పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నిర్మల దేవి ఫంక్షన్ హాల్లో గౌడ, శెట్టిబలిజ కుల సంఘాల నాయకులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ తరహాలో ఐదు ఉపకులాలు కలిపి గౌడ కులం ఒక్కటే ఉండాలనేది తన కోరిక అన్నారు. అందుకు బీసీలు అంతా ఏకం కావాలని తెలిపారు. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా అన్ని కులాల వారికి జనసేనలో అవకాశం ఇస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.…
జయవాడ దుర్గగుడి పాలకమండలి ఇవాళ సమావేశమైంది. అందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. దేవస్ధానంలో NMR లుగా పదుల సంవత్సరాలుగా కొనసాగుతున్న వారిని పర్మినెంట్ చేయాలని నిర్ణయించామన్నారు. మొత్తం 50 మంది NMR లు దుర్గ గుడిలో పని చేస్తున్నారని.. 50 శాశ్వత ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చైర్మన్ పేర్కొన్నారు.
నసేన అధినేత పవన్ కల్యాణ్ పై దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. మాకు తొడలు కొట్టి మీసాలు తిప్పడం రాదు. నాయకుడంటే ఆదర్శం కావాలి, జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం కాదని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. యువతకు పవన్ కల్యాణ్ చెడు సందేశం ఇస్తున్నాడని.. పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. మీరు కూడా 40 పెళ్లిళ్లు చేసుకోండనే సందేశంతో ఆడపిల్లల తల్లిదండ్రులు బాగోద్వేగానికి గురవుతున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై గతంలో ఆరోపణలు చేసిన షేజల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో ఆదినారాయణ రావు షేజల్ ను పెద్దమ్మతల్లి గుడి వద్ద వదిలివెళ్లాడు. ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శేజల్.. ఇవాళ మరోసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అయితే తన దగ్గర సరైన ఆధారాలు లేవు అన్న మాటలకి షేజల్ మనస్థాపం చెంది.. నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది.
టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కేయూ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున TS ICET 2023 ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య టి.రమేశ్ వరంగల్లో విడుదల చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కత్తి పోట్లు కలకలం దుమారం రేపాయి. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టపగలే కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. జనాలు చూస్తు్ండగానే ఆ దుండగులు ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
హింసతో రగిలిపోతున్న మణిపూర్లో రెండురోజులపాటు పర్యటించేందుకు రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో గురువారం అక్కడికి చేరుకున్న రాహుల్కు ఊహించని పరిణామం ఎదురైంది.
బీహార్ ప్రభుత్వం కార్యాలయాల్లో కొనసాగుతున్న సంస్కృతికి విరుద్ధంగా ఉన్నందున కార్యాలయంలో జీన్స్, టీ-షర్టులు వంటి సాధారణ దుస్తులను ధరించవద్దని రాష్ట్ర విద్యా శాఖ సిబ్బందికి తెలిపింది. టీషర్టులు, జీన్స్లతో కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులకు మినహాయింపు ఇస్తూ విద్యాశాఖ డైరెక్టర్ (పరిపాలన) బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ వారం ప్రారంభంలో రుతుపవనాలు వచ్చినందున ఢిల్లీ-ఎన్సిఆర్లో గురువారం వర్షం, మేఘావృతమైన ఆకాశం కనిపించింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 23.5 డిగ్రీల సెల్సియస్ కాగా.. గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీ మెట్రో.. వివాదాలకు కేరాఫ్ అడ్డగా మారింది. ఇప్పటి వరకు పాటలు, రీల్స్, లవ్ స్టోరీలు, ముద్దుల వీడియోలు మాత్రమే మనం చూశాం.. కానీ తాజాగా ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ మెట్రోలోని కోచ్ రణరంగంగా మారిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే.. ఈ గొడవపై మెట్రో అధికారులు స్పందించారు.