Tahawwur Rana: ముంబయి పేలుళ్ల నిందితుడు రాణాను భారత్కు అప్పగించాలని అమెరికా కోర్టు తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tahawwur Rana : 2008 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నందున జైలు శిక్ష అనుభవిస్తున్న కెనడాకు చెందిన కెనడా వ్యాపారి తహవుర్ రాణాను భారత్కు అప్పగించాలని కాలిఫోర్నియాలోని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. తహవుర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా లాస్ ఏంజిల్స్లోని జిల్లా కోర్టు అనుమతిచ్చింది. 2020 జూన్ 10న రాణాను అప్పగించాలని భారత్.. అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. భారత్ చేసిన అభ్యర్థనకు బైడెన్ సర్కారు ఇంతకుముందే ఆమోదం తెలపగా.. తాజాగా కోర్టు కూడా రాణాను అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది. ముంబయి పేలుళ్లలో రాణా పాత్ర ఉందని భారత్ చేసిన అభ్యర్థన మేరకు అమెరికా అతడిని అరెస్ట్ చేసింది.
2008లో పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన 26/11 దాడుల్లో అతని పాత్రపై భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరుపుతోంది. ఈ దాడుల్లో అతని పాత్ర ఉన్నందుకు భారతదేశం చేసిన అభ్యర్థన మేరకు అతన్ని అమెరికాలో అరెస్టు చేశారు. దౌత్య మార్గాల ద్వారా అతడిని భారత్కు రప్పించేందుకు చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. కోర్టు విచారణల సందర్భంగా, రాణాకు తన చిన్ననాటి స్నేహితుడు పాకిస్థానీ-అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీకి లష్కరే తోయిబాతో సంబంధం ఉందనే విషయం రాణాకు ముందే తెలుసని, హెడ్లీకి సహాయం చేయడం, అతని కార్యకలాపాలకు రక్షణ కల్పించడం ద్వారా అతను ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తున్నాడని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వాదించారు. రాణాకు హెడ్లీ సమావేశాలు, చర్చించిన అంశాలు, కొన్ని లక్ష్యాలతో సహా దాడుల ప్రణాళిక గురించి తెలుసని మెరికా న్యాయవాదులు కోర్టులో వాదించారు. రాణాకు ముంబయి దాడులకు సంబంధించిన ప్రణాళిక ముందే తెలుసని నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి రాణాను భారత్కు అప్పగించేందుకు అంగీకరించారు. రాణా కుట్రలో భాగమేనని, అతను ఉగ్రవాద చర్యకు పాల్పడే గంభీరమైన నేరానికి పాల్పడి ఉండవచ్చని అమెరికా ప్రభుత్వం నొక్కి చెప్పింది. మరోవైపు రాణా తరపు న్యాయవాది అప్పగింతను వ్యతిరేకించారు.
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
Read Also: Mahinda Rajapaksa: మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై ప్రయాణ నిషేధాన్ని ఎత్తేసిన శ్రీలంక కోర్టు
2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ఆరుగురు అమెరికన్లతో సహా మొత్తం 166 మంది మరణించారు. ఇందులో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు 60 గంటలకు పైగా ముట్టడి చేశారు. ముంబైలోని ప్రముఖ, ముఖ్యమైన ప్రదేశాలలో ప్రజలను దాడి చేసి చంపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 22న అమెరికాలో పర్యటించనుండగా.. దాదాపు నెల ముందు ఈ ఉత్తర్వులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా అగ్రరాజ్యం పేర్కొంది. 2008 ముంబయి ఉగ్రదాడుల దోషులకు శిక్ష పడాలని పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!