Pakistan: పాకిస్థాన్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు ఐఎస్ఐస్ కమాండర్లు సహా 7గురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో ఐఎస్ఐఎస్కు చెందిన ఇద్దరు కీలక కమాండర్లు సహా ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా పెద్ద ఉగ్రవాద కుట్రను భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం పేర్కొన్నారు. ఈ ప్రావిన్స్లోని వివిధ జిల్లాల్లో నిర్వహించిన పలు ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యకలాపాలలో ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులకు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ (CTD) అరెస్టు చేసింది.
Also Read: Udhayanidhi Stalin: కుల విభేదాలను మాత్రమే ఖండించా.. మళ్లీ మళ్లీ అదే చేస్తా..
Also Read
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ప్రావిన్స్ అంతటా 49 ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యకలాపాలను నిర్వహించింది. ఈ సమయంలో ఐఎస్ఐఎస్కు చెందిన ఇద్దరు కమాండర్లు షాహిద్ హుస్సేన్, సియాఫుల్ దిన్ సహా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్, లష్కరే-జాంగ్వీలకు చెందిన ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ప్రతినిధి తెలిపారు. . ఇద్దరు కమాండర్లు పంజాబ్లో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రావిన్స్లోని ముఖ్యమైన ఇన్స్టాలేషన్లు, ఇతర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీరిపై పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. వారి నుంచి 3,100 గ్రాముల పేలుడు పదార్థాలు, 14 డిటోనేటర్లు, 10 అడుగుల రక్షణ ఫ్యూజ్ వైర్, నిషేధిత సాహిత్యం, సెల్ ఫోన్లు, నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Mamata Banerjee: మనం ప్రతి మతాన్ని గౌరవించాలి.. ఉదయనిధి వ్యాఖ్యలపై దీదీ స్పందన
గత శనివారం పంజాబ్ ప్రావిన్స్లోని లాహోర్, షేక్పురాలో ఐదుగురు మహిళా ISIS ఉగ్రవాదులను CTD అరెస్టు చేసింది. “కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ బృందాలు దాష్ మహిళల రహస్య స్థావరాలపై దాడి చేసి లాహోర్లో ముగ్గురిని, షేక్పురాలో ఇద్దరిని (లాహోర్కు 50 కిలోమీటర్ల దూరంలో) అరెస్టు చేశాయి” అని CTD తెలిపింది. వారి నుంచి ఆయుధాలు, నగదు, నిషేధిత సాహిత్యం, సెల్ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మహిళలు దాష్లో చురుకైన సభ్యులని, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటున్నారని పేర్కొంది.గత నెలలో, పంజాబ్లోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యకలాపాలలో నిషేధిత సంస్థలకు చెందిన 20 మంది ఉగ్రవాదులను CTD అరెస్టు చేసింది.
తాజావార్తలు
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!