China: ముదిరిన యూఎస్, చైనా వాణిజ్య వివాదం.. బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ సహా పలు సంస్థలపై ఆంక్షలు..
- యూఎస్, చైనాల మధ్య ముదిరిన వివాదం..
- పలు యూఎస్ సంస్థలపై చైనా ఆంక్షలు..
- తైవాన్కి ఆయుధాలు అమ్మడంపై డ్రాగన్ కంట్రీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టే లోపే వాణిజ్య యుద్ధానికి చైనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ సంస్థలపై ఆంక్షలను తీవ్రతరం చేయడం ద్వారా చైనా యూఎస్కి సవాల్ విసిరింది. ఒక వారం వ్యవధిలోనే చైనా ఈరోజు 10 యూఎస్ కంపెనీలపై సెకండ్ రౌండ్ ఆంక్షలను ప్రకటించింది. తైవాన్కి ఆయుధాలు అమ్మడం వల్లే చైనా, యూఎస్ కంపెనీలపై జరిమానాలు, ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
Read Also: Maharashtra: చనిపోయాడని డిక్లేర్ చేసి ఆస్పత్రి.. ‘‘స్పీడ్ బ్రేకర్’’ ప్రాణాలను రక్షించింది..
Also Read
- Sheikh Hasina: "నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు": షేక్ హసీనా
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
చైనా మొత్తం 45 అమెరికా సంస్థలపై చర్యలు తీసుకుంది. 17 సంస్థలపై ఆంక్షలు విధించగా, 28 సంస్థల ఎగుమతి నిషేధ జాబితాలో చేర్చి జరిమానా విధించింది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రక్షణ తయారీదారుగా ఉన్న బోయింగ్ డిఫెన్స్, లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, జనరల్ డైనమిక్స్ వాటి అనుబంధ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం… తైవాన్కి ఆయుధాలు అమ్మకంలో పాల్గొన్నందున మొత్తం 10 అమెరికన్ సంస్థలు అవిశ్వసనీయ సంస్థల జాబితాలో చేర్చబడ్డాయని పేర్కొంది. ఈ కంపెనీల నుంచి దేశంలోకి దిగుమతి, ఎగుమతులను నిషేధించబడ్డాయని పేర్కొంది. చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు వారిని అనుమతించబోమని చెప్పింది. ఆయా కంపెనీల సీనియర్ మేనేజ్మెంట్ని దేశంలోకి రాకుండా నిషేధిస్తామని తెలిపింది.
తైవాన్, తమ ‘‘వన్ చైనా’’ విధానంలో భాగమని చైనా వాదిస్తోంది. గత కొంత కాలంగా తైవాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటోంది. మరోవైపు తైవాన్కి అమెరికా అండగా నిలుస్తోంది. గతేడాది మేలో ప్రజాస్వామ్య ఎన్నికల్లో తైవాన్ అధ్యక్షుడిగా లాయ్ చింగ్ తే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు చైనా సైనిక కసరత్తు నిర్వహించింది. న్యూ ఇయర్ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్.. తైవాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పకనే చెప్పారు.
తాజావార్తలు
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!