పాకిస్తాన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో ఐఎస్ఐఎస్కు చెందిన ఇద్దరు కీలక కమాండర్లు సహా ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా పెద్ద ఉగ్రవాద కుట్రను భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం పేర్కొన్నారు.
ముంబై నుంచి అమృత్సర్ వెళ్తున్న గోల్డెన్ టెంపుల్ రైలులో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసు బలగాలు అలర్ట్ అయ్యారు. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
జమ్ముకాశ్మీర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. షోపియాన్ జిల్లాలో బీహార్ కు చెందిన ముగ్గురు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపేశారు. ఈ ఘటన గగ్రాన్ అనే ప్రాతంలో జరిగింది. దీనిపై సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు, ఆర్మీ అధికారులు చుట్టుముట్టాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని అన్మోల్ కుమార్, పింటూ కుమార్ ఠాకూర్, హీరాలాల్ యాదవ్ గా పోలీసులు తెలిపారు.
ఉగ్రవాద కుట్ర కేసులో దక్షిణ కశ్మీర్లోని ఐదు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం సోదాలు నిర్వహించింది. ఈ ఏడాది మేలో జమ్మూ కాశ్మీర్లోని బుద్గామ్, షోపియాన్, పుల్వామా, శ్రీనగర్, అనంత్నాగ్ జిల్లాల్లోని 13 ప్రాంతాల్లో కూడా ఎన్ఐఏ భౌతిక, సైబర్స్పేస్ ద్వారా ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నిన కేసులో సోదాలు నిర్వహించింది.
ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఇద్దరిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలం రేపింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారు గోదావరిఖనిలోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారన్న సమాచారం అందుకున్న గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం మంగళవారం రాత్రి మహమ్మద్ జావిద్ తో పాటు అతని కూతురు ఖతిజాను అదుపులోకి తీసుకున్నారు.
భారత్ లో ఉగ్రవాదులు పలు రాష్ట్రాలపై నజర్.. హైదరాబాద్–భోపాల్లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు విచారణను మధ్యప్రదేశ్ లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు, జాతీయ దర్యాప్తు సంస్థ ముమ్మరం.
Terrorists: ఈ మధ్య కాలంలో మధ్య ప్రదేశ్లో వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిని కేంద్ర నిఘా సంస్థ ఎన్ఐఏ అరెస్టు చేస్తోంది. అందులో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం జబల్పూర్లోని 13 ప్రాం తాల్లో ఎన్ఐఏ సోదాలు చేసి, జేఎంబీ ఉగ్రసంస్థకు చెందిన వారిని అరెస్టు చేసింది. ఇదే నెలలో హిజ్బ్ ఉత్ తహ్రీర్కు చెందిన 16 మందిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, భోపాల్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్ పోలీసులు అరెస్టు చేశారు. హెచ్యూటీ…
మణిపూర్లో అల్లర్లు రేగిన అనేక ప్రాంతాల్లో పోలీసు కమాండోలు ఎనిమిది గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించి సుమారు 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు తమకు నివేదికలు అందాయని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఈరోజు మీడియాతో తెలిపారు.
2008 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నందున జైలు శిక్ష అనుభవిస్తున్న కెనడాకు చెందిన కెనడా వ్యాపారి తహవుర్ రాణాను భారత్కు అప్పగించాలని కాలిఫోర్నియాలోని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. తహవుర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా లాస్ ఏంజిల్స్లోని జిల్లా కోర్టు అనుమతిచ్చింది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా, షోపియాన్లలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో దర్యాప్తులో భాగంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఈ కేసు పాకిస్థాన్ కమాండర్లు లేదా హ్యాండ్లర్ల ఆదేశానుసారం వివిధ నకిలీ పేర్లతో పనిచేస్తున్న టెర్రర్ గ్రూపులు, టెర్రర్ ఫండింగ్, నేరపూరిత కుట్రకు సంబంధించినది.