US-Pakistan: ఆపరేషన్ సిందూర్ ఆపేందుకు అమెరికాలో పాక్ లాబీయింగ్.. వెలుగులోకి..!
- మే 7న పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్
- బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్
- అమెరికాలో పాక్ లాబీయింగ్
- వెలుగులోకి వచ్చిన కీలక పత్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం పాకిస్థాన్పై ప్రతీకారంగా మే 7న భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు నాలుగు రోజులు తర్వాత కాల్పుల విరమణ జరిగింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో 100 మంది ఉగ్రవాదులు చనిపోగా.. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.

Also Read
- France: ఫ్రాన్స్లో కండోమ్ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
- Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
- Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్ల ముప్పు
- 150 Words on One Sticky Note: ఒకే స్టిక్కీ నోట్పై 150 పదాలు.. భారత సంతతి క్లౌడ్ ఇంజనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!
తాజాగా ఆపరేషన్ సిందూర్ ఆపేందుకు అమెరికాలో పాకిస్థాన్ తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేసినట్లుగా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ పత్రాలు పేర్కొన్నాయి. అమెరికాలోని పాకిస్థాన్ రాయబారి, రక్షణ అధికారులు 60 మందికిపైగా అధికారులు.. మధ్యవర్తులతో ఈ-మెయిల్లు, ఫోన్కాల్స్, వ్యక్తిగత సమావేశాల ద్వారా పదే పదే అమెరికాతో సంప్రదింపులు జరిగినట్లుగా ప్రభుత్వ పత్రాలు వెల్లడించాయి.
ఏదొక విధంగా ఆపరేషన్ సిందూర్ ఆపాలని.. జోక్యం కోసం వాషింగ్టన్పై ఒత్తిడి చేయాలని ఇస్లామాబాద్ కోరినట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ను ఎదుర్కొనేందుకు ఇస్లామాబాద్ తీవ్ర ఇబ్బందులు పడడంతో పాకిస్థాన్ అసాధారణమైన లాబీయింగ్ దిగినట్లుగా అమెరికా ప్రభుత్వ పత్రాలు పేర్కొన్నాయి. మొత్తానికి మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.
అమెరికా ద్వారా లాబీయింగ్ చేయడంతో ప్రతిఫలంగా నవంబర్ 2025లో ఏటా దాదాపు 5 మిలియన్ల విలువైన వాణిజ్య ఒప్పందాలపై పాకిస్థాన్ సంతకం చేసిందని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అంతేకాకుండా ఇస్లామాబాద్ ఒప్పందం కుదుర్చుకున్న వారాల తర్వాత పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను వైట్హౌస్కు ట్రంప్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మునీర్కు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ సమావేశం తర్వాత అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలోనే ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ అసిమ్ మునీర్ నామినేట్ చేశారు.
మే 7న పాకిస్థాన్పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 10న రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. అయితే ఈ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. అయినా కూడా ట్రంప్.. భారత్-పాకిస్థాన్ యుద్ధంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపినట్లుగా ఎక్కడికెళ్లానా చెప్పేవారు. మరోవైపు భారత్ ఖండిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 70 సార్లు వరకు ట్రంప్ ఆ ప్రకటన చేశారు. అయితే ట్రంప్ ప్రకటనకు పాకిస్థాన్ సంపూర్ణ మద్దతు ఇవ్వగా.. భారత్ వ్యతిరేకిస్తూ వచ్చింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
-
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
-
Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
-
France: ఫ్రాన్స్లో కండోమ్ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
-
Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్లోకి రావాలి..!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!