Terrorist: ఆ రాష్ట్రాలపై నజర్ పెట్టిన ఉగ్రవాదులు..?
భారత్ లో ఉగ్రవాదులు పలు రాష్ట్రాలపై నజర్ పెట్టినట్లు తెలుస్తుంది. అయితే హైదరాబాద్–భోపాల్లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు విచారణను మధ్యప్రదేశ్ లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అధికారులు, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ముమ్మరం చేసింది. ఈ కేసును ఢిల్లీ యూనిట్ గత నెల 24న రీ–రిజిస్టర్ చేసింది. దీని దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక ఎన్ఐఏ బృందం నిన్న (సోమవారం) ఢిల్లీ నుంచి భోపాల్ కు చేరుకుంది.
Also Read: Durga stotra: ఈ స్తోత్రాలు వింటే అనంతమైన పుణ్యం లభిస్తుంది
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
- AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అధికారులతో సమావేశమైన ఈ టీమ్.. కేసులో అనేక విషయాలను ఆరా తీస్తుంది. గత నెల 9న.. ఏటీఎస్ అధికారులు హైదరాబాద్లో ఐదుగురు, భోపాల్లో 11 మందిని అరెస్టు చేశారు. హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (HUT) ఉగ్ర సంస్థకు చెందిన ఈ మాడ్యుల్ షరియత్ స్థాపనే లక్ష్యంగా విధ్వంసాలకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Odisha Train Accident: రైలు ప్రమాదంపై ప్రారంభమైన సీబీఐ దర్యాప్తు.. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు
హిజ్బ్ ఉత్ తెహ్రీర్ టార్గెట్లో అనేక ప్రాంతాలతో పాటు మత నాయకులు కూడా ఉన్నట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఉగ్రవాదులు తెలంగాణ, మధ్యప్రదేశ్తో పాటు ఏయే రాష్ట్రాలను టార్గెట్గా చేసుకున్నారనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పేలుడు పదార్థాలనూ ఏటీఎస్.. ఎన్ఐఏ అధికారులు సమీకరిస్తున్నారు. అసలు కుట్ర ఏమిటి అన్నదానిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
Also Read: Sanjay Raut: మోడీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే బాలాసోర్ రైలు దుర్ఘటన
ఈ 16 మంది ఉగ్రవాదులను అధికారులు ఇప్పటికే రెండుసార్లు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఎన్ఐఏ అధికారులు సైతం హైదరాబాద్, భోపాల్లకు చెందిన మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్లతో పాటు మిగిలిన వారినీ మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని చూస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో వీరిని హైదరాబాద్ తీసుకురావాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించింది.
తాజావార్తలు
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!