రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు మార్గం సుగమం అవుతోంది. నాలుగేళ్ల నుంచి రెండు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. చాలా రోజుల నుంచి విఫలమవుతున్న చర్చలు.. మొత్తానికి ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం ఫ్లోరిడాలో సమావేశం కాబోతున్నారు. రష్యాతో శాంతి ఒప్పందంపై ఇరువురి చర్చించనున్నారు. ఇలాంటి సమయంలో శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. దీంతో ఉక్రెయిన్ వైమానిక దళం దేశవ్యాప్తంగా వైమానిక హెచ్చరికను ప్రకటించింది.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని యుద్ధాలు సద్దుమణిగాయి. కానీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం మాత్రం 4 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది.
థాయ్లాండ్-కంబోడియా మధ్య గత కొద్ది రోజులుగా సరిహద్దు వివాదంపై ఘర్షణ జరుగుతోంది. ఇరు దేశాలు సైనిక చర్యలకు దిగుతున్నారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచ దేశాలపై ఆదిపత్యం చెలాయిస్తున్నారు. తొలుత వాణిజ్య యుద్ధంతో మొదలు పెట్టగా.. ఇప్పుడు వీసాల పేరిట వార్ మొదలు పెట్టారు. H-1B వీసాలపై ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయానికి తూట్లు పొడిచారు.
అమెరికాలో సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ ఫైల్స్లోని కొన్ని పత్రాలను శుక్రవారం న్యాయశాఖ విడుదల చేసింది. అయితే విడుదలైన పత్రాలు డెమొక్రాట్ల నేతల లక్ష్యంగా విడుదల చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.
జో బైడెన్ ప్రభుత్వంపై మరోసారి ట్రంప్ నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం ఖజానాను దోచుకుందని ట్రంప్ ఆరోపించారు. శనివారం జరిగిన ఒక రాజకీయ కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు.
బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ వైట్హౌస్లో తళుక్కున మెరిసింది. శ్వేతసౌదంలో ట్రంప్ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మల్లికా షెరావత్ ప్రత్యక్షమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బాలీవుడ్ భామ సోషల్ మీడియాలో పంచుకుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్కార్డు లాటరీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల బ్రౌన్ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు.
అగ్ర రాజ్యం అమెరికాను ఎవరు పరిపాలించినా అధ్యక్షుల ఫొటోలు వైట్హౌస్లో ఉంటాయి. డెమొక్రాటిక్ నేతలైనా.. రిపబ్లికన్ నేతలైనా వారి చిత్రపటాలు శ్వేతసౌధంలో ఉంచుతారు. కొత్తగా ‘ప్రెసిడెన్షియల్ వాక్ ఆఫ్ ఫేమ్’ ఏర్పాటు చేశారు.