ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది, దివంగత చార్లీ కిర్క్ 32వ పుట్టిన రోజు సందర్భంగా అమెరికా అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పురస్కారాన్ని ట్రంప్ అందజేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్కు మెడల్ను అందించారు. ఈ సందర్భంగా ఆద్యంతం ఎరికా కిర్క్ దు:ఖపడుతూనే ఉన్నారు. ట్రంప్ దగ్గరకు తీసుకుని ఓదార్చారు.
ఈజిప్టు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. గాజా శాంతి శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్-మాక్రాన్ మధ్య ‘ఆర్మ్ రెజ్లింగ్’ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
గాజాలో శాంతి వాతావరణం నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయా దేశాధినేతలంతా ట్రంప్ను అభినందిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా చేశారు. తొలిసారి ట్రంప్ను బైడెన్ అభినందించారు.
అందమైన యువతి అని పిలిస్తే అభ్యంతరం లేదు కదా? అని మెలోనిని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో మెలోని సహా వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఈజిప్టు వేదికగా సోమవారం గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరిగింది.
గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకాకపోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుపట్టారు. శాంతి సదస్సుకు రావాలని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు, ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు. కానీ మోడీ వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. సోమవారం షర్మ్ ఎల్ షేక్లో అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సీసీ ఆధ్వర్యంలో శాంతి శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు.
ఒక్కరోజు కాదు.. రెండ్రోజులు కాదు. ఏకంగా రెండేళ్లు చెరలో బందీలుగా ఉండిపోయారు. ఏదో రోజు తిరిగి వస్తారని ఎదురుచూసిన ఎదురుచూపులకు నిరీక్షణ ఫలించింది. సోమవారం తొలి విడత బందీలను హమాస్ విడుదల చేసింది. దీంతో ఇజ్రాయెల్ అంతటా పండుగ వాతావరణం నెలకొంది.
గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని.. ఇక యుద్ధం ముగిసినట్లేనని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, ఈజిప్టు పర్యటన కోసం ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కేటప్పుడు డోనాల్డ్ ట్రంప్ బొటనవేలు పైకి చూపిస్తూ విజయ సంకేతం ఇచ్చారు.
ఎట్టకేలకు గాజాలో శాంతి పరిమళాలు వెదజల్లబోతున్నాయి. హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత శాంతి ఒప్పందం విజయవంతంగా కుదిరింది. ఇందులో భాగంగా సోమవారం ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయనుంది.
గత నెలలో చైనా భారీ కవాతు నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయానికి 80 ఏళ్ల పూర్తయిన సందర్భంగా బీజింగ్లో భారీ కవాతు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా 25 దేశాధినేతలంతా హాజరయ్యారు.