Tahawwur Rana: ముంబయి పేలుళ్ల నిందితుడు రాణాను భారత్కు అప్పగించాలని అమెరికా కోర్టు తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tahawwur Rana : 2008 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నందున జైలు శిక్ష అనుభవిస్తున్న కెనడాకు చెందిన కెనడా వ్యాపారి తహవుర్ రాణాను భారత్కు అప్పగించాలని కాలిఫోర్నియాలోని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. తహవుర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా లాస్ ఏంజిల్స్లోని జిల్లా కోర్టు అనుమతిచ్చింది. 2020 జూన్ 10న రాణాను అప్పగించాలని భారత్.. అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. భారత్ చేసిన అభ్యర్థనకు బైడెన్ సర్కారు ఇంతకుముందే ఆమోదం తెలపగా.. తాజాగా కోర్టు కూడా రాణాను అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది. ముంబయి పేలుళ్లలో రాణా పాత్ర ఉందని భారత్ చేసిన అభ్యర్థన మేరకు అమెరికా అతడిని అరెస్ట్ చేసింది.
2008లో పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన 26/11 దాడుల్లో అతని పాత్రపై భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరుపుతోంది. ఈ దాడుల్లో అతని పాత్ర ఉన్నందుకు భారతదేశం చేసిన అభ్యర్థన మేరకు అతన్ని అమెరికాలో అరెస్టు చేశారు. దౌత్య మార్గాల ద్వారా అతడిని భారత్కు రప్పించేందుకు చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. కోర్టు విచారణల సందర్భంగా, రాణాకు తన చిన్ననాటి స్నేహితుడు పాకిస్థానీ-అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీకి లష్కరే తోయిబాతో సంబంధం ఉందనే విషయం రాణాకు ముందే తెలుసని, హెడ్లీకి సహాయం చేయడం, అతని కార్యకలాపాలకు రక్షణ కల్పించడం ద్వారా అతను ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తున్నాడని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వాదించారు. రాణాకు హెడ్లీ సమావేశాలు, చర్చించిన అంశాలు, కొన్ని లక్ష్యాలతో సహా దాడుల ప్రణాళిక గురించి తెలుసని మెరికా న్యాయవాదులు కోర్టులో వాదించారు. రాణాకు ముంబయి దాడులకు సంబంధించిన ప్రణాళిక ముందే తెలుసని నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి రాణాను భారత్కు అప్పగించేందుకు అంగీకరించారు. రాణా కుట్రలో భాగమేనని, అతను ఉగ్రవాద చర్యకు పాల్పడే గంభీరమైన నేరానికి పాల్పడి ఉండవచ్చని అమెరికా ప్రభుత్వం నొక్కి చెప్పింది. మరోవైపు రాణా తరపు న్యాయవాది అప్పగింతను వ్యతిరేకించారు.
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
Read Also: Mahinda Rajapaksa: మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై ప్రయాణ నిషేధాన్ని ఎత్తేసిన శ్రీలంక కోర్టు
2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ఆరుగురు అమెరికన్లతో సహా మొత్తం 166 మంది మరణించారు. ఇందులో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు 60 గంటలకు పైగా ముట్టడి చేశారు. ముంబైలోని ప్రముఖ, ముఖ్యమైన ప్రదేశాలలో ప్రజలను దాడి చేసి చంపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 22న అమెరికాలో పర్యటించనుండగా.. దాదాపు నెల ముందు ఈ ఉత్తర్వులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా అగ్రరాజ్యం పేర్కొంది. 2008 ముంబయి ఉగ్రదాడుల దోషులకు శిక్ష పడాలని పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!