రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును భారత్లో అమెరికా రాయబారి సెర్గియా గోర్ కలిశారు. ఈ సందర్భంగా రాయబారిగా నియమితులైన పత్రాలను అందజేశారు. సెర్గియో గోర్ నుంచి అక్రిడిటేషన్ పత్రాలను ద్రౌపది ముర్ము స్వీకరించారు.
ఇరాన్లో పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయాయి. నగరాలు రక్తసిక్తంగా మారాయి. వందలాది మంది నిరసనకారులు శవాలు రోడ్లపై పడి ఉన్నాయి. దాదాపు వందలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు కారణంగా తీవ్ర నష్టాలు చవిచూసింది. గత వారం లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ట్రంప్ సన్నితుడు సెర్గియో గోర్ (38) భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. గత నవంబర్లో ఆయన నియమితులయ్యారు. తాజాగా ఆయన భారతదేశంలో రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇరాన్లో పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయాయి. గత డిసెంబర్ 28న ప్రారంభమైన నిరసనలు తాజాగా తీవ్ర రూపం దాల్చాయి. ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నిరసనకారులు ఆందోళనలు మరింత తీవ్రతరం చేశారు. ఇంకోవైపు భద్రతా దళాలు కాల్పులకు తెగబడుతున్నారు.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కిడ్నాప్ తర్వాత విలేకర్ల సమావేశంలో ట్రంప్ ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు. మదురో మాదిరిగా పుతిన్ను కూడా భవిష్యత్లో కిడ్నాప్ చేస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
జనవరి 3న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిపోయింది. మదురోతో పాటు ఆయన భార్యను పట్టుకెళ్లిపోయారు. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిన్నారులతో కలిసి సందడి చేశారు. వైట్హౌస్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పిల్లలతో కలిసి ట్రంప్ ఆడుకున్నారు.
వెనిజులా చమురు విక్రయానికి ట్రంప్ పిలుపునిచ్చారు. 50 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం వైట్హౌస్లో చమురు కంపెనీ అధిపతులతో ట్రంప్ సమావేశం అయ్యారు.