ఐక్యరాజ్యసమితి కౌన్సిల్ సమావేశాల కోసం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆయన బృందం నేటి నుంచి ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్లో 80వ ఐరాస కౌన్సిల్ సమావేశం జరుగుతోంది.
ట్రంప్ సుంకాల ప్రభావమో.. లేదంటే హెచ్ 1బీ వీసాల ప్రభావమో తెలియదు గానీ.. బంగారు ధరలు మాత్రం పైపైకి వెళ్లిపోతున్నాయి. ధరలు తగ్గితే కొందామనుకుంటున్న గోల్డ్ ప్రియులకు రోజురోజుకు ధరలు షాకిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ధరలు దూసుకుపోతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చాలా రోజుల తర్వాత పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఇందుకు చార్లీ కిర్క్ సంతాప కార్యక్రమం వేదిక అయిది. ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ను గుర్తు చేసుకుంటూ ఆదివారం స్మారక మెమోరియల్ సర్వీస్ జరిగింది.
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మరోసారి అవే మాటలు వచ్చాయి. తానే ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ మరో సారి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 40 కన్నా ఎక్కువ సార్లు పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 7 యుద్ధాలను ఆపినందుకు తనకు ‘‘నోబెల్ శాంతి బహుమతి’’ ఇవ్వాలని అన్నారు.
ఖతార్పై ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ తీరును తప్పుపట్టాయి. అయితే ఈ దాడులతో తనకెలాంటి సంబంధం లేదని ట్రంప్ ప్రకటించారు. తనకు తెలియకుండానే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందని చెప్పుకొచ్చారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సముద్రం ద్వారా దేశంలోకి ప్రవేశించే డ్రగ్స్పై అమెరికా వేట సాగిస్తోంది. తాజా దాడిలో ముగ్గురు చనిపోయినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. వీడియోలో వేగంగా దూసుకుపోతున్న బోటుపై ఒక్కసారిగా బాంబ్ దాడి జరగడంతో ధ్వంసమైంది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, లండన్ తొలి ముస్లి్ం మేయర్ సాదిక్ ఖాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ట్రంప్, సాదిక్ ఖాన్ ‘‘ప్రపంచంలోనే చెత్త మేయర్లలో ఒకరు’’ అని విమర్శించారు. యూకే రాజధానిలో నేరాలు, వలసల్ని అరికట్టడంతో ఆయన విఫలమయ్యారని అన్నారు. తన గౌరవార్థం యూకే ప్రభుత్వం ఇస్తున్న విందుకు అతడిని ఆహ్వానించవద్దని తానను వ్యక్తిగతంగా కోరినట్లు వెల్లడించారు.
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే కలవబోతున్నారు. అక్టోబర్లో కౌలాలంపూర్లో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ, ట్రంప్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారతదేశానికి, ప్రధాని మోడీకి చాలా దగ్గరగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్ను ఆంక్షలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్పై ఆంక్షలు విధించినట్లు చెప్పుకొచ్చారు.