శ్రీ ధనలక్ష్మి మూవీస్ పతాకంపై ఎమ్.వినయ్ బాబు దర్శకత్వంలో బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం `సీతారామపురంలో ఒక ప్రేమ జంట`. గ్రామీణ వాతావరణంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంతో రణధీర్ హీరోగా, నందిని రెడ్డి హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ గురువారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ‘పాటలు, టీజర్ చూశాక చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమని అర్థమవుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ తో విశ్వక్ సేన్ కొత్త సినిమా ప్రారంభం అయింది. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. లీడ్ పెయిర్ విశ్వక్, ఐశ్వర్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మా…
యస్వంత్ , జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన తారాగణంగా సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. దీనికి తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మాత. ఈ సినిమా రెండు పాటల మినహా పూర్తయ్యింది. బాలెన్స్ ఉన్న ఆ రెండు పాటలను కశ్మీర్ లో చిత్రీకరించబోతున్నారు. వీటి షూటింగ్ నిమిత్తం యూనిట్ కశ్మీర్ వెళుతున్న సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ లో మీడియా…
కరోనా తర్వాత తెలుగు చిత్రపరిశ్రమ సాధారణ స్థితికి చేరుకోవడమే కాదు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుతో చకాచకా ముందుకు సాగిపోతోంది. మన సినిమాకు ఇప్పుడు జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఒక్కసారిగా కార్మికుల సమ్మెతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. మరి తెలుగు సినిమా ఎదుగదలలో తాము ఉన్నామని చాటిన సినీ కార్మికులు వేతనాల పెంపు కారణంతో సమ్మె చేయటానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం… తెలుగు చిత్రపరిశ్రమకు సుప్రీం బాడీ ఫిలిమ్…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సినీ, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు కొత్త ఛైర్మన్ ను నియమించింది. టీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ. సెల్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ కూర్మాచలం ను ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్.డి.సి. ఛైర్మన్ పుస్కర్ రామ్మోహన్ పదవి కాలం పూర్తి అయ్యి చాలా యేళ్ళు గడిచినా ఈ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిపై దృష్టి పెట్టని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.…
నవతరం తెలుగు సినిమా రచయితల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు బి.వి.యస్. రవి. కొందరు అతణ్ణి ‘మచ్చ’ రవిగానూ పిలుస్తూ ఉంటారు. ఎలా పిలిచినా పలికే ఈ రచయిత మాటలు కోటలు దాటేలా ఉంటాయి, నిర్మాతల మూటలు నింపేలానూ సాగుతుంటాయి. రవి రాసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, నందమూరి బాలకృష్ణ కోసం ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ షో కోసం అతను పలికించిన మాటలు ఓ ఎత్తు అని చెప్పవచ్చు. నటునిగా, రచయితగా, దర్శకునిగా, నిర్మాతగానూ సాగిన రవి…
ఈ మధ్య ప్రముఖ దర్శకుడు జయంత్ సి.ఫరాన్జీ ఓ సారి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి ఆయనతో ఫోటీ తీసుకున్నారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అనేక చిత్రాల్లో ఎంతో చెలాకీగా కనిపించిన పరుచూరి వెంకటేశ్వరరావు, అంత ముసలివారా అని అందరూ అవాక్కయ్యారు. ఎంతోమంది దర్శకుల తొలి చిత్రాలకు పరుచూరి సోదరులు రచన చేసి అలరించారు. అలాగే జయంత్ మొదటి సినిమా’ ప్రేమించుకుందాం…రా’ కు కూడా…
సాయి ధన్సిక, కిశోర్, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి. ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర, పోసాని ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘షికారు’. అన్ లిమిటెడ్ ఫన్ రైడ్ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ ద్వారా హరి కొలగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైజాగ్ కు చెందిన ప్రముఖ పంపిణీదారుడు పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ) ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 24న విడుదల కావాల్సి ఉన్న ‘షికారు’ చిత్రాన్ని ఇప్పుడు జూలై…
‘దళం’, ‘జార్జ్ రెడ్డి’తో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఆకాష్ పూరి హీరోగా తీసిన సినిమా ‘చోర్ బజార్’. గెహనా సిప్పీ నాయిక. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ‘నా గత చిత్రాలైన దళం, జార్జ్ రెడ్డికి భిన్నంగా పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో తీసిన చిత్రమిది. బ్లడ్ షెడ్ లేకుండా…