అగ్ర రాజ్యం అమెరికాను మంచు తుఫాన్ గడగడలాడిస్తోంది. అనేక రాష్ట్రాల్లో మంచు తుఫాన్ దుప్పటి కప్పేసింది. ఇక న్యూయార్క్ నగరమైతే స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లక్షలాది కుటుంబాల్లో అంధకారం అలుముకుంది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితి విధించారు.
మధ్యప్రాచ్యంలో టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్పై దాడి కోసం అమెరికా భారీ ప్రణాళికలు రచిస్తోంది. తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా తీవ్ర కసరత్తు ప్రారంభించింది. తాజాగా మధ్య ప్రాచ్యంలో బలగాలు మోహరింపు కోసం అగ్ర రాజ్యం భారీ ‘ఎయిర్ బ్రిడ్జి’ని ఏర్పాటు చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్కు శుక్రవారం మంచి జోష్ కనిపిస్తోంది. గురువారం భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్.. శుక్రవారం మాత్రం లాభాలతో ప్రారంభమైంది. నిన్న దాదాపు రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఆ నష్టాన్ని ఈరోజు ఇన్వెస్టర్లు పూడ్చుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు గ్రీన్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 82,859 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 25,581 దగ్గర కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు గుడ్న్యూస్..…
ట్రంప్ నేతృత్వంలో గురువారం వాషింగ్టన్లో గాజా పునర్నిర్మాణంపై బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి భారత్తో పాటు దాయాది దేశం పాకిస్థాన్ సహా పలు దేశాధినేతలంతా హాజరయ్యారు.
‘‘సుబ్బి పెళ్లి.. వెంకి చావు’’కు వచ్చినట్లుంది మిత్రదేశాల మధ్య సంబంధం. ఇరాన్పై దాడికి అగ్ర రాజ్యం కసరత్తు చేస్తుండగా మిత్రదేశాలైన అమెరికా-బ్రిటన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి.
Donald Trump: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నాడు. ‘‘మీరు (భారత్, పాక్) ఘర్షణ పడితే ప్రతీ దేశంపై 200 శాతం సుంకాలు విధిస్తానని నేను చెప్పాను. డబ్బు కోల్పోయే పరిస్థితి వస్తే మనం పోరాడాలని అనుకోము’’ అని అమెరికా అధ్యక్షుడు బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభ సమావేశంలో అన్నారు. గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ , పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని…
మధ్యప్రాచ్యంలో మరో భీకర యుద్ధం జరగబోతుందా? సుదీర్ఘ కాలం ఉద్రిక్తలు తలెత్తబోతున్నాయా? క్షిపణి, రాకెట్, డ్రోన్ దాడులతో దద్దరిల్లబోతుందా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన రెండో విడత అణు చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి.
అంతర్జాతీయ సెక్స్ స్కామ్కు సంబంధించిన ఎప్స్టీన్ ఫైల్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అమెరికా రక్షణ శాఖ పత్రాలను విడుదల చేస్తోంది. ఈ పత్రాల్లో ఇప్పటికే అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. బిల్ క్లింటన్, బిల్ గేట్స్, డెమొక్రాటిక్ నేతల సహా ఎందరో ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ప్రపంచ అధినేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.