బోధన్ మాజీ ఎమ్మెల్యే అమీర్ షకీల్, ఆయన కుమారుడు రహీల్ షకీల్తో పాటు మరో ఇద్దరిపై హైదరాబాద్ పోలీసులు ‘లుక్ అవుట్’ సర్క్యులర్ జారీ చేశారు. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, అంతర్జాతీయ సరిహద్దు చెక్పోస్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. గత ఏడాది డిసెంబర్ 24న సోమాజిగూడ ప్రజాభవన్ ఎదుట మద్యం మత్తులో ఉన్న రహీల్ షకీల్ తన కారును పోలీసు బారికేడ్పైకి ఢీకొట్టాడు. అతడిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించగా అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ దుర్గారావు సహాయంతో…
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ అరెస్టు ఎసీబీ అధికారులు. మూడు రోజులపాటు నవీన్ కుమార్ విచారించిన తరువాత ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. నవీన్ కుమార్ బినామీగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ, బాలకృష్ణకు బినామీగా ఉండి ఆస్తులను కూడబెట్టినట్టు గుర్తించారు. ఇప్పటికే శివ బాలకృష్ణ ను ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా ప్రశ్నిస్తోంది ఏసీబీ బృందం. ఇప్పడు ఆయన సోదరుడిని…
పండు ఒక సహజమైన చిరుతిండి. దీని వినియోగం మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే మూలకాలు మన ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వాటి వినియోగం శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బరువును తగ్గించడంలో నారింజ పండు మంచిగా పనిచేస్తుంది. దీనిలో ఉండే.. విటమిన్ సి, ఈ సిట్రస్.. చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా…
ఎవరైనా వివాహ వార్షికోత్సవాన్ని అందంగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అందరి సమక్షంలో వేడుకను జరుపుకుంటారు. కానీ ఈ జంట వినూత్న రీతిలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరంలోని నాగ్లా కాలీ ప్రాంతంలో రోడ్డుపై మురికి కాలువ, చెత్తాచెదారం మధ్య ఓ జంట వధూవరుల వేషధారణలో తమ 17వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అపరిశుభ్రత, చెత్త కుప్పల వైపు జిల్లా యంత్రాంగం దృష్టిని ఆకర్షించేందుకు దంపతులు ఇలా చేశామని తెలిపారు. దంపతులు ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నట్లు…
కేంద్రప్రభుత్వం రూ.715 కోట్లతో.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. గతేడాది ప్రధానమంత్రి చేతుల మీదుగా.. ఈ రైల్వే స్టేషన్ ను అట్టహాసంగా ప్రారంభించుకున్నసంగతి తెలిసిందే. ఈ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు దక్షిణమధ్యరైల్వే జీఎం, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు దశల్లో స్టేషన్ నిర్మాణ పనులను సంకల్పించగా.. మొదటిదశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రమంత్రి కిషన్…
అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. సెమీస్లో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో.. ఉదయ్ సహారన్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్కు చేరుకుంది. కాగా.. ఈనెల 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే.. పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య సెమీస్ మ్యాచ్ జరిగితే, ఆ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది ఫైనల్ కు చేరుకుంటుంది. ఫైనల్లో ప్రత్యర్థి జట్టును పాకిస్తాన్ ను ఓడించినా.. ఆస్ట్రేలియాను ఓడించినా భారత్…
రాజ్యాంగ బద్ధంగా నియమితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావడాన్ని మింగుడుపడక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో కలిసి మధుయాష్కీ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…
బెంగళూరులో భారత హాకీ జట్టు ఆటగాడిపై పోక్సో కింద కేసు నమోదైంది. భారత హాకీ టీమ్ డిఫెండర్ వరుణ్ కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి గత ఐదేళ్లుగా పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక జ్ఞానభారతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూకంపం వచ్చింది. 10 రోజుల వ్యవధిలో భూకంపం రెండు సార్లు వచ్చింది. న్యాల్కల్ మండలంలో గత నెల 27న భూకంపం రాగా.. కాసేపటి క్రితం పలు చోట్ల భూమి కంపించింది. ఐదు సెకన్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపిచింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు. పది రోజుల వ్యవధిలో రెండుసార్లు భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.
జనవరి 22న రామ్లల్లాకు పట్టాభిషేకం జరిగినప్పటి నుంచి రోజుకు సగటున 2 లక్షల మంది భక్తులు అయోధ్యను సందర్శిస్తున్నారు. దీని కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు సహా ఇతర వ్యాపారాలు పెరిగాయి. అనేక అంతర్జాతీయ బ్రాండ్లు తమ ఔట్లెట్లను అయోధ్యలో తెరవాలని ప్లాన్ చేస్తున్నాయి. డొమినోస్, పిజ్జా హట్ వంటి చైనీస్ ఫుడ్ రెస్టారెంట్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ ఐటెమ్లకు ప్రసిద్ధి చెందిన అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం కేఎఫ్సీ తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తోంది. అయితే..…