Tahawwur Rana: ముంబయి పేలుళ్ల నిందితుడు రాణాను భారత్కు అప్పగించాలని అమెరికా కోర్టు తీర్పు
Tahawwur Rana : 2008 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నందున జైలు శిక్ష అనుభవిస్తున్న కెనడాకు చెందిన కెనడా వ్యాపారి తహవుర్ రాణాను భారత్కు అప్పగించాలని కాలిఫోర్నియాలోని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. తహవుర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా లాస్ ఏంజిల్స్లోని జిల్లా కోర్టు అనుమతిచ్చింది. 2020 జూన్ 10న రాణాను అప్పగించాలని భారత్.. అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. భారత్ చేసిన అభ్యర్థనకు బైడెన్ సర్కారు ఇంతకుముందే ఆమోదం తెలపగా.. తాజాగా కోర్టు కూడా రాణాను అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది. ముంబయి పేలుళ్లలో రాణా పాత్ర ఉందని భారత్ చేసిన అభ్యర్థన మేరకు అమెరికా అతడిని అరెస్ట్ చేసింది.
2008లో పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన 26/11 దాడుల్లో అతని పాత్రపై భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరుపుతోంది. ఈ దాడుల్లో అతని పాత్ర ఉన్నందుకు భారతదేశం చేసిన అభ్యర్థన మేరకు అతన్ని అమెరికాలో అరెస్టు చేశారు. దౌత్య మార్గాల ద్వారా అతడిని భారత్కు రప్పించేందుకు చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. కోర్టు విచారణల సందర్భంగా, రాణాకు తన చిన్ననాటి స్నేహితుడు పాకిస్థానీ-అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీకి లష్కరే తోయిబాతో సంబంధం ఉందనే విషయం రాణాకు ముందే తెలుసని, హెడ్లీకి సహాయం చేయడం, అతని కార్యకలాపాలకు రక్షణ కల్పించడం ద్వారా అతను ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తున్నాడని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వాదించారు. రాణాకు హెడ్లీ సమావేశాలు, చర్చించిన అంశాలు, కొన్ని లక్ష్యాలతో సహా దాడుల ప్రణాళిక గురించి తెలుసని మెరికా న్యాయవాదులు కోర్టులో వాదించారు. రాణాకు ముంబయి దాడులకు సంబంధించిన ప్రణాళిక ముందే తెలుసని నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి రాణాను భారత్కు అప్పగించేందుకు అంగీకరించారు. రాణా కుట్రలో భాగమేనని, అతను ఉగ్రవాద చర్యకు పాల్పడే గంభీరమైన నేరానికి పాల్పడి ఉండవచ్చని అమెరికా ప్రభుత్వం నొక్కి చెప్పింది. మరోవైపు రాణా తరపు న్యాయవాది అప్పగింతను వ్యతిరేకించారు.
Also Read
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
Read Also: Mahinda Rajapaksa: మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై ప్రయాణ నిషేధాన్ని ఎత్తేసిన శ్రీలంక కోర్టు
2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ఆరుగురు అమెరికన్లతో సహా మొత్తం 166 మంది మరణించారు. ఇందులో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు 60 గంటలకు పైగా ముట్టడి చేశారు. ముంబైలోని ప్రముఖ, ముఖ్యమైన ప్రదేశాలలో ప్రజలను దాడి చేసి చంపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 22న అమెరికాలో పర్యటించనుండగా.. దాదాపు నెల ముందు ఈ ఉత్తర్వులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా అగ్రరాజ్యం పేర్కొంది. 2008 ముంబయి ఉగ్రదాడుల దోషులకు శిక్ష పడాలని పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో