TDP : ప్రజా గళం సభకు ఏర్పాట్లు పూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు లో ప్రజా గళం పేరుతో ఉమ్మడి పార్టీలు నిర్వహిస్తున్న భారీ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి… …. చిలకలూరిపేట మండలం బొప్పూడి ప్రాంతంలో నేడు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహించే తొలి బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు… ఈ సభలో ఉమ్మడి పార్టీల అధినేతలు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లు పాల్గొని ప్రసంగిస్తారు … లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు . .300 ఎకరాల ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదిక సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు… ఈ సభ ద్వారా 2024 ఎన్నికల ప్రచార నగరా మోగించడానికి ఉమ్మడి పార్టీలు సంసిద్ధమవుతున్నాయి…
భారీ సెట్టింగ్లు …ఐదు హెలిపాడ్లు ,యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం అవుతున్న తాత్కాలిక రోడ్లు.. ఇది ప్రస్తుతం చిలకలూరిపేట మండలం బొప్పూడి ప్రాంతంలో జరుగుతున్న ప్రజాగలం సభకు చేస్తున్న ఏర్పాట్లు…… ఎన్నికల ప్రచారం భాగంలో నరేంద్ర మోడీ పల్నాడు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి ….ప్రజాగాళం పేరుతో ఉమ్మడి పార్టీలు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ,జనసేన ని పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికపై ప్రసంగిస్తారు ….రాష్ట్రంలో పరిస్థితులు, రాబోయే ఎన్నికల్లో కూటమికి ఎందుకు ఓటు వేయాలని అంశంపై ప్రజలను ఉద్దేశించి ముగ్గురు నేతలు ప్రసంగించనున్నారు…. ఈ నేపథ్యంలో భారీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 4000 మంది సిబ్బందితో ప్రధానమంత్రికి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు… ఏడుగురు ఐపీఎస్ అధికారులు ప్రధాని భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు…..ప్రధానమంత్రి రాకకు అనువుగా మూడు హెలిపాడ్లతో పాటు అదనంగా మరో రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు హెలిపాడ్ ను సిద్ధం చేసారు…. ఇప్పటికే ఆర్మీకి చెందిన హెలికాప్టర్లు బొప్పూడి ప్రాంతంలో చక్కర్లు కొడుతున్నాయి….. ప్రధానమంత్రి ప్రయాణించే హెలికాప్టర్లు ఇప్పటికే ట్రైల్ రన్ పూర్తి చేసుకున్నయి….నేషనల్ హైవే కి ఆనుకొని బొప్పూడి సభా ప్రాంగణానికి వెళ్లేందుకు అనువుగా రోడ్ల నిర్మాణం జరుగుతుంది…. ప్రధానమంత్రి పర్యటనకు భద్రత అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ ఏర్పాట్లు చేస్తున్నారని, లక్షలాదిమంది ప్రజలు హాజరైన నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు 13 కమిటీలు నిర్విరామంగా పనిచేస్తున్నాయని పార్టీ ల నాయకులు చెప్తున్నారు…..
తాజావార్తలు
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?