Yogi Adityanath: మాఫియాకు సింహస్వప్నంగా యోగి.. 10 వేలకు పైగా ఎన్కౌంటర్లు.. ఫేమస్ ఎన్కౌంటర్లు లిస్ట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: మాఫియా, ఉగ్రవాదులు, నేరస్తులకు అడ్డాగా ఉత్తర్ ప్రదేశ్ కొన్ని ఏళ్లపాటు ఉంది. అయితే ప్రస్తుతం ఇది మారుతోంది. గతంలో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు గ్యాంగ్ స్టర్లు రాజకీయ నాయకులుగా చలామణి అయ్యారు. తాజాగా నేరసామ్రాజ్యంలో వినిపిస్తున్న అతిక్ అహ్మద్ కూడా గతంలో ఐదుసార్లు సమాజ్ వాదీ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వరసగా యూపీ పోలీసులు మాఫియా, గ్యాంగ్ స్టర్లను లేపేస్తున్నారు. క్రైమ్ ఫ్రీ యూపీగా పోలీసులు పనిచేస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు పోలీస్ ఎన్ కౌంటర్లలో 183 మంది నేరస్తులు మరణించారు. తాజాగా ఈ రోజు గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ను పారిపోతున్న సమయంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఎస్టీఎఫ్ టీం మట్టుబెట్టింది.
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
యోగి హయాంలో యూపీలో జరిగిన ఎన్ కౌంటర్లు ఇవే..
- గ్యాంగ్స్టర్ వికాస్ దూబే జూలై 10, 2020న కాన్పూర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఉజ్జయిని నుండి కాన్పూర్కు దూబేను తీసుకువెళుతున్న పోలీసు వాహనం బోల్తాపడటంతో ఎన్కౌంటర్ జరిగింది మరియు గ్యాంగ్స్టర్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
- జూలై 25, 2020న, గ్యాంగ్స్టర్ టింకు కపాలా బారాబంకిలో యూపీ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లో హతం అయ్యాడు.
- అక్టోబర్ 18, 2021న లక్నోలోని గోమతి నగర్ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో బంగ్లాదేశ్ గ్యాంగ్స్టర్ హమ్జా మరణించాడు.
- సిధ్పురా పోలీస్ స్టేషన్కు చెందిన ఒక కానిస్టేబుల్ను హత్య చేసి, అంతకుముందు కాస్గంజ్లో సబ్-ఇన్స్పెక్టర్ను గాయపరిచినట్లు నేరంలో నిందితుడిగా ఉన్న మోతీ సింగ్ ఫిబ్రవరి 21, 2021న రాష్ట్ర పోలీసులు ఎన్కౌంటర్లో చంపబడ్డారు.
- సెప్టెంబర్ 30, 2022న, జౌన్పూర్ పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్స్టర్ వినోద్ కుమార్ సింగ్ మరణించాడు. ఇతడిపై లక్ష రూపాయల రివార్డ్ ఉంది.
- మార్చి 21, 2022న వారణాసి (రూరల్)లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (UPSTF)తో జరిగిన ఎదురుకాల్పుల్లో మనీష్ సింగ్, అలియాస్ సోను హతం అయ్యాడు. ఇతడిపై 32 కేసులు ఉన్నాయి. ఏడు హత్య కేసులు, ఐదు హత్యాయత్నం దోపిడి సహా నేరారోపణలు ఉన్నాయి.
- మాఫియాగా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ మరియు ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్ గా ఉన్న మక్సుదాన్ కుమారుడు గులాం ఈరోజు ఝాన్సీ వద్ద ఎస్టీఎఫ్ బృందంతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఇద్దరిపై ఒక్కొక్కరిపై రూ.5 లక్షల రివార్డు ఉంది.
2017 నుండి ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్లు
ఉత్తర్ ప్రదేశ్ లో యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 10,713 ఎన్ కౌంటర్లు జరిగాయి. ఇందులో 183 మంది నేరస్తులు హతం అయ్యారు. చనిపోయిన అందరిపై తీవ్రమైన నేరాలు ఉన్నాయి. వీరందరిపై రూ. 75,000 నుంచి రూ.5 లక్షల వరకు నగదు రివార్డు ఉంది. ఆరేళ్లలో ప్రతీ 13 రోజులకు కనీసం ఒక నేరస్తులు చనిపోయాడు. మార్చి 20, 2017 మరియు మార్చి 6, 2023 మధ్య జరిగిన ఎన్కౌంటర్ల తరువాత 23,069 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 4,911 మంది గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో 15 మంది పోలీసులు మరణించారు. 2017లో 28 మంది, 2018లో 41 మంది, 2019లో 34 మంది, 2020 లో 26 మంది, 2021లో 26 మంది, 2022లో 14 మంది, ఈ ఏడాది మార్చి వరకు పోలీసు ఎన్కౌంటర్లలో తొమ్మిది మంది నేరస్థులు మరణించారు.
తాజావార్తలు
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!