రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అమెరికా 28 పాయింట్ల ప్రణాళికను రూపొందించారు. దీనిపై ఇప్పటికే ట్రంప్ బృందం ఇరు దేశాలతో చర్చించాయి. 28 పాయింట్ల ప్రణాళికకు రష్యా అంగీకారం తెలిపింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ముందడుగు పడడం లేదు. ఇటీవల 28 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ ముందుకు తీసుకొచ్చారు. ఇక ట్రంప్ బృందం రంగంలోకి దిగి ఇరు దేశాలతో చర్చించారు.
కంబోడియా-థాయ్లాండ్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవలే ట్రంప్ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం చేశారు. మళ్లీ ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిగాయి. అనంతరం అలాస్కా వేదికగా పుతిన్తో స్వయంగా ట్రంప్ చర్చలు జరిపారు.
హమ్మయ్య.. మొత్తానికైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అవార్డు దక్కింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపి నాకు.. నోబెల్ శాంతి బహుమతి నాకు తప్ప ఇంకెవరికి వస్తుంది’’ అని భావించారు.
హెచ్-1బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన ఆంక్షలు విధించారు. దీంతో చాలా మంది హెచ్-1బీ వీసా దొరకక నానా యాతన పడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ ప్రతినిధులు ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నారు. తాజాగా మాస్కోలో పుతిన్తో అమెరికా దౌత్యవేత్తలు సమావేశం అయ్యారు.
వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోపై ఎప్పుడూ కారాలు.. మిరియాలు నూరే ట్రంప్.. ఆశ్చర్యంగా ఫోన్ సంభాషణ చేశారు. అయితే ఈ సంభాషణ కూడా కూల్.. కూల్గా కాకుండా.. హాట్హాట్గానే సాగినట్లు తెలుస్తోంది.
వైట్హౌస్ దగ్గర కాల్పుల ఘటనతో అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేద దేశాల నుంచి శాశ్వతంగా వలసలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైట్హౌస్ దగ్గర ఆప్ఘన్ జాతీయుడు రెహ్మానుల్లా కాల్పులకు తెగబడ్డాడు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోనే ఉదాహరణగా ఉంది. గురువారం థాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో ట్రంప్-మస్క్ పక్కపక్కనే కూర్చుని లంచ్ చేశారు.