భారీవర్షాలు బీభత్సం కలిగిస్తున్నాయి. కపిల తీర్థం వద్ద వరద నీరు కలకలం రేపుతోంది. తిరుమల కొండపై నుంచినీటి ప్రవాహం కొనసాగుతుండడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. జలపాతం నుంచి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. నీటి ప్రవాహం ధాటికి కూలిపోయింది పురాతన మంటపం. గడిచిన మూడు రోజులుగా కూలుతూ వస్తున్న మంటపం, గత రాత్రి మరింతగా కూలిపోయింది. దీంతో కపిలతీర్థంలోకి ఎవరినీ అనుమతించడం లేదు టీటీడీ అధికారులు. కపిలతీర్థం శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం…
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏపీలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతిలో మునుపెన్నడూ చూడన విధంగా వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు వరదల కారణంగా కొండచరియలు విరిగి ఘాట్ రోడ్డుపై పడిపోయాయి. అంతేకాకుండా మెట్టుమార్గంలో చెట్లు, వరద నీటితో అస్థవ్యస్థంగా తయారైంది. దీంతో ఘాట్ రోడ్డుపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే… తాజాగా వర్షం తగ్గుముఖం పట్టిన నేపథ్యంతో తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి…
తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దాంతో టీటీడీ దర్శనాలు నిలిపివేసింది. అయితే ఈ వర్షాలతో టీటీడీ కి 4 కోట్లకు పైగా నష్టం వచ్చింది అని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. మొదటి ఘాట్ రోడ్డులో ఐదు ప్రాంతాలలో కోండ చరియలు విరిగిపడ్డాయి. రెండవ ఘాట్ రోడ్డులో 13 ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా…ఐదు ప్రాంతాలలో రక్షణ గోడ దెబ్బతింది అని అన్నారు. అలాగే నారాయణగిరి అతిథి గృహం వద్ద కోండచరియలు విరిగిపడడంతో మూడు గదులు…
జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు కెఎస్.జవహర్ రెడ్డి. ప్రస్తుతం టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డా.జవహర్ రెడ్డిని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అమరావతిలో ఈరోజు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు జవహర్ రెడ్డి. ప్రస్తుతం డిప్యుటేషన్పై దేవదాయ శాఖలో ఉన్న ఆయన్ను వెనక్కు తీసుకుని జలవనరుల శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. అయితే ఈవో స్థానంలో మరొకరిని నియమించేవరకూ…
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. రెండు రోజుల పాటు.. తిరుమలకు వెళ్లే రెండు నడకదారులను మూసివేయాలని నిర్ణయించింది టీటీడీ.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ.. ముందస్తు చర్యలు చేపట్టింది.. అందులో భాగంగా.. బుధ, గురువారాల్లో తిరుమలకు వెళ్లే రెండు నడకదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది… వర్షాల నేపథ్యంలో.. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ…
ఒకవైపు వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలతో తిరుమల వెళ్ళే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. గురువారం రాత్రి 8 గంటలకు రెండు ఘాట్ రోడ్ల మూసివేస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ. తిరిగి రేపు ఉదయం 6 గంటల నుంచి వాహనాలను ఘాట్ రోడ్డు లో అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఘాట్ రోడ్డులో పలు ప్రాంతాలు కొండచరియలు విరిగిపడుతుండడంతో ముందస్తు జాగ్రత్తగా మొదటి ఘాట్ రోడ్డు మూసివేస్తోంది టీటీడీ. తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే భక్తులు 7 గంటలలోపు ప్రయాణం చెయ్యాలని విజ్ఞప్తి…
విద్యుత్ కష్టాలు, అదనపు భారం నుంచి టీటీడీ బయటపడే మార్గాలు వెతుకుతోంది. ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ప్రారంభించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 139 కేవీఏ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటయింది. టీటీడీ కళాశాలలో ఇప్పటి వరకు యూనిట్ విద్యుత్కు రూ. 11.50 చెల్లిస్తున్నామని, ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్తో యూనిట్ ఖర్చు రూ. 3.33కు తగ్గిందన్నారు. మొత్తంగా కళాశాలపై విద్యుత్తు బిల్లుల భారం నెలకు రూ. లక్షకు పైగా తగ్గింది. కళాశాల భవనాల…
ఢిల్లీలోని టీటీడీ దేవాలయం “స్థానిక సలహా మండలి” చైర్ పర్సన్గా వేద మంత్రాల ఆశీర్వచనంతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బాధ్యతలు స్వీకరించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయంలో గోపూజ ప్రశాంతి రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాల విస్తరణ, సేవల విస్తరణ కోసం ఢిల్లీ “లోకల్ అడ్వైజరీ కమిటీ” పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఉత్తరాదిన ఢిల్లీ,…
టీటీడీలో జరుగుతోన్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీటీడీలోని 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుకు జనసేనా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.. పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీని ఎందుకు విస్మరించారు అంటూ ఫైర్ అయ్యారు.. టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సహేతుకమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు జనసేనాని.. 2010లో టీటీడీ సూచనల మేరకే 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారు.. మరి కొత్తగా ఇప్పుడు…
అది దేశంలోనే ప్రముఖ హాస్పిటల్. అందులో ఆయన డాక్టర్ కాని డాక్టర్. అర్హత లేకపోయినా ఆ హస్పిటల్ లో ఉన్నత పదవిలో ఉన్నారు. ఇప్పుడాయన ఆ హాస్పిటల్ అభివృద్ధి చేయటం కంటే, దాన్ని వెనక్కిలాగడంలోనే ఆయన ముందున్నారట. ఆ ఆస్పత్రికి ఎందుకా పరిస్థితి వచ్చింది? ఆ అధికారి వ్యవహార శైలి ఉంటి? తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా బర్డ్ హాస్పిటల్ ను ఏర్పాటు చేసింది. 1985లో పోలియో బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్…