Home
Ttd
Ttd News
-
గంటలో పూర్తయిన టీటీడీ దర్శనం టికెట్లు…
ఈరోజు ఆన్ లైన్ లో వచ్చే జనవరి మాసంకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ. రోజుకి 8 వేల చోప్పున టీటీడీ టికెట్లను విడుదల చేసింది. అయితే ఏపీలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిన దర్శనాల టికెట్ల సంఖ్యను మాత్రం టీటీడీ ఇంకా పెంచలేదు. ఇదిలా ఉంటె టీటీడీ విడుదల చేసిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు గంటలో పూర్తి అయిపోయాయి. జనవరి మాసంకు సంభందించి నాలుగు… -
ఉదయాస్తమాన టికెట్లపై టీటీడీ క్లారిటీ…
తిరుమల తిరుపతి దేవస్థానం ఉదయాస్తమాన సేవా టిక్కెట్లపై క్లారిటీ ఇచ్చింది. ఈ సేవను 1982లోనే ప్రారంభించినట్టు అదనపు ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 531 సేవా టికెట్లను మాత్రమే భక్తులకు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. చిన్న పిల్లల కార్డిక్ ఆసుపత్రి ఏర్పాటుకు 500 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. Read: హీరో నానికి థాంక్స్ చెప్పిన మహిళా నేత.. చిన్న పిల్లల హాస్పటల్కు కోటి రూపాయల విరాళంగా అందించిన… -
రేపు టీటీడీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల…
ప్రత్యేక దర్శనం టోకెన్లను ఆన్లైన్లో జారీ చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ రేపు ఉ. 9 గంటలకు 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల చేయనుంది. రోజుకి 20 వేల చొప్పున 6 లక్షల 20 వేల టిక్కెట్లు విడుదల చేస్తుంది. అలాగే ఈరోజు సాయంత్రం సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున టీటీడీ.. వచ్చే నెల నుండి ఆఫ్లైన్లో 5 వేల టోకెన్లు జారీ చేయనున్నారు టీటీడీ అధికారులు. రోజుకి 5వేల చొప్పున లక్షా… -
టీటీడీపై గోవిందానంద సరస్వతీ స్వామీజీ ఆగ్రహం
తిరుమలలో పరిణామాలపై మండిపడ్డారు గోవిందానంద సరస్వతీ స్వామీజీ. కిష్కింధ హనుమ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులుగా వున్న గోవిందానంద సరస్వతీ స్వామీజీ టీటీడీ వ్యాపార ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారిని అంగట్లో అమ్మొద్దన్నారు. శ్రీవారిని రోడ్డుమీద పెట్టి స్వామి సేవలను కోటి రూపాయలకు అమ్ముతున్నారా..? శ్రీవారి సేవలు వెల కట్టలేనిది. సేవలను టిక్కెట్ల రూపంలో అమ్మి హాస్పిటల్ కట్టాలంటే అది సమంజసం కాదు. స్వామి పేరు చెప్పి సొమ్ము ఒకడిది..సోకు మరొకడిది అనేవిధంగా టీటీడీ… -
బ్రేకింగ్ : టీటీడీలో ఉదయాస్తమాన సేవ.. ధర రూ.కోటి
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి సేవలో తరించేందుకు మరోసారి టీటీడీ అవకాశం కల్పించింది. ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవల టికెట్ ధర నిర్ణయిస్తూ టీటీడీ ప్రకటన చేసింది. సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.కోటి ఉండగా.. శుక్రవారం నాడు మాత్రం రూ.కోటిన్నరగా నిర్ణయించింది. ఈ టికెట్పై 6గురు స్వామి వారి సేవలో పాల్గొనవచ్చు. జనవరి రెండో వారం నుంచి 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. అయితే ఈ టికెట్ల ద్వార రూ.600… -
ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల ధరను నిర్ణయించిన టీటీడీ…
ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజులో ఉదయాస్తమాన సేవా టిక్కెట్టు కోటి రూపాయలుగా… శుక్రవారం రోజున కోటిన్నరాగా నిర్ణయించింది. ప్రస్తుతం టీటీడీ వద్ద అందుబాటులో 531 ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు ఉన్నాయి. ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల పై 25 సంవత్సరాల పాటు స్వామి వారి ఆర్జిత సేవలో పాల్గోనే అవకాశం పోందనున్నారు భక్తులు. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు భక్తులు పాల్గొనే సౌలభ్యం ఉంది.… -
తిరుమలలో చిరుత కలకలం.. సైరన్ మోగించిన సిబ్బంది
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. కరోనా కారణంగా గతంలో భక్తులు తక్కువగా వచ్చేవారు. కానీ ఇప్పుడు క్రమేపీ భక్తులు పెరుగుతున్నారు. తాజాగా తిరుమలలో కలకలం రేగింది. రెండవ ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత కనిపించడంతో అలజడి కలిగింది. ఘాట్ రోడ్డులోని ఆఖరి మలుపు వద్ద చిరుత సంచరించింది. ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు ముగించుకుని తిరుమలకు వస్తున్న కార్మికులకు కనపడింది చిరుత. దానిని చూసి విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు కార్మికులు. వెంటనే ఘటన… -
శ్రీవారి దర్శనానికి అమరావతి రైతులు.. 500 మందికి అనుమతి
ఇవాళ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు.. 500 మంది రైతులకు దర్శన సౌకర్యం కల్పించనుంది టీటీడీ.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లో శ్రీవారిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు… కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు. కాగా, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో అమరావతి రైతులు మహాపాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.. నవంబర్ 1వ తేదీన తుళ్లూరు నుంచి మహా పాదయాత్ర ప్రారంభించిన… -
టీటీడీ అగర్బత్తీల తయారీపై వివాదం
తిరుమల తిరుపతి దేవస్థానం అగర్బత్తీలు తయారుచేయడంపై ఏపీ సాధుపరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు ధార్మిక సంస్థా? లేక వ్యాపార సంస్థా? అని ఏపీ సాధుపరిషత్ ప్రశ్నించింది. శ్రీవారి పూజ అనంతరం నిర్మల్యాలను అగర్బత్తీలా మారుస్తామంటే అర్థం ఏంటని మండిపడింది. స్వామి వారి పూజకు వినియోగించిన పూలు పర్యావరణానికి హాని ఎలా అవుతాయో టీటీడీ చెప్పాలని ఏపీ సాధుపరిషత్ డిమాండ్ చేసింది. హిందూ వ్యతిరేక చర్యలను టీటీడీ ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికింది. స్వామివారికి అలంకారం… -
వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయాలు…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తాం అని వైవి సుబ్బారెడ్డి అన్నారు. జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది. కోవిడ్ నిభందనలు సడలిస్తే…పండుగ తరువాత సర్వదర్శనం పెంపు ,ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తాం. 11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు. చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం…
తాజావార్తలు
-
AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
-
Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
-
Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!