TRS : అధికార పార్టీలో కలకలం రేపుతున్న బ్రదర్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంచర్ల భూపాల్రెడ్డి.. కంచర్ల కృష్ణారెడ్డి. టీఆర్ఎస్లో కంచర్ల బద్రర్స్గా ఫేమస్. వీరిలో భూపాల్రెడ్డి ప్రస్తుతం నల్లగొండ ఎమ్మెల్యే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోదరులిద్దరూ ప్రస్తుతం చర్చగా మారారు. వారి దూకుడు పార్టీ నేతలను, కార్యకర్తలను కలవర పెడుతుందట. నకిరేకల్, మునుగొడు నియోజకవర్గాలను నమ్ముకుని పనిచేస్తున్న పార్టీ నేతలకు తలనొప్పిగా మారినట్టు చర్చ నడుస్తోంది. కార్యకర్తల్లోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారట. దీంతో ఎక్కడ నెగ్గాలో… ఎక్కడ తగ్గాలో తెలియక పార్టీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయట.
కంచర్ల బ్రదర్స్ స్వస్థలం నకిరేకల్ నియోజకవర్గం. అది ఎస్సీ రిజర్డ్వ్ సెగ్మెంట్ కావడంతో.. టీడీపీలో ఉన్న ఇద్దరూ ఎన్నికల ముందు గులాబీ కండువా కప్పుకొన్నారు. 2018లో భుపాల్రెడ్డి నల్లగొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి నల్లగొండలో సోదరులు ఏం చెబితే అదే శాసనం. అలాంటిది కంచర్ల కృష్ణారెడ్డి మునుగోడుపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారట. అక్కడ తానే ఎమ్మెల్యే అభ్యర్థినని ప్రచారం చేసుకోవడం దుమారం రేపింది. అక్కడితో ఆగకుండా నకిరేకల్లో రాజకీయాల్లోనూ వేలు పెడుతున్నారట. వీటిని పార్టీ పెద్దలు సీరియస్గా తీసుకోవడంతో ఆ మధ్య కంచర్ల సోదరులు వెనక్కి తగ్గారు. ఆ కూలింగ్ పిరియడ్ అయిపోయిందని అనుకున్నారో ఏమో.. మునుగోడులో మరోసారి కృష్ణారెడ్డి కదలికలు ఎక్కువయ్యాయట. పార్టీతో సంబంధం లేకుండా.. టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ నేతలను వెంటేసుకుని కార్యక్రమాలు నిర్వహించడం చర్చగా మారింది.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఇప్పటికే మునుగోడు టీఆర్ఎస్లో మూడు ముక్కలాట సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మరో పార్టీ నేత కర్నాటి విద్యాసాగర్లు నియోజవర్గంలో పట్టుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కంచర్ల కృష్ణారెడ్డి వంతు వచ్చింది. నల్లగొండలో పని చూసుకోకుండా మా దగ్గరకు వచ్చి వేలు పెట్టడం ఎందుకని టీఆర్ఎస్ నేతలు ఓపెన్గానే ప్రశ్నలు సంధిస్తున్నారు. ముందు ఇంట గెలవాలని గట్టిగానే చురకలు వేస్తున్నారట. ఇంకోవైపు మునుగోడులో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న గులాబీ నేతలకు కృష్ణారెడ్డి పంటికింద రాయిలా మారినట్టు చర్చ జరుగుతోంది.
ఇదేదో మొదటికే మోసం వస్తుందని అనుకుంటున్నారో ఏమో.. మునుగోడులోని పార్టీ నేతలు కృష్ణారెడ్డి తీరును టీఆర్ఎస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లే పనిలో పడ్డారట. ఆయన మాత్రం దూకుడు తగ్గించేలేదన్నట్టుగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఆధిపత్యపోరాటం చూశాక మునుగోడులో మూడు ముక్కలాట .. నాలుగు స్తంభాలాటగా మారిందని గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!