తిరుమలలో చిరుత కలకలం.. సైరన్ మోగించిన సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. కరోనా కారణంగా గతంలో భక్తులు తక్కువగా వచ్చేవారు. కానీ ఇప్పుడు క్రమేపీ భక్తులు పెరుగుతున్నారు. తాజాగా తిరుమలలో కలకలం రేగింది. రెండవ ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత కనిపించడంతో అలజడి కలిగింది. ఘాట్ రోడ్డులోని ఆఖరి మలుపు వద్ద చిరుత సంచరించింది.
ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు ముగించుకుని తిరుమలకు వస్తున్న కార్మికులకు కనపడింది చిరుత. దానిని చూసి విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు కార్మికులు. వెంటనే ఘటన స్థలంకు చేరుకొని సైరన్ తో శబ్ధాలు మోగించారు విజిలెన్స్ సిబ్బంది. దీంతో చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. దీంతో బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు కార్మికులు.
Also Read
అంతకుముందు ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను పర్యవేక్షించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఘాట్ రోడ్డులో 7,8,9వ కిలోమీటర్ వద్ద మరమ్మతు పనులు పూర్తిఅయినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 14,15వ కిలో మీటర్ వద్ద కొనసాగుతున్నాయి మరమ్మతు పనులు. భవిష్యత్తులో కొండ చరియలు విరిగిపడకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. నెల రోజుల్లో మరమ్మతు పనులు పూర్తి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..