US-Pakistan: ఆపరేషన్ సిందూర్ ఆపేందుకు అమెరికాలో పాక్ లాబీయింగ్.. వెలుగులోకి..!
- మే 7న పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్
- బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్
- అమెరికాలో పాక్ లాబీయింగ్
- వెలుగులోకి వచ్చిన కీలక పత్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం పాకిస్థాన్పై ప్రతీకారంగా మే 7న భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు నాలుగు రోజులు తర్వాత కాల్పుల విరమణ జరిగింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో 100 మంది ఉగ్రవాదులు చనిపోగా.. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.

Also Read
- Alibaba: ప్రముఖ ఈ-కామర్స్ అలీబాబా చైర్మన్ దంపతులు విడాకులు.. 30 ఏళ్ల బంధానికి గుడ్బై!
- Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
- US Passport Ranking: అగ్రరాజ్యానికి ఊహించని దెబ్బ.. యూఎస్ పాస్పోర్ట్ పవర్ తగ్గిందా? భారత్ ర్యాంక్ చూస్తే ఆశ్చర్యపోతారు!
- Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
తాజాగా ఆపరేషన్ సిందూర్ ఆపేందుకు అమెరికాలో పాకిస్థాన్ తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేసినట్లుగా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ పత్రాలు పేర్కొన్నాయి. అమెరికాలోని పాకిస్థాన్ రాయబారి, రక్షణ అధికారులు 60 మందికిపైగా అధికారులు.. మధ్యవర్తులతో ఈ-మెయిల్లు, ఫోన్కాల్స్, వ్యక్తిగత సమావేశాల ద్వారా పదే పదే అమెరికాతో సంప్రదింపులు జరిగినట్లుగా ప్రభుత్వ పత్రాలు వెల్లడించాయి.
ఏదొక విధంగా ఆపరేషన్ సిందూర్ ఆపాలని.. జోక్యం కోసం వాషింగ్టన్పై ఒత్తిడి చేయాలని ఇస్లామాబాద్ కోరినట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ను ఎదుర్కొనేందుకు ఇస్లామాబాద్ తీవ్ర ఇబ్బందులు పడడంతో పాకిస్థాన్ అసాధారణమైన లాబీయింగ్ దిగినట్లుగా అమెరికా ప్రభుత్వ పత్రాలు పేర్కొన్నాయి. మొత్తానికి మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.
అమెరికా ద్వారా లాబీయింగ్ చేయడంతో ప్రతిఫలంగా నవంబర్ 2025లో ఏటా దాదాపు 5 మిలియన్ల విలువైన వాణిజ్య ఒప్పందాలపై పాకిస్థాన్ సంతకం చేసిందని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అంతేకాకుండా ఇస్లామాబాద్ ఒప్పందం కుదుర్చుకున్న వారాల తర్వాత పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను వైట్హౌస్కు ట్రంప్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మునీర్కు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ సమావేశం తర్వాత అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలోనే ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ అసిమ్ మునీర్ నామినేట్ చేశారు.
మే 7న పాకిస్థాన్పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 10న రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. అయితే ఈ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. అయినా కూడా ట్రంప్.. భారత్-పాకిస్థాన్ యుద్ధంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపినట్లుగా ఎక్కడికెళ్లానా చెప్పేవారు. మరోవైపు భారత్ ఖండిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 70 సార్లు వరకు ట్రంప్ ఆ ప్రకటన చేశారు. అయితే ట్రంప్ ప్రకటనకు పాకిస్థాన్ సంపూర్ణ మద్దతు ఇవ్వగా.. భారత్ వ్యతిరేకిస్తూ వచ్చింది.
తాజావార్తలు
-
Hyderabad Metro : 25 నిమిషాల్లో ప్రాణం కాపాడిన హైదరాబాద్ మెట్రో..
-
Rahul Gandhi: నీట్ బాధిత కుటుంబాలకు రాహుల్ గాంధీ ఓదార్పు.. ఎక్స్లో ఫొటోలు పోస్ట్
-
Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
-
Rahul Gandhi: ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్పై ఫిర్యాదు.. రాహుల్గాంధీతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్
-
Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి.!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!