ఆర్సీబీలా మేం కూడా ప్లేఆఫ్స్కు చేరతాం.. నితీశ్ రెడ్డి కామెంట్స్ వైరల్! ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. వరుస పరాజయాలు చవిచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు అద్భుత ప్రదర్శన చేస్తోన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్కు చేరువయ్యాయి. లేటుగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ…
ఐపీఎల్ 2025లో మొదటిసారి.. నాలుగో స్థానానికి పీబీకేఎస్! ఐపీఎల్ 2025లో మొదటిసారి ఓ మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోయింది. ఛేదనలో కేకేఆర్ ఇన్నింగ్స్లో ఒక ఓవర్ ముగిశాక వర్షం మొదలైంది. భారీ గాలులకు మైదానంను కవర్లతో కవర్ చేయడం కూడా కష్టమైంది. వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో ఆట సాధ్యం కాలేదు. వరుణుడి ప్రతాపంతో…
నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు. ఎడ్లబండ్లపై సభకు బీఆర్ఎస్ శ్రేణులు. సభకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్, BRS నేతలు. ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు. ముంబైతో తలపడనున్న లక్నో. ముంబై వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకి మ్యాచ్. ఢిల్లీ తో తలపడనున్న బెంగళూరు. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్. నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణభవన్లో పార్టీ జెండా ఎగరవేయనున్న కేటీఆర్.అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించనున్న కేటీఆర్.…
పాక్ అధికారి కవ్వింపు.. పీక కోస్తామంటూ ప్రవాస భారతీయులకు బెదిరింపు.. వీడియో వైరల్ యూకేలో పాకిస్థాన్ హైకమిషన్కు చెందిన కల్నల్ తైమూర్ రహత్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. పహల్గామ్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయులు లండన్లోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల నిరసన ప్రదర్శన చేపట్టారు. కల్నల్…
మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఏపీలోని పాకిస్థానీయులకు సర్కార్ హెచ్చరికలు.. పాకిస్థాన్ పౌరుల వీసాల రద్దు నిర్ణయంతో యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, పోలీసు అధికారులకు నోట్ విడుదల చేసింది. వీసాల రద్దు నిర్ణయంపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్దేశించింది. ఈనెల 27 నుంచి వివిధ అవసరాల కోసం జారీ అయ్యే పాకిస్థాన్ వీసాల రద్దు చేసిన అంశాన్ని మారోసారి ప్రస్తావించింది. ప్రభుత్వం, విశాఖ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. పాకిస్థాన్…
వాటికన్ సిటీలో పర్యటనలో భారత రాష్ట్రపతి. నేడు పోప్ ఫ్రావిన్స్ అంత్యక్రియల్లో భారత్ తరుఫున పాల్గొననున్న ద్రౌపది ముర్ము. నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ఎచ్చర్లలో మత్స్యకార భృతి పంపిణీ చేయనున్న చంద్రబాబు. మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున సాయం. 1,29,178 మత్య్సకార కుటుంబాలకు లబ్ధి. నేడు కాకినాడలో మంత్రి బీసీ జనార్థన్రెడ్డి పర్యటన. యాంకరేజ్ పోర్ట్, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ పరిశీలించనున్న మంత్రి. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న మంత్రి జనార్థన్రెడ్డి.…
బెజవాడలో 10 మంది ఉగ్రవాదులు?.. ఉగ్ర కదలికలపై పోలీసుల ఆరా.. బెజవాడలో ఉగ్ర కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిమి(SIMI) సానుభూతి పరుల గురించి 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి బెజవాడ పోలీసులకు సమాచారం అందింది. కేంద్ర నిఘా సంస్థ నలుగురు అనుమానితులు గురించి సమాచారం ఇచ్చింది. మరో ఆరుగురు అనుమానితులను స్థానిక పోలీసులు గుర్తించారు. మొత్తం 10 మంది కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. 10 మంది గొల్లపూడి, అశోక్ నగర్,…
ఎట్టకేలకు సొంతగడ్డపై విజయం.. ప్లేఆఫ్స్కు చేరువైన ఆర్సీబీ! ఐపీఎల్ 2025లో ఎట్టకేలకు సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు రుచిని చవిచూసింది. 18వ సీజన్లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల ఛేదనలో రాజస్థాన్ 9 వికెట్లకు 194 పరుగులే చేయలిగింది. ఐపీఎల్ 2025లో ఆరో విజయంను ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరువైంది. మరో రెండు విజయాలు సాధిస్తే…
బాలుడి కిడ్నాప్.. గంటలో చేధించిన పోలీసులు పాతబస్తీ చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. అయితే, ఈ సంఘటనలో పోలీసులు వేగంగా స్పందించడంతో గంటలోనే బాలుడిని రక్షించి, కిడ్నాపర్లను పట్టుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక బాలుడిని అతని బాబాయి సాదిక్ దగ్గరకు తీసుకెళ్లారు. సాదిక్ బాలుడిని ఓ వైన్ షాప్ కు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన సాదిక్ స్పృహ కోల్పోయి రోడ్డు పక్కనే పడిపోయాడు. ఈ…
ఉగ్రవాదులను వేటాడి మట్టుబెట్టాలి.. పహల్గామ్ ఉగ్రదాడి భారత దేశంపై దాడిగా భావించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్ర వాదులకు కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలి అని కోరారు. జాతీయ భద్రతపై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అన్నారు. ఉగ్రవాదులను వేటాడి మట్టుబెట్టేలా ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగించాలి అని ఆయన చెప్పుకొచ్చారు. ఉగ్రవాద సవాలును ఏకాభిప్రాయంతో పరిష్కరించడానికి, ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలి.. ఇది…