కష్టం, శ్రమ మనది.. కేసీఆర్ది దోపిడీ అని అందరూ గ్రహించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… తెలంగాణ ప్రజల సమస్యలు కేసీఆర్ గాలికి వదిలేశారన్న ఆయన.. ఇక్కడ సమస్యలను ఫేస్ చేసే దమ్ములేక ఇతర రాష్ట్రాలకు ఏదో వెలగ పెడతాను అని వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ నేతలు ఇక్కడికి వస్తే టూరిస్ట్ లని అన్నారు… తెలంగాణపై నాకున్న ఆరాటం జాతీయ పార్టీలకు ఉంటుందా? అని ప్రశ్నించారు… ఇప్పుడు ఆ ప్రజల్ని నట్టేట ముంచి పంజాబ్,…
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో కోరుట్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ లు కల్వకుంట్ల కవిత, ఎల్ రమణలు హజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపొందడమే మన ధ్యేయంగా అందరూ ముందుండాలన్నారు. గ్రామాల్లో ప్రధాన కూడళ్ల వద్ద టీఆర్ఎస్ అభివృద్ధిపై కార్యకర్తలు చర్చ జరపండని, తెలంగాణ వచ్చిందే యువకుల కోసం, అలాంటి యువత కోసం ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. అబద్ధానికి…
ఖమ్మం పార్లమెంటుకు గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తర్వాత టీఆర్ఎస్లో చేరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అనుచరులను పెట్టుకున్నారు. అక్కడ రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తారు ఈ మాజీ ఎంపీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొంగులేటి పాత్రపై రకరకాలుగా ప్రచారం జరిగింది. క్రాస్ ఓటింగ్ వెనక పొంగులేటి ఉన్నట్టు సీఎం కేసీఆర్కు నివేదికలు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనకు పార్టీ పదవులు..…
ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ టీఆర్ఎస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు ఎమ్మెల్యే మదన్రెడ్డి.. ఇంకోవైపు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఇక్కడ వేగంగా పావులు కదుపుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి గతంలో మూడుసార్లు నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2014, 2019లో టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ వేడుకలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే అవతరణ వేడుకలపై సీఎస్ సోమేష్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2014 జూన్ 2 ఏర్పడ్డ తెలంగాణ 2022లో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఇప్పటికే అవతరణ వేడుకలకు సంబంధించి సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిచనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జిల్లాల వారీగా అవతరణ వేడుకకు సంబంధించి ముఖ్య అతిథులను…
కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 31 సంవత్సరాలకు పెంచాలని అడిగానని… సీఎం కేసీఆర్ 32 ఏళ్లకు పెంచారని… నేను డిమాండ్ చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ స్పందించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మీరు ఉద్యోగాలు ఇస్తోంది వేలల్లో ఉన్నాయని… మిగితా నిరుద్యోగుల పరిస్థితి ఏంటని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు కేఏ పాల్. గత ఎనిమిదేళ్ల నుంచి మీకు చెబుతున్నా… వేడుకున్నా ప్రజాసమస్యలపై కేసీఆర్ స్పందించడం లేదని అన్నారు. ప్రజాశాంతి పార్టీ బడుగు,…
కంచర్ల భూపాల్రెడ్డి.. కంచర్ల కృష్ణారెడ్డి. టీఆర్ఎస్లో కంచర్ల బద్రర్స్గా ఫేమస్. వీరిలో భూపాల్రెడ్డి ప్రస్తుతం నల్లగొండ ఎమ్మెల్యే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోదరులిద్దరూ ప్రస్తుతం చర్చగా మారారు. వారి దూకుడు పార్టీ నేతలను, కార్యకర్తలను కలవర పెడుతుందట. నకిరేకల్, మునుగొడు నియోజకవర్గాలను నమ్ముకుని పనిచేస్తున్న పార్టీ నేతలకు తలనొప్పిగా మారినట్టు చర్చ నడుస్తోంది. కార్యకర్తల్లోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారట. దీంతో ఎక్కడ నెగ్గాలో… ఎక్కడ తగ్గాలో తెలియక పార్టీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయట. కంచర్ల బ్రదర్స్ స్వస్థలం…
యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు జిల్లాలోని దవాఖానల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటలకు బీబీనగర్లోని ఎయిమ్స్ దవాఖానను మంత్రి హరీష్ రావు సందర్శిస్తారు. 11.40 గంటలకు భువనగిరి పట్టణంలోని జిల్లా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఆధునీకరించిన పీడియాట్రిక్ కేర్ యూనిట్ (DPCU)ను మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారు. అనంతరం…
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… అందుకోసం ప్రత్యామ్నాయ ఎజెండాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తాజాగా జాతీయ స్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. అయితే.. సీఎం కేసీఆర్.. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ నెల 30 వరకు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీల నేతలను కలిసి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ధాన్యం కొనుగోలుపై కొంత కాలంగా కేంద్రంపై…
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామపంచాయతీల్లో 10 గ్రామాల్లో పది తెలంగాణకు చెందినవే అని టీఆర్ఎస్ పార్టీ ఛాతీలు కొట్టుకుంటున్నారని.. ప్లీనరీతో మొదలు పెడితే ఎక్కడ పడితే అక్కడ టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీ పనిచేసిన చోట ఒక్క అవార్డు కూడా రాలేదని… 10 పంచాయతీలు ఒక కాంగ్రెస్ ఎంపీ, ఇద్దరు బీజేపీ ఎంపీల పరిధిలోనే ఉన్నాయని అన్నారు. ఇది మీ టీఆర్ఎస్ పార్టీ నేతల పనితీరు, మీ…