తెలంగాణలో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలతో పాటు ఉద్యోగులకు కూడా సెలవులను ప్రకటించింది తెలంగాణ సర్కార్. ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగను పురస్కరించుకొని సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
Breaking News: చరిత్ర సృష్టించిన ఉత్తరాఖండ్.. యూసీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..
అయితే.. షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావించి… ఆ రోజు మసీదులను దీపాలతో అందంగా అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఈ పండగ రోజు మసీదుల్లో ఇస్రా, మేరాజ్ల కథను చెబుతుంటారు మత పెద్దలు. ముస్లింలు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే ఈ పండగ రోజును ప్రభుత్వం సెలవుగా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ మత పెద్దలు. ఇక ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్రకటన విడుదల కావడంతో ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూత పడనున్నాయి. ఇకపోతే ఫిబ్రవరి 8వ తేదీ తర్వాత ఈ నెలలో సాధారణ సెలవులు లేవు. వచ్చే నెల మార్చి నెలలోనే సాధారణ సెలవులు ఉండనున్నాయి.
Bonda Umamaheswara Rao: నేను కబ్జా, రౌడీయిజం చేసుంటే చూపించు.. ఇదే నా సవాల్..!