Pakistan: పాకిస్థాన్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు ఐఎస్ఐస్ కమాండర్లు సహా 7గురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో ఐఎస్ఐఎస్కు చెందిన ఇద్దరు కీలక కమాండర్లు సహా ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా పెద్ద ఉగ్రవాద కుట్రను భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం పేర్కొన్నారు. ఈ ప్రావిన్స్లోని వివిధ జిల్లాల్లో నిర్వహించిన పలు ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యకలాపాలలో ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులకు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ (CTD) అరెస్టు చేసింది.
Also Read: Udhayanidhi Stalin: కుల విభేదాలను మాత్రమే ఖండించా.. మళ్లీ మళ్లీ అదే చేస్తా..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ప్రావిన్స్ అంతటా 49 ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యకలాపాలను నిర్వహించింది. ఈ సమయంలో ఐఎస్ఐఎస్కు చెందిన ఇద్దరు కమాండర్లు షాహిద్ హుస్సేన్, సియాఫుల్ దిన్ సహా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్, లష్కరే-జాంగ్వీలకు చెందిన ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ప్రతినిధి తెలిపారు. . ఇద్దరు కమాండర్లు పంజాబ్లో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రావిన్స్లోని ముఖ్యమైన ఇన్స్టాలేషన్లు, ఇతర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీరిపై పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. వారి నుంచి 3,100 గ్రాముల పేలుడు పదార్థాలు, 14 డిటోనేటర్లు, 10 అడుగుల రక్షణ ఫ్యూజ్ వైర్, నిషేధిత సాహిత్యం, సెల్ ఫోన్లు, నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Mamata Banerjee: మనం ప్రతి మతాన్ని గౌరవించాలి.. ఉదయనిధి వ్యాఖ్యలపై దీదీ స్పందన
గత శనివారం పంజాబ్ ప్రావిన్స్లోని లాహోర్, షేక్పురాలో ఐదుగురు మహిళా ISIS ఉగ్రవాదులను CTD అరెస్టు చేసింది. “కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ బృందాలు దాష్ మహిళల రహస్య స్థావరాలపై దాడి చేసి లాహోర్లో ముగ్గురిని, షేక్పురాలో ఇద్దరిని (లాహోర్కు 50 కిలోమీటర్ల దూరంలో) అరెస్టు చేశాయి” అని CTD తెలిపింది. వారి నుంచి ఆయుధాలు, నగదు, నిషేధిత సాహిత్యం, సెల్ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మహిళలు దాష్లో చురుకైన సభ్యులని, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటున్నారని పేర్కొంది.గత నెలలో, పంజాబ్లోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యకలాపాలలో నిషేధిత సంస్థలకు చెందిన 20 మంది ఉగ్రవాదులను CTD అరెస్టు చేసింది.
తాజావార్తలు
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..