అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి సేవలో తరించేందుకు మరోసారి టీటీడీ అవకాశం కల్పించింది. ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవల టికెట్ ధర నిర్ణయిస్తూ టీటీడీ ప్రకటన చేసింది. సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.కోటి ఉండగా.. శుక్రవారం నాడు మాత్రం రూ.కోటిన్నరగా నిర్ణయించింది. ఈ టికెట్పై 6గురు స్వామి వారి సేవలో పాల్గొనవచ్చు. జనవరి రెండో వారం నుంచి 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. అయితే ఈ టికెట్ల ద్వార రూ.600…
ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజులో ఉదయాస్తమాన సేవా టిక్కెట్టు కోటి రూపాయలుగా… శుక్రవారం రోజున కోటిన్నరాగా నిర్ణయించింది. ప్రస్తుతం టీటీడీ వద్ద అందుబాటులో 531 ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు ఉన్నాయి. ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల పై 25 సంవత్సరాల పాటు స్వామి వారి ఆర్జిత సేవలో పాల్గోనే అవకాశం పోందనున్నారు భక్తులు. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు భక్తులు పాల్గొనే సౌలభ్యం ఉంది.…
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. కరోనా కారణంగా గతంలో భక్తులు తక్కువగా వచ్చేవారు. కానీ ఇప్పుడు క్రమేపీ భక్తులు పెరుగుతున్నారు. తాజాగా తిరుమలలో కలకలం రేగింది. రెండవ ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత కనిపించడంతో అలజడి కలిగింది. ఘాట్ రోడ్డులోని ఆఖరి మలుపు వద్ద చిరుత సంచరించింది. ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు ముగించుకుని తిరుమలకు వస్తున్న కార్మికులకు కనపడింది చిరుత. దానిని చూసి విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు కార్మికులు. వెంటనే ఘటన…
ఇవాళ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు.. 500 మంది రైతులకు దర్శన సౌకర్యం కల్పించనుంది టీటీడీ.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లో శ్రీవారిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు… కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు. కాగా, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో అమరావతి రైతులు మహాపాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.. నవంబర్ 1వ తేదీన తుళ్లూరు నుంచి మహా పాదయాత్ర ప్రారంభించిన…
తిరుమల తిరుపతి దేవస్థానం అగర్బత్తీలు తయారుచేయడంపై ఏపీ సాధుపరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు ధార్మిక సంస్థా? లేక వ్యాపార సంస్థా? అని ఏపీ సాధుపరిషత్ ప్రశ్నించింది. శ్రీవారి పూజ అనంతరం నిర్మల్యాలను అగర్బత్తీలా మారుస్తామంటే అర్థం ఏంటని మండిపడింది. స్వామి వారి పూజకు వినియోగించిన పూలు పర్యావరణానికి హాని ఎలా అవుతాయో టీటీడీ చెప్పాలని ఏపీ సాధుపరిషత్ డిమాండ్ చేసింది. హిందూ వ్యతిరేక చర్యలను టీటీడీ ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికింది. స్వామివారికి అలంకారం…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తాం అని వైవి సుబ్బారెడ్డి అన్నారు. జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది. కోవిడ్ నిభందనలు సడలిస్తే…పండుగ తరువాత సర్వదర్శనం పెంపు ,ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తాం. 11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు. చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని.. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలంటూ సోషల్మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ స్పందించింది. టీటీడీ ఉద్యోగాలంటూ సోషల్మీడియాల ప్రకటనలు నమ్మొద్దని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇలా అవాస్తవ ప్రకటనలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. ఉద్యోగ ప్రకనపై పత్రికా ప్రకటన ద్వారా తెలుపుతామని, ఇలాంటి వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ కోరింది.
కలియుగ వైకుంఠం తిరుమలలో భారీవర్షాలు అపార నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. తిరుమల కొండకు వెళ్ళే రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు ఐఐటీ టీం. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించడం, అవి విరిగి పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం నిర్మాణం అంశాలపై నివేదిక సమర్పించనుంది ఐఐటీ బృందం. తిరుమల ఘాట్ రోడ్డులో 10 సంవత్సరాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి. పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరమే…
తిరుమల రెండో ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేసింది టీటీడీ పాలక మండలి. 14వ కిలో మీటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో తొలగింపు పనులు చేపట్టారు సిబ్బంది. 16 వ కిలో మీటర్ వద్ద భారీ కోతకు గురైంది రోడ్డు. అలాగే…. 14వ కిలో మీటర్ వద్ద కొండచరియలు తొలగింపు పూర్తి అయితే… లింక్ రోడ్డు మీదుగా వాహనాలు మళ్లింపు చేపట్టే అవకాశం ఉండనుంది. 16వ కిలో మీటర్ వద్ద మరమత్తులకు నెలల…
డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు ఇవాళ తిరుపతిలో జరగనున్నాయి. ఆయన పార్థివదేహం విశాఖ నుంచి తిరుపతికి చేరుకుంది. సిరిగిరి అపార్ట్మెంట్లో భక్తుల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 3 గంటల వరకు పూజలు నిర్వహించి.. తిరుపతి గోవింద ధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ… తిరుమల రానున్నారు. డాలర్ శేషాద్రి పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. విశాఖపట్నంలో కార్తీక…