బాలు పాట… ప్రతీ చోట…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 25న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి)
గానగంధర్వుడుగా జనం మదిలో నిలచిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మనవాడు. తెలుగువాడు. బాలు పాటే మనకు తోడు. మనసు బాగోలేనప్పుడు ఆయన గానం మనకు ఓదార్పు. బాలు గాత్రంలో జాలువారిన హుషారయిన పాటలు వింటే చాలు జోష్ కలగాల్సిందే! అంతలా మనలను అలరించిన బాలు భారతీయుడు కావడం మహదానందం. ఇంకా చెప్పాలంటే బాలు పాట విన్నప్రతీవారూ పులకించిపోతారు. ఆ కోణంలో బాలు విశ్వమానవుడు కూడా! ఏ తీరున చూసినా బాలు అందరివాడు. అందరినీ మెప్పించినవాడు. భావితరాలకు స్ఫూర్తి ప్రదాత! తెలుగు పలుకు ఉన్నంత వరకు ఆయన పాట కూడా సాగుతూనే ఉంటుంది. మనకు ఆనందం పంచుతూనే ఉంటుంది. అదీ బాలు గళ మాహాత్మ్యం!
Also Read
- Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
- The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న 'ది ఇండియా స్టోరీ' టీజర్
- Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనగానే ఈ తరం వారికి ‘పాడుతా..తీయగా…’ గుర్తుకు వస్తుంది. ఆ వేదిక నుండి ఎందరో గాయనీగాయకులను చిత్రసీమకు అందించిన ఘనత నిస్సందేహంగా బాలుదే! ఆ తరువాత అదే పంథాలో ఎందరో పయనించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఆ కార్యక్రమాలను చూస్తే బాలు లేని లోటు ఏ పాటిదో ఇట్టే తెలిసి పోతుంది. ‘నాది శ్రుత పాండిత్యం…’ అంటూనే పండితులకు సైతం అంతుచిక్కని అనంత కోణాలను ఆవిష్కరిస్తూ బాలు పలికిన పలుకులు ఈ నాటికీ మన మదిలో చిందులు వేస్తూనే ఉన్నాయి. బాలు నిర్వహించిన సంగీత కార్యక్రమాల్లో ఆయన నోటి నుండి జాలువారిన అమూల్యమైన మాటలు భావితరాలకు బంగారు బాటలు వేస్తూనే ఉన్నాయి. నొప్పించక తానొవ్వక… అన్న చందాన బాలు చిత్రసీమ ప్రయాణం సాగింది. ఇక న్యాయనిర్ణేతగా కూడా బాలు అదే పంథాలో సాగి, వర్ధమాన గాయనీగాయకుల గాత్రాలను సవరించిన తీరును సంగీతప్రియులు ఏ నాటికీ మరచిపోలేరు.
ఏమిటి మీ బాలు గొప్ప? అని ఎవరూ ప్రశ్నించలేరు. ఎందుకంటే బాలు ఏ భాషలో పాట పాడినా, ఆ భాషవారిని ఇట్టే ఆకట్టుకొనేవారు. కేవలం మధురగానంతో పరవశింప చేయడమేనా బాలుకు ఉన్న గొప్ప! అలా అన్నా తప్పే అవుతుంది. ప్రపంచంలో మరే గాయకుడూ పాడనన్ని పాటలు పాడి జనానికి మహదానందం పంచినవారు బాలు. ఆ రికార్డు సృష్టించిన సమయంలో ఎందరో బాలును ఆకాశానికి ఎత్తేశారు. కానీ, అంతటి ఉన్నత శిఖరం మీదున్నా, “నేనెప్పటికీ మీ బాలుణ్ణే… మీ బాలూనే…” అంటూ ఎంతో సంస్కారవంతంగా బాలు పలికిన పలుకులు ఈ నాటికీ అభిమానుల మదిలో మారుమోగుతూనే ఉన్నాయి. అదే బాలు గొప్పతనం. ఆయన పాటే కాదు సంస్కారం సైతం మధురమైనదే! అలాంటి మధురమూర్తి మన బాలు అవనిని వీడి అప్పుడే ఏడాది అయిందా అనిపిస్తుంది. అసలు బాలును, బాలు మాటను, ఆయన పాటను మరచిపోగలమా!? మతిమరపు అధికంగా ఉన్న వారికి సైతం బాలు పాట, మాట, సంస్కారం అన్నీ గుర్తుంటాయి. ఆ విషయం ఆయనకూ బాగా తెలుసు. అందుకే “ఇదే పాట…ప్రతీచోటా…ఇలాగే పాడుకుంటాను…” అంటూ ఏడాది క్రితం ఇదే రోజున (సెప్టెంబర్ 25న) దివికేగి అక్కడివారికి తన పాటతో మధురం పంచుతున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!