ఎలక్టోరల్ బాండ్లపై దేశంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ విషయంలో సుప్రీంకోర్టు కఠినమైన తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ని జాబితాలను బహిరంగపరచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల తర్వాత, ఎన్నికల విరాళాలు ఇచ్చే కంపెనీల జాబితా, స్వీకరించే పార్టీల విరాళాల జాబితాను ఎన్నికల సంఘం బహిరంగపరిచింది.
కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల(CRIF) నిధి కింద తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి రూ.850 కోట్లను కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించి మొత్తం 31 రోడ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి కమల్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రతిపాదనల మేరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 4…
త్తగా ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ఈ రోజు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో పబ్లిక్ కార్యకలాపాలను ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నీటి అడుగున ప్రయాణించే మొదటి రైడ్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు క్యూలో నిల్చున్నారు.
దొంగపట్టా ఇచ్చిన దొంగ, మోసగాడు…..దగాకోరు..కొల్లు రవీంద్ర అని ధ్వజమెత్తారు పేర్ని నాని. పేర్ని నాని బతికి ఉన్నంత కాలం పేదొడు దర్జాగా, ధైర్యంగా బ్రతుకుతారు…అలానే బ్రతికిస్తానని పేర్నినాని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడచిన రెండు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పెలుతున్నరు అని ఘాటుగా వ్యాఖ్యానించారు పేర్ని నాని. బలరాంపేట వడ్డెర బస్తీలో పార్కు స్థలం…
విజయవాడలోని పెనమలూరు టీడీపీ సీటు పంచాయితీ సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు బుజ్జగింపు చర్యలు మొదలెట్టింది టీడీపీ అధిష్టానం. మాజీ ఎమ్మెల్యే, పెనమలూరు ఇంఛార్జి బోడే ప్రసాద్కు టికెట్ లేదని చెప్పేసింది అధిష్టానం. దీంతో.. నిన్నటి నుంచి బోడే వర్గం ఆందోళనకు దిగింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబును బోడే ప్రసాద్ కలవనున్నారు. సాయంత్రం నుంచి నియోజక వర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టే దిశగా ప్లాన్ చేస్తున్నారు బోడే ప్రసాద్.. అయితే..…
ప్రణీత్ రావు కేసులో ట్విస్ట్.. బయటపడ్డ ఫోన్ ఛాటింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణీత్ రావ్ ఫోన్ చాటింగ్ చిత్రాలు ఎన్ టివి చేతికి చిక్కాయి. ఎన్నికల ముందు ప్రణీతరావు కొంతమంది వ్యక్తుల ఫోన్లు టాప్ చేసినట్లు చాటింగ్ లో వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాలతో ప్రణీత్ రావు టాపింగ్ కు పాల్పడ్డాడు. బీఆర్ఎస్ నేత…
ఏపీపీఎస్సీలో అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తి చేశారు. 2018లో జరిగిన గ్రూప్-1 పరీక్షల వాల్యూయేషన్లో అక్రమాలు జరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 వాల్యూయేషన్లో అక్రమాలపై ఆధారాలను చంద్రబాబు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం యువతను దగా చేసిందని ఆరోపించారు. ఏపీపీస్సీలో అక్రమాలు చేసి యువత గొంతు నులిమేశారని, కృూర మృగాల మాదిరి పిల్లల జీవితాలను నాశనం చేశారన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా రాష్ట్రంలో కీలక పోస్టులను భర్తీ చేస్తారని,…
ఏపీలో రాజకీయం రోజుకో ములుపు తీసుకుంటోంది. టీడీపీ జనసేతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తుంటే.. బీజేపీ సైతం కలవడంతో కూటమిగా బలపడింది. అయితే.. ఈ నేపథ్యంలోనే సీట్ల పంపకాల్లో ఆయా పార్టీల ఆశావహులు భంగపడి మరో పార్టీలోకి పయనమవుతున్నారు. ఇప్పటికే టీడీపీ రెండో అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో పలువురు టీడీపీ రాజీనామా చేశారు. అంతేకాకుండా కొందరు అధికార వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. వైసీపీలోనూ అసంతృప్తితో రగులుతున్న నేతలు లేకపోలేదు. అయితే.. ఇప్పటికే…
ఏపీలో టికెట్ల పంచాయితీ కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టికెట్ల రచ్చ మొదలైంది. బెజవాడ వెస్ట్ టికెట్ బీజేపీకి వెళ్ళే అవకాశాలు ఉండటంతో ఆందోళనకు దిగింది జనసేన. పోతిన మహేష్ కి టికెట్ ఇవ్వాలనీ ఆందోళనకు దిగింది మహేష్ వర్గం. మైలవరం టికెట్ టీడీపీ నేత బొమ్మసాని సుబ్బా రావుకి ఇవ్వాలని ఆయన వర్గం గొల్లపూడిలో ఆందోళన చేపట్టారు. టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి పెట్టే ఆలోచనలో పెనమలూరు టీడీపీ ఇంఛార్జి బోడె ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. బోడె కి…
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. రేపే వైసీపీ ఫైనల్ అభ్యర్థుల లిస్ట్ను ప్రకటించనుంది. అంతేకాకుండా.. సీఎం జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధమైంది. రేపు ఇడుపులపాయకు సీఎం జగన్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే.. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నారు. తర్వాత ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్. అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో జగన్…