ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో ఇండియా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనను కనబరిచిన సంగతి తెలిసిందే. దాదాపు 40 సంవత్సరాల తరువాత భారత హాకీ టీమ్ ఒలింపిక్స్లో పతకాన్ని సాధించింది. జర్మనీని ఓడించి కాంస్యపతకాన్ని సొంతం చేసుకుంది. 40 ఏళ్ల తరువాత హాకీ టీమ్ జట్టు పతకం సాధించడంతో దేశంలోని ప్రభుత్వాలు వారిని ఘనంగా సన్మానిస్తున్నాయి. అయితే, పంజాబ్ ప్రభుత్వం ఒ అడుగు ముందుకువేసి వారి ఘనత చిరస్తాయిగా నిలిచిపోయేందుకు వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. పతకం సాధించిన…
టోక్యో ఒలింపిక్స్లో ఇండియా మొత్తం ఏడు పతకాలు సాధించింది. ఇందులో నాలుగు కాంస్యం, రెండు రజతం, ఒక గోల్డ్ పతకం ఉన్నది. అయితే, కొన్ని విభాగాల్లో ఇండియా అద్భుతమైన ప్రతిభను కనబరిచినా, చివరి నిమిషంలో పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. విమెన్ హాకీ టీమ్ ఆద్యంతం అద్భుతమైన ఆటను ప్రదర్శించినా చివరకు కాస్యం చేజార్చుకుంది. కానీ, ఆటతీరుతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. వెయిట్ లిఫ్టర్ దీపికా పూనియా తదితరులు తృతిటో కాంస్యం చేజార్చుకున్న సంగతి తెలిసిందే.…
ఇటీవల టోక్యో ఒలింపిక్స్లో బాక్సింగ్ విభాంగంలో కాంస్యపతకం గెలుచుకున్న లవ్లీనాకు అస్సాం ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కోటి రూపాయల నగదుతో పాటుగా, ఆమెకు పోలీసు శాఖల డీఎస్పీ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది ప్రభుత్వం. అంతేకాదు, ఆమె నివశించే గ్రామంలో బాక్సింగ్ అకాడెమి ఏర్పాటుతో పాటుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ను నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హామీ ఇచ్చారు. టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తరువాత లవ్లీనా ఈరోజు సొంత రాష్ట్రం అస్సాంకు చేరుకున్నది. ఆమెను రీసీవ్ చేసుకోవడానికి…
ఒలింపిక్స్లో విశేష ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ. రజనీకి ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదు ఇవ్వడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎంను తన తల్లిదండ్రులతో కలిసి రజనీ కలుసుకున్నారు. టోక్యో ఒలిపింక్స్లో కాంస్యపతక పోరువరకూ కూడా భారత మహిళల జట్టు దూసుకెళ్లింది. జట్టు విజయాల్లో రజనీ కీలక పాత్ర పోషించారు. రజనీని ముఖ్యమంత్రి శాలువాతో…
ప్రతి ఏడాది నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఒలింపిక్స్ గేమ్స్కు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గేమ్స్లో పాల్గొని పతకం సాధించాలని క్రీడాకారులు ఉవ్విళ్లూరుతుంటారు. కరోనా సమయంలో సవాళ్లను ఎదుర్కొని జపాన్ టోక్యో ఒలింపిక్స్ను విజయవంతంగా నిర్వహించింది. 17 రోజులపాటు సాగిన ఈ గేమ్స్లో 200 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక ఇదిలా ఉంటే, భూమిపై టోక్యోలో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహిస్తే, స్పేస్లో వ్యోమగాములు స్పేస్ ఒలింపిక్స్ను నిర్వహించారు. వ్యోమగాములు రెండు జట్లుగా…
అది క్రీడా గ్యారేజ్…! అక్కడ చాంఫియన్లు తయారు చేయబడును..! అవును ఒలింపిక్స్ గేమ్స్ వచ్చిన ప్రతిసారి పతకాల పట్టికలో భారత్ ఎక్కడుందో చూసుకునేవాళ్లం..! కానీ ఇప్పుడు భారత్కి మెడల్స్ సాధించిన పెట్టిన వాళ్లలో ఆ రాష్ట్రం ఆటగాళ్లు ఎంతమంది అనేది ఇప్పుడు లెక్కేసుకుంటున్నాం…! ఎందుకంటే గత కొద్దికాలంగా అక్కడి ఛాంపియన్లు ప్రతిచోట మువ్వెన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు..! భారతీయుల బంగారు కలను సాకారం చేశాడు నీరజ్చోప్రా..! సొంతూరు పానిపట్.. రాష్ట్రం.. హర్యానా…. రెజ్లింగ్లో ఫైనల్ వరకు వెళ్లి వెండి…
తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర నీరజ్ చోప్రాను బాహుబలి అంటూ ప్రశంసించారు. ఈ క్రమంలో ఓ ట్విటర్ యూజర్ నీరజ్ చోప్రాకు మహీంద్ర కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్న ఎస్యూవీ శ్రేణికి చెందిన ఎక్స్యూవీ 700ని ఇవ్వాలిసిందిగా అభ్యర్థించాడు. రితేష్ అభ్యర్థనను అంగీకరించిన ఆనంద్ మహీంద్ర.. ”తప్పకుండా ఇస్తానని ప్రకటించాడు. స్వర్ణం సాధించిన మా అథ్లెట్కు ఎక్స్యూవీ…
మీరాభాయ్ చాను నుంచి నీరజ్ చోప్రా వరకు…! టోక్యో ఒలింపిక్స్లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. పతకాల పట్టికలోనూ మెరుగైన స్థానం దక్కించుకుంది. మెడల్స్ లెక్కల్లోనూ కొత్త మార్క్ను సెట్ చేసింది. ఇప్పటివరకు ఒలింపిక్స్లో భారత్ ఆరు పతకాలు గెలవడమే రికార్డుగా ఉండేది…?! కానీ ఆ రికార్డు ఇప్పుడు చెరిగిపోయింది..! టోక్యో వేదిక నుంచి మన క్రీడాకారులు భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండబోతుందన్న ఆశలు రేపారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ .. గతంలో ఎన్నడూ లేనంత…
వందేళ్ల క్రీడా చరిత్రలో అథ్లెట్ విభాగంలో భారత్ తొలి స్వర్ణం గెలుచుకుంది. భారత్ స్వర్ణం గెలుచుకోవడంతో దేశమంతా సంబరాలు చేసుకున్నది. ప్రభుత్వాలు నీరజ్ చోప్రాకు విలువైన బహుమతులు అందిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీలు నీరజ్ చోప్రాకు ఖరీదైన బహుమతులు అందిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, నీరజ్ పేరు ఉన్న వారికి కొన్ని చోట్ల ఉచిత పెట్రోల్ ఆఫర్ను ప్రకటించాయి. గుజరాత్లోని భరూచ్లోని ఒ పెట్రోల్ బంకులో ఉచిత పెట్రోల్ ఆఫర్ను ప్రకటించింది. సోమవారం సాయంత్రం 5…