Manipur: 8 గంటల ఆపరేషన్.. 40 మంది ఉగ్రవాదులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: మణిపూర్లో అల్లర్లు రేగిన అనేక ప్రాంతాల్లో పోలీసు కమాండోలు ఎనిమిది గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించి సుమారు 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు తమకు నివేదికలు అందాయని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఈరోజు మీడియాతో తెలిపారు.
“ఉగ్రవాదులు పౌరులపై ఎం-16, ఏకే-47 అసాల్ట్ రైఫిల్స్, స్నిపర్ గన్లను ఉపయోగిస్తున్నారు. వారు ఇళ్లను తగలబెట్టడానికి చాలా గ్రామాలకు వచ్చారు. సైన్యం, ఇతర భద్రతా దళాల సహాయంతో వారిపై చాలా బలమైన చర్య తీసుకోవడం ప్రారంభించాము. దాదాపు 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు మాకు నివేదికలు అందాయి” అని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఈరోజు విలేకరులతో అన్నారు.
ఉగ్రవాదులు నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరుపుతున్నారన్న సీఎం.. మణిపూర్ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సాయుధ ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య పోరాటం జరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు ఇంఫాల్ లోయ, చుట్టుపక్కల ఐదు ప్రాంతాలపై తిరుగుబాటుదారులు ఏకకాలంలో దాడి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సెక్మాయ్, సుగ్ను, కుంబి, ఫాయెంగ్, సెరౌ, మరిన్ని ప్రాంతాల్లో కాల్పులు జరుగుతున్నాయని, వీధుల్లో మృతదేహాలు పడి ఉన్నాయని నివేదికలు తెలిపాయి. సెక్మాయ్ వద్ద కాల్పులు ముగిశాయి. రాష్ట్ర రాజధాని ఇంఫాల్లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) వైద్యులు ఫాయెంగ్లో జరిగిన కాల్పుల్లో గాయపడిన 10 మందికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఖుమంతెం కెన్నెడీ(27) అనే ఒక రైతు, బిషెన్పూర్లోని చందోన్పోక్పిలో జరిగిన కాల్పుల్లో బుల్లెట్ గాయాలు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని రిమ్స్కు తరలిస్తున్నారని, మరింత మంది ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. కెన్నెడీకి అతని భార్య, పాప, కుమారుడు ఉన్నారు.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
Read Also: PM Modi: బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని కీలక భేటీ.. ఆ ఎన్నికలే ఎజెండా.. .
హోంమంత్రి అమిత్ షా సోమవారం మణిపూర్లో పర్యటించనున్నారు. ప్రశాంతత, శాంతిని కొనసాగించాలని, సాధారణ స్థితిని తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన ఇప్పటికే కుకీలకు విజ్ఞప్తి చేశారు. భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాష్ట్రానికి వెళ్లారు.షెడ్యూల్డ్ తెగల (ST) కేటగిరీలో చేర్చాలన్న మీటీస్ డిమాండ్పై ఇంఫాల్ లోయ చుట్టుపక్కల నివసించే మెయిటీలు, కొండల్లో స్థిరపడిన కుకీ తెగల మధ్య కొనసాగుతున్న జాతి హింస 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయింది. మే 3న ఘర్షణ మొదలైంది. మణిపూర్లో అప్పట్నుంచి 25 రోజులకు పైగా ఇంటర్నెట్ లేదు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!