China: ముదిరిన యూఎస్, చైనా వాణిజ్య వివాదం.. బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ సహా పలు సంస్థలపై ఆంక్షలు..
- యూఎస్, చైనాల మధ్య ముదిరిన వివాదం..
- పలు యూఎస్ సంస్థలపై చైనా ఆంక్షలు..
- తైవాన్కి ఆయుధాలు అమ్మడంపై డ్రాగన్ కంట్రీ ఫైర్..
China: చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టే లోపే వాణిజ్య యుద్ధానికి చైనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ సంస్థలపై ఆంక్షలను తీవ్రతరం చేయడం ద్వారా చైనా యూఎస్కి సవాల్ విసిరింది. ఒక వారం వ్యవధిలోనే చైనా ఈరోజు 10 యూఎస్ కంపెనీలపై సెకండ్ రౌండ్ ఆంక్షలను ప్రకటించింది. తైవాన్కి ఆయుధాలు అమ్మడం వల్లే చైనా, యూఎస్ కంపెనీలపై జరిమానాలు, ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
Read Also: Maharashtra: చనిపోయాడని డిక్లేర్ చేసి ఆస్పత్రి.. ‘‘స్పీడ్ బ్రేకర్’’ ప్రాణాలను రక్షించింది..
Also Read
- RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
- Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
చైనా మొత్తం 45 అమెరికా సంస్థలపై చర్యలు తీసుకుంది. 17 సంస్థలపై ఆంక్షలు విధించగా, 28 సంస్థల ఎగుమతి నిషేధ జాబితాలో చేర్చి జరిమానా విధించింది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రక్షణ తయారీదారుగా ఉన్న బోయింగ్ డిఫెన్స్, లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, జనరల్ డైనమిక్స్ వాటి అనుబంధ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం… తైవాన్కి ఆయుధాలు అమ్మకంలో పాల్గొన్నందున మొత్తం 10 అమెరికన్ సంస్థలు అవిశ్వసనీయ సంస్థల జాబితాలో చేర్చబడ్డాయని పేర్కొంది. ఈ కంపెనీల నుంచి దేశంలోకి దిగుమతి, ఎగుమతులను నిషేధించబడ్డాయని పేర్కొంది. చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు వారిని అనుమతించబోమని చెప్పింది. ఆయా కంపెనీల సీనియర్ మేనేజ్మెంట్ని దేశంలోకి రాకుండా నిషేధిస్తామని తెలిపింది.
తైవాన్, తమ ‘‘వన్ చైనా’’ విధానంలో భాగమని చైనా వాదిస్తోంది. గత కొంత కాలంగా తైవాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటోంది. మరోవైపు తైవాన్కి అమెరికా అండగా నిలుస్తోంది. గతేడాది మేలో ప్రజాస్వామ్య ఎన్నికల్లో తైవాన్ అధ్యక్షుడిగా లాయ్ చింగ్ తే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు చైనా సైనిక కసరత్తు నిర్వహించింది. న్యూ ఇయర్ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్.. తైవాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పకనే చెప్పారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!