Home
Telugu News
Telugu News News
-
Kunamneni Sambasiva Rao: సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం తగదు..
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. అనంతరం.. కుటుంబ సభ్యులను బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం తగదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.. సినీ రంగంలో మార్పులు చేర్పులు అవసరం అని కూనంనేని సాంబశివరావు అభిప్రాయ పడ్డారు. -
ICC U19 Women’s T20 WC 2025: టీ 20 ప్రపంచ కప్ కోసం భారత మహిళల జట్టు ప్రకటన..
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. భారత మహిళల అండర్-19 జట్టుకు నిక్కీ ప్రసాద్ కెప్టెన్గా వ్యవహరించనుంది. వైస్ కెప్టెన్గా సానికా చాల్కే వ్యవహరించనుంది. ఈ టోర్నమెంట్ 18 జనవరి 2025 నుండి 2 ఫిబ్రవరి 2025 వరకు మలేషియాలోని కౌలాలంపూర్లో జరుగుతుంది. -
iPhone: ఐఫోన్ ఈ మోడల్స్పై ఫ్లిప్కార్ట్ సేల్లో భారీ తగ్గింపు.. డిటేల్స్ ఇవే..!
ఐఫోన్ లవర్స్కు మరో శుభవార్త.. ఫ్లిప్కార్ట్లో జరుగుతున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్లో ఆపిల్ ఐఫోన్ను చౌకగా కొనుగోలు చేసే అవకాశం లభించిది. ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో ధరలను తగ్గించింది. ఐఫోన్ 15 యొక్క 128 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 57,999 కాగా.. ఐఫోన్ 15 ప్రోని రూ. 1,03,999కి కొనుగోలు చేయవచ్చు. -
America: దత్తపుత్రులపై అత్యాచారానికి పాల్పడిన స్వలింగ సంపర్కుల జంట.. వందేళ్ల జైలు శిక్ష
అమెరికాలోని జార్జియాలో స్వలింగ సంపర్కుల జంటకు కోర్టు శిక్ష విధించింది. తమ దత్తపుత్రులను లైంగికంగా వేధించిన కేసులో దోషిగా తేలిన ఓ 'గే జంట'కు 100 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇద్దరు ముద్దాయిలు విలియం డేల్ జుల్లాక్, జాచరీ జుల్లాక్లకు శిక్ష విధించినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. -
Hyderabad: ర్యాష్ డ్రైవింగ్కి మరో యువతి బలి..
ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్తో మరో యువతి బలి అయింది. ర్యాష్ డ్రైవింగ్ ఓ ప్రాణాన్ని మింగేసింది. హైదరాబాద్లోని రాయదుర్గం పరిధిలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీటెక్ స్టూడెంట్ శివాని (21) అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ పై వెళ్తుండగా స్కోడా కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. -
HYDRA: చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదు.. రంగంలోకి రంగనాథ్
నగరంలోని పలు చెరువులను హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదుల రావడంతో రంగనాథ్ తనిఖీలు చేపట్టారు. నానక్రామ్ గూడకు చేరువలో ఉన్న తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగ్లోని నెక్నాంపూర్ చెరువుల ఆక్రమణలపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
U23 State Trophy: మెరిసిన యువ సంచలనం.. 21 పరుగులిచ్చి 8 వికెట్లు తీసిన ఢిల్లీ ప్లేయర్
బీసీసీఐ నిర్వహిస్తున్న పురుషుల అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో యువ స్పిన్నర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రాంచీలోని మెకాన్ స్టేడియంలో జరిగిన 50 ఓవర్ల వన్డే మ్యాచ్లో ఢిల్లీ అండర్-23 జట్టు 8 వికెట్ల తేడాతో కేరళ అండర్-23పై విజయం సాధించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు రౌనక్ బఘేలా ధాటికి 25.4 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ రౌనక్ బఘేలా 7.4 ఓవర్లలో 2… -
Tragedy: ఇటుక బట్టీ గోడ కూలి నిద్రిస్తున్న నలుగురు చిన్నారులు మృతి..
హర్యానాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని నలుగురి చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తాము నిద్రిస్తున్న సమయంలో ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్లారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు తీవ శోక సంద్రంలో మునిగిపోయారు... -
Rajasthan: 700 అడుగుల లోతు బోరుబావిలో పడ్డ మూడేళ్ల బాలిక.. పదిరోజుల్లో రెండోది
రాజస్థాన్లోని కోట్పుత్లీలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం మూడేళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. బోరుబావి 700 అడుగుల లోతు ఉంది. మొదట్లో దాదాపు 15 అడుగుల లోతులో ఉన్న బాలిక ఒక్కసారిగా జారి కిందకు వెళ్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భూపేంద్ర చౌదరి కుమార్తె చేతనా చౌదరి ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో.. ప్రమాదవశాత్తు కాలు జారి తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
Health: వెల్లుల్లిని ఆహారంలో కాకుండా ఇలా తినండి.. రోగాలకు చెక్ పెట్టండి
వెల్లుల్లి ఒక సహజ ఔషధం. వెల్లుల్లిని సరైన మోతాదులో వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిని ఆహార పదార్థాల్లో రుచి కోసం వాడుతారు. ముఖ్యంగా మాంసాహార వంటకాల్లో వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల రుచితో పాటు వాసనను తగ్గిస్తుంది.
తాజావార్తలు
-
TVK Vijay: టీవీకే అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టు షాక్.. నోటీసులు జారీ..
-
Groww Q4 Results: స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన గ్రో.. లాభాల పంట పండించిన ఈ షేరు గురించి తెలుసా?
-
Tragedy : మంచిర్యాలలో ఘోరం.. రూ.100 ఇవ్వలేదని ప్రాణం తీసిన దుండగుడు.!
-
Chiranjeevi: “గుండె ఎడమ వైపు కాదు.. కుడి వైపు! ‘చిరంజీవి’ మూవీ షాకింగ్ కాన్సెప్ట్!
-
Dell 15 2026: ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్, 15.6-అంగుళాల డిస్ప్లేతో.. డెల్ 15 2026 ల్యాప్టాప్ విడుదల
ట్రెండింగ్
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
-
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!