Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమకు అడ్డురాని మతం, పెళ్లికి మాత్రం అడ్డొచ్చింది. ఇస్లాంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని లవర్ చెప్పడంతో ఇది ఇష్టం లేని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. ఈ కేసులో 24 ఏళ్ల షారూఖ్ అనే నిందితుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
Atiq Ahmed: గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ పోలీసుకు ఇచ్చిన వాంగ్మూలంలో తనకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఇంటర్ సర్విసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించాడు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్లను ప్రయాగ్రాజ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.
Yogi Adityanath: మాఫియా, ఉగ్రవాదులు, నేరస్తులకు అడ్డాగా ఉత్తర్ ప్రదేశ్ కొన్ని ఏళ్లపాటు ఉంది. అయితే ప్రస్తుతం ఇది మారుతోంది. గతంలో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు గ్యాంగ్ స్టర్లు రాజకీయ నాయకులుగా చలామణి అయ్యారు.
Farmer : ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అందరికీ అన్నం పెట్టే అన్నదాత అధికారుల ముందే ఆత్మార్పణ చేసుకోవడం పలువురిని కంట తడి పెట్టించింది.
Jewellery Robbery: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ దోపిడి జరిగింది. ఏకంగా ఓ జువెలరీ షాప్ కు కన్నం వేశారు. మాస్టర్ ప్లాన్ వేసి జువెలరీని దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే మీరట్ నగరంలోని ఓ నగల దుకాణంలోకి డ్రెయినేజీ నుంచి భారీ సొరంగాన్ని తవ్వారు. 10 అడుగుల సొరంగాన్ని నేరుగా జువెలరీలోకి తవ్వి లక్షల రూపాయల విలువై ఆభరణాలను దోపిడి చేశారు. మంగళవారం ఉదయం షాప్ తెలిసిన తర్వాత యజమాని సొరంగాన్ని చూసి షాక్ తిన్నాడు. షాపులోని…
ప్రస్తుతం గుజరాత్లోని సబర్మతి జైలులో ఉన్న గ్యాంగ్స్టర్గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ను ఉత్తరప్రదేశ్ పోలీసుల 45 మంది సభ్యుల బృందం ప్రయాగ్రాజ్ జైలుకు తరలించనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు.
Uttar Pradesh: రైల్వే ఉద్యోగులకు మరికొందరి తప్ప ఎవ్వరైనా సరే టికెట్ ఉంటేనే రైలులో ప్రయాణం చేయాలి.. టికెట్ లేకుండా రైలు ఎక్కడమే కాదు.. తాము పోలీసులం అంటూ బెదిరింపులకు గురిచేసి.. టికెట్ ఉన్నవాళ్లను లేపి.. వారి సీట్లు కూర్చోవడంతో.. సదరు టికెట్ కలెక్టర్కు చిర్రెత్తుకొచ్చింది.. రైలులో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన ఆ పోలీసు బృందానికి తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చేశాడు టీటీ.. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కవడంతో…
Umesh Pal murder case: యూపీ రాజకీయాలను ఉమేష్ పాల్ హత్య కేసు కుదిపేస్తోంది. ఇటీవల ఈ హత్యపై యూపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), ఆ పార్టీ చీఫ్ పై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. యూపీలో మాఫియాను మట్టిలో కలిపేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుల కోసం 10 పోలీస్ టీములు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇదిలా ఉంటే…
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని సీరియల్ కిల్లర్ సంచరిస్తున్నాడు. హంతకుల కోసం ఆరు పోలీసు బృందాలు వెతుకులాటలో నిమగ్నమయ్యాయి.