వెనిజులా వ్యవహారం ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. శనివారం వెనిజులాపై అమెరికా భీకరమైన సైనిక చర్యకు దిగి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను.. అతని భార్య సిలియా ఫ్లోర్స్ను కారకాస్లో బంధించి అమెరికా తరలించింది.
అమెరికా-వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవి నుంచి దిగిపోవాలని గత కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు. కానీ ట్రంప్ హెచ్చరికలను నికోలస్ ఖాతర్ చేయలేదు. తాజాగా అమెరికా రంగంలోకి దిగింది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. షియా మతాధికారుల కోట అయిన కోమ్కు చేరుకున్నాయి.
2025 సంవత్సరం కొన్ని గంటల్లో ముగియనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది అంతర్జాతీయంగా అనేక ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు దేశాల మధ్య యుద్ధాలు.. ఇంకోవైపు ట్రంప్ ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించడం. ఇలా ఏడాది పొడవునా గందరగోళమే నెలకొంది. ఈ సంవత్సరం హైలెట్గా నిలిచిన వార్తలపై ఒకసారి లుక్కేద్దాం. ట్రంప్ వాణిజ్యం యుద్ధం ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ పదవీ…
తాము కూడా ‘‘శాంతికాముకులం’’ అంటూ డ్రాగన్ దేశం చైనా కూడా కొత్త రాగం అందుకుంది. ట్రంప్తో పాటు చైనా కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక యుద్ధాలు ఆపిందని.. శాంతి చర్చల్లో పాల్గొందంటూ కొత్త పలుకు పలికింది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.
భారత్-పాకిస్థాన్ యుద్ధం విషయాన్ని ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపితే సరైన క్రెడిట్ దక్కలేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో నెతన్యాహును కలిసిన సందర్భంగా మరోసారి ట్రంప్ గుర్తుచేశారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్కు సంబంధించిన ఏఐ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుతిన్ ‘శాంతాక్లాజ్’ వేషధారణలో ఆయా దేశాధినేతలకు గిఫ్ట్లు పంపించారు.
నెతన్యాహు ప్రధానిగా లేకుంటే ఇజ్రాయెల్ ఉనికిలో ఉండేదే కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. సోమవారం ఫ్లోరిడాలో ట్రంప్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కలిశారు. గాజా కాల్పుల విరమణ ప్రణాళిక తదుపరి దశకు వెళ్లే అంశంపై ట్రంప్తో నెతన్యాహు చర్చించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు మార్గం సుగమం అవుతోంది. నాలుగేళ్ల నుంచి రెండు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. చాలా రోజుల నుంచి విఫలమవుతున్న చర్చలు.. మొత్తానికి ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం ఫ్లోరిడాలో సమావేశం కాబోతున్నారు. రష్యాతో శాంతి ఒప్పందంపై ఇరువురి చర్చించనున్నారు. ఇలాంటి సమయంలో శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. దీంతో ఉక్రెయిన్ వైమానిక దళం దేశవ్యాప్తంగా వైమానిక హెచ్చరికను ప్రకటించింది.