ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేసే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించినట్లు సమాచారం.
మెక్సికో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ (122 ఫారెన్హీట్)కి చేరుకోవడంతో వేడి సంబంధిత కారణాల వల్ల మెక్సికోలో గత రెండు వారాల్లో కనీసం 100 మంది మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ధ్వజమెత్తారు. మణిపూర్లో పరిస్థితికి రాహుల్ గాంధీ ప్రస్తుత విభేదాలను పెంచడం కంటే కరుణ అవసరమని అన్నారు.
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్తో కలిసి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన 2019 ప్రయోగం విఫలమైందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గురువారం అన్నారు.
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ రాష్ట్రంలో పెద్దఎత్తున అల్లర్లకు కారణంగా మారింది. గత రెండు నెలలుగా మైయిటీ, కూకీ తెగల మధ్య ఘర్షణ రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది.
వందే భారత్ రైలు ప్రయాణీకులకు సౌకర్యాన్ని కల్పిస్తోంది. సమయాన్ని ఆదా చేస్తోంది. దీంతో ప్రజలు విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ నివేదిక విడుదలైంది. కాసర్గోడ్-త్రివేండ్రం వందే భారత్ రైలు ప్రయాణికుల ఆదరణలో అగ్రస్థానాన నిలుస్తోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు. ఆయన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం భారత ఆర్థిక వ్యవస్థపై నిజంగా ఆకట్టుకునే ప్రభావాన్ని చూపిందని అన్నారు.
మహబుబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ బీజేపీ బహిరంగ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్టంలోని అన్ని నియోజకవర్గాలలో మహాసభలు పెడుతున్నట్లు తెలిపారు. బీజేపీ 9 ఏళ్లలో చేసిన అభివృద్దిని ప్రజలకు చేరువ చేయడమే కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా వుండటం మనం చేసుకున్న అదృష్టమని బండి సంజయ్ అన్నారు. దేశ ప్రధాని బాత్ రూంల గురించి మాట్లాడితే…
జులై మొదటి వారంలో కేంద్రమంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జూలై 17 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కేంద్రమంత్రివర్గంలో మార్పులు జరుగనున్నాయి. అయితే ఈసారి జరిగే మంత్రివర్గ కూర్పులో తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం ఉంది..!.
విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన రియల్టర్ శ్రీనివాస్ కిడ్నాప్ ను పోలీసులు చేధించారు. అయితే ఈ వ్యవహారంపై నగర సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బాధితులు, నిందితులు పరిచయస్తులేనని ఆయన తెలిపారు. వీరికి విజయవాడలో పరిచయాలు ఉన్నాయని.. వీరు 2019లో విజయవాడలో ఎంకే కన్స్ట్రక్షన్స్ పేరిట వ్యాపారం నడిపారని త్రివిక్రమ్ వర్మ చెప్పారు.