Trump: మోడీతో నేను బాగానే ఉన్నా.. ఆయనే నాతో సంతోషంగా లేరు.. ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు
- నేను మోడీతో బాగానే ఉన్నా
- మోడీనే నాతో సంతోషంగా లేరు
- మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీతో సంబంధాలపై మరోసారి అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలు కారణంగా ప్రధాని మోడీ తనతో అంత సంతోషంగా లేరని.. తాను మాత్రం మోడీతో బాగానే ఉన్నానని పేర్కొన్నారు.
వైట్హౌస్లో జీవోపీ మెంటర్ రిట్రీట్లో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తనను చూడటానికి వచ్చారని తెలిపారు. ‘సర్.. దయచేసి నేను మిమ్మల్ని కలవవచ్చా’ అని అడిగారని.. కలవొచ్చని అన్నానన్నారు. ‘‘నాకు మోడీతో చాలా మంచి సంబంధం ఉంది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందున చాలా సుంకాలు చెల్లిస్తున్నారు. దీంతో మోడీ నాతో అంత సంతోషంగా లేరు. అయితే ప్రస్తుతం రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని తగ్గించారు..’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read
- Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
- China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
- Explainer: బంగాళాఖాతంలో పాగా వేయడానికి పాక్ కుట్రలు.. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల కథేంటి?
- Delimitation: TMC ఎఫెక్ట్.. నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్! మ్యాజిక్ ఫిగర్ను NDA ఎలా సాధించబోతోంది?
ఇది కూడా చదవండి: Off The Record : వింటర్ సెషన్ ను బహిష్కరిస్తూ బీఆర్ఎస్ నిర్ణయం.. అసలు కారణం ఏంటి ?
గతేడాది ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు. తొలుత భారత్పై 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందున ఉక్రెయిన్తో యుద్ధం ఆగడం లేదని వెంటనే చమురు కొనుగోలు నిలిపివేయాలని ట్రంప్ హెచ్చరించారు. కానీ భారత్ చమురు కొనుగోలు నిలిపివేయలేదు. దీంతో భారత్పై జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్పై 50 శాతం సుంకం విధించినట్లైంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఆ మధ్య రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తామని ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ ప్రకటనను భారతదేశం గతంలోనే తోసిపుచ్చింది. ట్రంప్తో అలాంటి సంభాషణే జరగలేదని భారత్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Sankranthi: రేపటి తీర్పుపై ప్రభాస్, చిరు సినిమాల భవితవ్యం.. టికెట్ రేట్లపై ఉత్కంఠ!
తాజావార్తలు
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!