బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ సహా పలు సంస్థలపై ఆంక్షలు..
- యూఎస్, చైనాల మధ్య ముదిరిన వివాదం..
- పలు యూఎస్ సంస్థలపై చైనా ఆంక్షలు..
- తైవాన్కి ఆయుధాలు అమ్మడంపై డ్రాగన్ కంట్రీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టే లోపే వాణిజ్య యుద్ధానికి చైనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ సంస్థలపై ఆంక్షలను తీవ్రతరం చేయడం ద్వారా చైనా యూఎస్కి సవాల్ విసిరింది. ఒక వారం వ్యవధిలోనే చైనా ఈరోజు 10 యూఎస్ కంపెనీలపై సెకండ్ రౌండ్ ఆంక్షలను ప్రకటించింది. తైవాన్కి ఆయుధాలు అమ్మడం వల్లే చైనా, యూఎస్ కంపెనీలపై జరిమానాలు, ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
Read Also: Maharashtra: చనిపోయాడని డిక్లేర్ చేసి ఆస్పత్రి.. ‘‘స్పీడ్ బ్రేకర్’’ ప్రాణాలను రక్షించింది..
Also Read
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
- ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
చైనా మొత్తం 45 అమెరికా సంస్థలపై చర్యలు తీసుకుంది. 17 సంస్థలపై ఆంక్షలు విధించగా, 28 సంస్థల ఎగుమతి నిషేధ జాబితాలో చేర్చి జరిమానా విధించింది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రక్షణ తయారీదారుగా ఉన్న బోయింగ్ డిఫెన్స్, లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, జనరల్ డైనమిక్స్ వాటి అనుబంధ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం… తైవాన్కి ఆయుధాలు అమ్మకంలో పాల్గొన్నందున మొత్తం 10 అమెరికన్ సంస్థలు అవిశ్వసనీయ సంస్థల జాబితాలో చేర్చబడ్డాయని పేర్కొంది. ఈ కంపెనీల నుంచి దేశంలోకి దిగుమతి, ఎగుమతులను నిషేధించబడ్డాయని పేర్కొంది. చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు వారిని అనుమతించబోమని చెప్పింది. ఆయా కంపెనీల సీనియర్ మేనేజ్మెంట్ని దేశంలోకి రాకుండా నిషేధిస్తామని తెలిపింది.
తైవాన్, తమ ‘‘వన్ చైనా’’ విధానంలో భాగమని చైనా వాదిస్తోంది. గత కొంత కాలంగా తైవాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటోంది. మరోవైపు తైవాన్కి అమెరికా అండగా నిలుస్తోంది. గతేడాది మేలో ప్రజాస్వామ్య ఎన్నికల్లో తైవాన్ అధ్యక్షుడిగా లాయ్ చింగ్ తే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు చైనా సైనిక కసరత్తు నిర్వహించింది. న్యూ ఇయర్ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్.. తైవాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పకనే చెప్పారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!